అది తీరని కలగానే ఉండిపోయింది.. భారతీరాజా మృతిపై ప్రముఖుల సంతాపం

Eenadu icon
By Entertainment Team Updated : 10 Jun 2026 15:03 IST Ee Font size
  • A
  • A+
  • A++
4 min read

ఇంటర్నెట్‌ డెస్క్: తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) నేడు తుదిశ్వాస విడిచారు. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు రూపొందించిన ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు అంటూ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

‘‘సహజంగా, ఎక్కడా రాజీపడకుండా సినిమా కథను చెప్పే విషయంలో ఒక విప్లవం సృష్టించిన మార్గదర్శి భారతీరాజా గారు. మర్చిపోలేని విధంగా ఆయన తెరపైకి తెచ్చిన గ్రామీణ కథలు, వాస్తవితక ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయి. సినీ ఇండస్ట్రీ ఆయన అసాధారణ కృషి, పనితీరును స్మరించుకోవడం గొప్ప గౌరవం’’ -దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి

‘‘భారతీయ సినిమా రంగం ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను సినిమాగా మలచి మనకు అందించారు భారతీరాజా. ఆయన చిత్రాలు కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయాయి. ఎన్నో తరాల్లో స్ఫూర్తి నింపాయి. ఎన్నో గొప్ప పురస్కారాలు అందుకున్న ఆయన సినిమా రంగానికి చేసిన సేవ అపారమైనది. ‘ఆరాధన’ చిత్రంలో ఆయన దర్శకత్వంలో నటించే అదృష్టం నాకు దక్కింది. సినిమాపై ఆయనకు ఉన్న అంకితభావం నాలోనూ స్ఫూర్తి నింపింది. ఆయన మన మధ్య లేకపోయినా తన గొప్ప చిత్రాల రూపంలో ఎప్పటికీ మన మధ్యే ఉంటారు’’ - చిరంజీవి

‘‘ప్రముఖ దర్శకులు భారతీరాజా కన్నుమూశారనితెలిసి చింతించాను (Bharathiraja Passed Away). ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. భారతీరాజా కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ - పవన్‌ కల్యాణ్‌ ( Pawan Kalyan)

‘‘నిశ్శబ్దంలో సత్యాన్ని చూపిన దర్శకుడు భారతీరాజా. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రకృతిని అందంగా చూపారు. ‘తుడరుమ్’ చిత్రంలో ఆయనతో స్క్రీన్‌ పంచుకోవడం నేను ఎప్పటికీ పదిలపరుచుకునే గౌరవం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన లేని తీర్చలేనిది’’ - మోహన్‌లాల్‌

‘‘భారతీరాజా సర్‌.. మీరు లేని లోటు తీర్చలేనిది. మాపై మీరు చూపిన ప్రేమకి, మాలో మీరు నింపిన స్ఫూర్తికి, ఎన్నో గొప్ప సినిమాలను అందించినందుకు.. అన్నింటికీ ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ -  ప్రకాశ్‌ రాజ్‌

‘‘భారతీరాజా గారి మరణం తీవ్ర విచారకరం. ఆయన ఓ దిగ్గజం, ఆయన దార్శనికత, కథ చెప్పే విధానంతో పాటు భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయి. నేటి దర్శకులు, నటులకే కాదు, రాబోయే తరాలకు ఆయన సినిమాలు స్ఫూర్తి. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ -అల్లు అర్జున్‌

‘‘మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు భారతీరాజా ఇక మన మధ్య లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రసీమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచాయి. భవిష్యత్తులో రానున్న సినిమాలకు ఆయన చిత్రాలు ఓ నిఘంటువులా ఉంటాయి. ప్రతి సినిమా ప్రేమికుడి కోసం ఆయన ఒక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో చూపిస్తూ ఒక సినిమా చేద్దామని ఆయన ఎప్పుడూ అనేవారు. ఆ కల ఇక తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ - ఖుష్బూ

‘‘గొప్ప గొప్ప నటులను దర్శకత్వం వహించిన వ్యక్తి భారతీ రాజా. ‘సీతాకోక చిలుక’ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు మంచి నటీనటులను పరిచయం చేశారు. దర్శకుడు లేనిదే నటులు లేరు. కథ, అందులోని పాత్రలకు ఎవరి సరిపోతారో గొప్పగా అంచనా వేయగల వ్యక్తి. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో మంచి షాట్స్‌ తీశారు. ‘సీతాకోక చిలుక’ నా ఏడో సినిమా. కొంచెం హుషారుగా ఉండే పిల్లాడు కావాలనగానే నాకు కాల్‌ వచ్చింది. వెళ్లిన అరగంటకే ఆ పాత్రకు నన్ను ఓకే చేశారు. ‘సీతాకోక చిలుక’ పాటలు ఎప్పుడు విన్నా హృద్యంగా అనిపిస్తాయి. ఒక నటుడిగా నేను ఇన్ని సినిమాలు చేశానంటే అది భారతీరాజా భిక్షే.’’ - నటుడు అలీ



► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 09:09 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రివ్యూ: ‘సింగ్‌ గీతం’.. లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం కొత్త మూవీ ఎలా ఉంది? లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన వైవిధ్యమైన కథా చిత్రం ‘సింగ్‌ గీతం’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది ఎలాంటి వినోదాన్ని పంచింది?(Sing Geetham Movie Review)
  • విజయ్‌ సేతుపతి-పూరి ‘స్లమ్‌డాగ్‌’.. టీజర్‌ మేకింగ్‌ చూశారా? విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌’ (SlumDog - 33 Temple Road).
  • ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తా: రాఘవ లారెన్స్‌ Raghava Lawrence: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ కీలక ప్రకటన చేశారు.
  • నాని చిత్రంలో రుక్మిణి? ‘సప్త సాగరాలు దాటి’, ‘కాంతార 2’ లాంటి విజయవంతమైన చిత్రాలతో దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రుక్మిణీ వసంత్‌. ప్రస్తుతం ఆమె చేతుల్లో యశ్‌ ‘టాక్సిక్‌’, ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ లాంటి భారీ చిత్రాలున్న సంగతి తెలిసిందే.
  • చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అప్పుడే! ‘‘నేను ఎప్పుడూ నా సామర్థ్యానికి మించిన స్థాయిలోనే పనిచేశా. కానీ ఒకానొక సమయంలో అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింద’’ని అంటోంది బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌. కథానాయికగానే కాకుండా దర్శకురాలిగా కూడా సత్తా చాటుతోంది. ఇటీవల ‘భారత్‌ భాగ్య విధాత’లో నటించింది.
  • అస్సాం అమ్మాయిని కదా అందుకే సవాల్‌ ‘‘బలమైన భావోద్వేగాలతో నిండిన చక్కటి కుటుంబ కథా చిత్రం ‘కొత్త మలుపు’’ అంది కథానాయిక భైరవి. ఈ టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ సినిమా తన సినీ ప్రయాణానికి ఓ కొత్త మలుపులా నిలుస్తుందని నమ్మకంతో చెబుతోంది.
  • అలా అంటే కుర్చీలోనే కూర్చునేవాణ్ని ! ‘‘ఈతరం ప్రేక్షకులకు సింగీతం శ్రీనివాసరావు అందిస్తున్న కానుక ‘సింగ్‌ గీతం’’ అన్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇలాంటి చిత్రం ఇంత వరకు రాలేదని.. మరో 10ఏళ్ల తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చేశామని తెలిపారు.
  • బంగారం.. రాకకు సిద్ధం ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది నటి సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని నందినీ రెడ్డి తెరకెక్కించారు. ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై రాజ్‌ నిడిమోరు, సమంత, హిమాంక్‌ దువ్వూరు నిర్మించారు.
  • మనల్ని ప్రేమలో పడేలా చేసే జంట హృదయాల్లోకి చొచ్చుకెళ్లే ఓ మంచి ప్రేమకథతో  ‘దీవాన’  తెరకెక్కిందన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. ఆయనతోపాటు కథానాయకుడు విష్వక్‌సేన్, నిర్మాత ధీరజ్‌  మొగిలినేని ముఖ్య అతిథులుగా గురువారం హైదరాబాద్‌లో ‘దీవాన’ ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుక జరిగింది.
  • కడలినే శాసించేవాడు.. విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘మకుటం’. ఆర్బీ చౌదరి నిర్మాత. దుషార విజయన్, అంజలి కథానాయికలు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • టెన్షన్‌ ఔట్‌.. నవ్వులకు ‘వెల్‌కమ్‌’ అడవిలో ఒక నకిలీ సినిమాను తన తోటి నటులతో కలిసి చిత్రీకరిస్తున్నారు అక్షయ్‌ కుమార్‌. మొదట్లో వారంతా తన సహ నటులే అని భావించినప్పటికీ.. తర్వాత వారంతా బందిపోట్లని తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ సినిమా చూడాల్సిందే.
  • ‘జైలర్‌ 2’లో అతిథిగా హృతిక్‌ రోషన్‌? టైగర్‌ కా హుకూం.. అంటూ ‘జైలర్‌’ చిత్రంతో తనదైన స్టైల్‌లో అలరించారు రజనీకాంత్‌. దీనికి సీక్వెల్‌గా ‘జైలర్‌ 2’ రూపొందుతుంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించింది చిత్రబృందం.
  • సంక్షిప్త వార్తలు (3) పవన్‌ మహావీర్‌ కథానాయకుడిగా... శివాల ప్రభాకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి’. వర్షిక, సుహానా కథానాయికలు. సుమన్, రావు రమేశ్, రాజీవ్‌ కనకాల, సత్యకృష్ణ, సుజాత కీలక పాత్రధారులు.
  • పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ‘ఓజీ2’ అప్‌డేట్‌..! పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా సుజీత్‌దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘ఓజీ’ (They Call Him OG).
  • అప్పుడు హీరోయిన్‌.. ఇప్పుడు హీరోయిన్‌ తల్లి.. నవ్వులు పంచిన అక్షయ్‌ వెండితెరపై బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) యాక్షన్‌తో ఎంత మెప్పిస్తారో, కామెడీతోనూ అంతే నవ్వులు పంచుతారు.
  • తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన భీష్మాచార్యుడు: సింగ్‌ గీతంపై చిరు పోస్ట్‌ తెలుగు సినిమా పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు భీష్మాచార్యుడని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
  • సింగర్‌ జిమ్‌ లక్ష్యంగా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కాల్పులు దిల్లీలోని పశ్చిమ్‌ విహార్‌లో 24హెచ్‌ఎస్‌ ఫిట్‌నెస్‌ వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
  • ‘ధురంధర్’లో ఆ అంశాలు నచ్చాయి: పవన్‌ కల్యాణ్ ప్రశంసలు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో సూపర్‌ హిట్‌ అందుకున్న చిత్రం ‘ధురంధర్‌’.
  • దిగ్గజ దర్శకుడు భారతీరాజాకు ప్రధాని మోదీ నివాళి దర్శకుడు భారతీరాజా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
  • డబ్బులు తీసుకొని ప్రచారం చేయట్లేదు.. ఆరోపణలపై నటి స్పందన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌పై దర్శకుడు సంజీవ్‌ మేగోటి ఇటీవల చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.