అనిల్ అంబానీ నివాసం అటాచ్ చేసిన ఈడీ

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి చెందిన ముంబయి నివాసం ‘అబోడ్’ను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తున్న ఈ విలాసవంతమైన ఇల్లు.. ముంబయిలోని పాలి హిల్ ప్రాంతంలో ఉంది. దీని విలువ సుమారు రూ.3,716 కోట్లు ఉంటుందని అంచనా. అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM)తో సంబంధం ఉన్న కేసులో భాగంగా ఆ ఇంటిని ఈడీ అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ దాదాపు రూ.15,700 కోట్లకు చేరుకుంది. మరోవైపు.. ఈ నెల 26న విచారణకు హాజరు కావాల్సిందిగా అనిల్ అంబానీకి ఈడీ ( Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. 2025 ఆగస్టులో ఒకసారి ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని ఇటీవల సుప్రీం కోర్టుకు తెలిపారు.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పూచీకత్తు లేకుండా రూ.1.25 లక్షల లోన్.. ఇలా పొందొచ్చు చిన్న వ్యాపారులకు, పిల్లల స్కూల్ ఫీజులు, అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కావాలంటే మైక్రో ఫైనాన్స్ లోన్స్ తీసుకోవచ్చు.
- ఈపీఎఫ్ వడ్డీ రేటు.. ఈసారీ 8.25 శాతమే EPFO Interest Rate: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)పై ఇచ్చే వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) 8.25 శాతంగా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది.
- కెనడా ప్రధానికి ముకేశ్, నీతా అంబానీ ఆతిథ్యం Ambani family: భారత్ పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
- మార్కెట్లకు యుద్ధ భయాలు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, తదనంతర పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి.
- వార్ ఎఫెక్ట్: రాకెట్లా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు Gold price today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
- భగ్గుమన్న చమురు ధరలు.. ఒక డాలర్ పెరిగితే భారత్పై భారమెంతో తెలుసా..? Oil prices: ఇంధన ధరలు 10 శాతం మేర పెరిగాయి.
- స్పామ్ మెసేజ్లు అరికట్టేందుకు ఎయిర్టెల్, గూగుల్ భాగస్వామ్యం సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్)లో స్పామ్ను అరికట్టేందుకు ఏఐ (కృత్రిమమేధ) ఆధారిత స్పామ్ ప్రొటెక్షన్ టూల్ను భారతీ ఎయిర్టెల్ వినియోగించనుంది.
- మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయా? పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. మన దేశానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు సగం మేర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. అయితే ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగినా, మన వద్ద తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
- భారత్కు చమురు ముప్పు ఎంత? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించడంతో, ఈ ప్రాంతంలో యుద్ధం తీవ్రమైంది. వెనెజువెలా అధ్యక్షుణ్ని అమెరికా బందీగా పట్టుకెళ్లినా, పరిస్థితులు విషమించలేదు.
- ఫిబ్రవరిలో వాహన విలాసమే దేశీయ విపణిలో స్థిరమైన గిరాకీ లభిస్తున్నందున.. ఫిబ్రవరిలో అగ్రగామి వాహన కంపెనీలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తమ టోకు విక్రయాల్లో వృద్ధి నమోదుచేశాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విపణిలో 1,61,000 వాహనాలు విక్రయించింది.
- మార్కెట్కు ‘యుద్ధ’ నష్టాలే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు సహా ముఖ్యనేతలు హతమవ్వడం, తదనంతర పరిణామాలు స్టాక్మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇప్పటికే బలహీనంగా ఉన్న మదుపర్ల సెంటిమెంటు మరింత దిగజారనుంది.
- పసిడి, వెండి పెరుగుతాయ్ పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ సహా పలువురు ముఖ్యనేతలు హతమవ్వడం, ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో.. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.
- గెయిల్ ఛైర్మన్గా దీపక్ గుప్తా బాధ్యతల స్వీకరణ దేశీయ అతిపెద్ద గ్యాస్ సరఫరా సంస్థ గెయిల్ ఇండియా, ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టరుగా దీపక్ గుప్తా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి 28 వరకు ఈయన ఈ పదవిలో ఉంటారు.
- 28 స్థిరాస్తి సంస్థలు.. రూ.1.33 లక్షల కోట్ల అమ్మకాలు దేశంలోని 28 నమోదిత స్థిరాస్తి సంస్థలూ కలిసి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబరులో రూ.1.33 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరిపాయి. ప్రీమియం, విలాసవంత ఇళ్లు/ఫ్లాట్లకు గిరాకీ లభించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
- ఐఐఎఫ్సీఎల్ పబ్లిక్ ఇష్యూ 2026-27లో ప్రభుత్వరంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్సీఎల్) పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది.
- మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇ సినీలక్స్.. ఫీచర్లివీ! మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ, విద్యుత్తు ఎస్యూవీ ఎక్స్ఈవీ 9ఇ సినీలక్స్ ఎడిషన్ను ఆదివారం ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.29.35 లక్షలు (ఎక్స్షోరూం) అని ప్రకటించింది.
- వజ్రపుటుంగరం కొనేద్దాం అసలే పెళ్లిళ్ల సీజను. ఆభరణాలు కొనకుండా ఉండలేని పరిస్థితి. అయితే బంగారం ఉంగరం బదులుగా వజ్రపుటుంగరం వైపు దృష్టి పెట్టేందుకు వజ్రాల ధరలు వీలు కల్పిస్తున్నాయి.
- భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనా? ఇరాన్లోని పలు లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడులు పశ్చిమాసియాలో భద్రతాపరమైన ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి.
- హార్డ్వేర్లోనూ బలమైన శక్తిగా భారత్ గుజరాత్లోని సనంద్లో మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీ కండక్టర్ ప్లాంట్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సాఫ్ట్వేర్లో బలమైన శక్తిగా ఎదిగిన తర్వాత, హార్డ్వేర్ రంగంలో కూడా దేశం తన గుర్తింపును దృఢంగా నిర్మిస్తోందని ఆయన తెలిపారు.
- ఆంథ్రోపిక్కు ట్రంప్ షాక్ కృతిమ మేధ(ఏఐ) టూల్స్తో ప్రపంచాన్నే ఆకర్షించిన అమెరికా కంపెనీ ఆంథ్రోపిక్కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. ఆంథ్రోపిక్కు చెందిన ఏఐ సాంకేతికతను వినియోగించడాన్ని ఆపాలని అన్ని అమెరికా ప్రభుత్వ విభాగాలను ఆయన ఆదేశించారు.