Chandrababu: కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణం కేంద్రమే చేపట్టాలి: సీఎం చంద్రబాబు

Eenadu icon
By Andhra Pradesh News Team Published : 19 Dec 2025 22:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: రాజధాని అమరాతిని దేశంలోని వేర్వేరు నగరాలతో అనుసంధానించేలా జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను కలపాలని ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రి గడ్కరీని కోరారు. దిల్లీ పర్యటనలో భాగంగా నితిన్‌ గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో నితిన్ గడ్కరీ కృషిని కొనియాడారు. వివిధ ప్రాంతాల కనెక్టివిటీతో పాటు ఆర్ధిక ప్రగతికి సూచికగా జాతీయ రహదారులు నిలిచాయని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ నగరంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిని జాతీయ రహదారులతో ప్రత్యక్ష, పరోక్ష నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

 కృష్ణానదిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. 6 లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన మూలపాడు వద్ద 3 కీలకమైన జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానిస్తుందని తెలిపారు. విజయవాడ- హైదరాబాద్, చెన్నై- కోల్ కతా సహా తీరప్రాంత రోడ్ కారిడార్ తో అమరావతిని ఈ వంతెన అనుసంధానిస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతి వరకూ ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ హైవే హై-స్పీడ్ యాక్సెస్‌ కలిగిస్తుందన్న ముఖ్యమంత్రి.. నగరాల మధ్య కనెక్టివిటీతో పాటు ప్రజలకు ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని  స్పష్టం చేశారు. అమరావతిని జాతీయ రహదారి గ్రిడ్‌లో మొబిలిటీ కేంద్రంగా, లాజిస్టిక్స్ నోడ్‌గా మారుస్తుందని వెల్లడించారు. 

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విశాఖపట్నం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు.
  • షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఓ షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్కే మార్ట్‌ షాపింగ్ మాల్ భవనం వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
  • ‘హెరిటేజ్‌’కు, తిరుమల లడ్డూ అంశానికి సంబంధం ఏంటి?: మంత్రి అచ్చెన్న ఆగ్రహం తిరుమల లడ్డూ అంశంపై మంగళవారం ఏపీ శాసనమండలిలో వాగ్వాదం చెలరేగింది. వైకాపా నేతల ఆరోపణలపై మంత్రి అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • శ్రీవారి లడ్డూ కల్తీకి ప్రాయశ్చిత్తంగా సామూహిక ముడుపులు: శ్రీనివాసానంద సరస్వతి వైకాపా హయాంలో శ్రీవారి లడ్డూ కల్తీ చేసి ఘోర అపచారం చేశారని సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి దుయ్యబట్టారు.
  • మంచినీళ్లు కావాలంటూ వచ్చి.. చోరీ చేసిన మహిళలు అపరిచితులైనా సరే మంచినీళ్లంటూ వస్తే గుక్కెడు నీళ్లిస్తాం! ఆకలేస్తోందని అడిగితే జాలిపడతాం.
  • మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉందా?.. విద్యార్థులతో అయ్యన్న చిట్‌చాట్‌! అసెంబ్లీలో ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఎప్పుడు ఓటింగ్ చేపడతారు? బడ్జెట్‌లో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది? పాఠశాల విద్యార్థులు అడిగిన ఈ ప్రశ్నలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు.
  • బిల్‌గేట్స్‌ పర్యటనపై విషం కక్కుతున్న జగన్‌: మంత్రి పార్థసారథి రాష్ట్ర అభివృద్ధికి జగన్‌ వ్యతిరేకి అనే విషయం మరోసారి నిరూపితమైందని ఏపీ మంత్రి పార్థసారథి విమర్శించారు.
  • ఎమ్మెల్యే ధూళిపాళ్ల తల్లి నివాసంలో భారీ చోరీ గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో భారీ చోరీ జరిగింది.
  • డిజిటల్‌ అటెండెన్స్‌ బాగా పనిచేస్తోంది: స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్‌ చేయాలని ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సూచించారు.
  • ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది.
  • నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం Actress Prathyusha Case: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. సినీ నటి ప్రత్యూష్‌ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశించింది.
  • మదనపల్లెలో విషాదం.. అదృశ్యమైన బాలిక మృతదేహం గుర్తింపు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని ఎదురుగా ఉన్న కులవర్ధన్‌ అనే వ్యక్తి ఇంట్లోనే గుర్తించారు.
  • సంక్షిప్త వార్తలు(16) జోడు రథాలు.. మిన్నంటిన శివనామస్మరణలు.. కిక్కిరిసిన వీధులతో శ్రీకాళహస్తిలో రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.
  • స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రొమానా క్రోపిలోవా మధ్య ఆదాయ దేశాల్లో విద్యలో తీసుకొచ్చిన కొన్ని ఏఐ సాధనాలు విఫలమవుతున్నాయని ఫ్యాబ్‌ ఏఐ ఎడ్యుటెక్‌ డైరెక్టర్‌ రొమానా క్రోపిలోవా తెలిపారు.దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంప్యాక్ట్‌ సమ్మిట్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ..
  • ప్రభుత్వ సేవలు మరింత సులభతరం ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు.
  • సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై దామోదరనాయుడు అప్పీల్‌ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా తన నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డాక్టర్‌ టి.దామోదరనాయుడు దాఖలు చేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
  • వైకాపా హయాంలోని ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అసలైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై ప్రభుత్వం విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కోరారు.
  • జస్టిస్‌ బాలాజికి ఘన సన్మానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ మెడమల్లి బాలాజిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
  • నూజివీడు కోర్టుకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో నమోదైన కేసులో వైకాపాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సోమవారం నూజివీడులోని న్యాయస్థానంలో హాజరయ్యారు.
  • తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, ఇతర నిందితులు బాలరాజు, రాజేష్, మణిమారన్, ఎన్‌.రవి, అన్బురాసు, అల్లాబక్షు కోర్టులో వాయిదాకు హాజరయ్యారు.