గంభీర్ దృష్టిలో అతడో ‘సర్వరోగ నివారిణి’!: టీమ్ఇండియా మాజీ క్రికెటర్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచకప్ ( ICC Mens T20 World Cup) సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా ( Team India) 76 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) భారత కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) నిర్ణయాలను తప్పుబట్టాడు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను ( Axar Patel) జట్టులోంచి తప్పించి మరీ వాషింగ్టన్ సుందర్ను ( Washington Sundar) ఆడించడాన్ని ప్రశ్నించాడు. గౌతమ్ గంభీర్.. వాషింగ్టన్ సుందర్ను అన్ని సమస్యలను పరిష్కరించే సర్వరోగనివారణి అనుకుంటున్నాడని సంజయ్ మంజ్రేకర్ ఎగతాళి చేశాడు.
‘ఆయుర్వేదంలో కొన్ని మందులను తలనొప్పికి, కడుపు నొప్పికి కూడా సర్వరోగ నివారిణిలా వాడతారు. అయితే గౌతమ్ గంభీర్ సైతం.. అన్ని సమస్యలకు ఒకే పరిష్కారంలా వాషింగ్టన్ సుందర్ను చూస్తున్నాడు. బ్యాటింగ్లో సమస్యా.. వాషింగ్టన్ సుందర్! బౌలింగ్లో ఇబ్బందా.. వాషింగ్టన్ సుందర్! అంటున్నారు. అతడిని ఏకంగా అయిదో స్థానానికి ప్రమోట్ చేశారు. అతడి తర్వాతే రింకు సింగ్, హార్దిక్ పాండ్యను ( Hardik Pandya) బ్యాటింగ్కు పంపారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తంచేశాడు.
‘ఫాస్ట్ బౌలింగ్ విషయాన్ని పక్కనపెట్టి.. స్లో బాల్స్ను ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేయండి. భారత బ్యాటర్లు స్లో బాల్స్, స్పిన్నర్లను ఆడలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ నెమ్మదిగా వచ్చే బంతుల విషయంలో ఇబ్బంది పడుతున్నాడు’ అని సంజయ్ మంజ్రేకర్ విశ్లేషించాడు.
వైస్ కెప్టెన్ను ఎవరైనా జట్టులోంచి తప్పిస్తారా?: కృష్ణమాచారి శ్రీకాంత్
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అక్షర్పటేల్ను భారత జట్టు నుంచి తప్పించడాన్ని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) తప్పుపట్టాడు. ఏకంగా వైస్ కెప్టెన్ను ఇలా పక్కనపెట్టి ప్రయోగాలు చేయడమేంటని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ను అతడు ప్రశ్నించాడు. ‘గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేసేది అతడే కదా. ఇలాంటి వ్యూహాలతో ముందుకుసాగితే నష్టం తప్పదు. మిగతా జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాల మీద ఇప్పుడు మనం ఆధారపడే పరిస్థితికి వచ్చాం. ఓటమి తర్వాత గంభీర్, సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav) మాట్లాడుకున్నారు. అక్షర్ పటేల్ను జట్టు నుంచి తప్పించిన తర్వాత వీరు మాట్లాడుకోవడానికి ఇంకేముంది?’ అని శ్రీకాంత్.. కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
- అరరే.. ఈ టీమ్ఇండియాకు ఏమైంది?
‘ప్రధాన కోచ్గా గంభీర్ ఉన్నాడు. అతడి చుట్టూ ఇతర కోచింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా సాధారణ నిర్ణయాలు తీసుకోలేరా? వైస్ కెప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ను ఎవరైనా జట్టు నుంచి తప్పిస్తారా? ఇంతకుముందు శుభ్మన్ గిల్ ( Shubman Gill) విషయంలోనూ ఇలాగే చేశారు. ఇకపై టీ20లలో జట్టుకు వైస్ కెప్టెన్గా ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే వైస్ కెప్టెన్లుగా ఉన్నవారినే జట్టు నుంచి బయటకు పంపుతున్నట్లు కనిపిస్తోంది’ అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఐపీఎల్.. లఖ్నవూపై ఆర్సీబీ ఘనవిజయం ఐపీఎల్ 2026లో భాగంగా ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా లఖ్నవూ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
- ముంబయి ఇండియన్స్కు బ్యాడ్న్యూస్..? Rohit Sharma: ముంబయి ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్న్యూస్..!
- ప్లేయర్లపై కాదు.. అంపైర్లకు జరిమానా విధించాలి: ఎంసీసీ హెడ్ స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఆలస్యమైతే కెప్టెన్లపై జరిమానా విధించడం సరైంది కాదని ఎంసీసీ హెడ్ స్టీవార్ట్ అభిప్రాయపడ్డారు. అంపైర్లకు విధించాలని సూచించారు.
- నూర్ సూపర్ స్పెల్ వెనుక ధోని సూచనలు: సీఎస్కే బౌలింగ్ కోచ్ ధోని మైదానంలోకి దిగకపోయినా.. సహచరుల్లో స్ఫూర్తి నింపడంలో ముందుంటాడు. కోల్కతాపై అద్భుత ప్రదర్శన చేసిన నూర్కూ ఇలాగే కీలక సూచనలు ఇచ్చాడు.
- నా శరీరంలో ఇప్పటికీ ఆ అవశేషాలు: కుమార సంగక్కర పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన తమ జట్టుపై 2009లో ఉగ్రదాడి జరిగిన ఘటనను తాజాగా కుమార సంగక్కర గుర్తు చేసుకున్నాడు.
- రోహిత్ శర్మ గాయంపై తాజా అప్డేట్..! రోహిత్ శర్మ గాయంపై అప్డేట్ వచ్చింది. కండరాలు పట్టేయడంతో ఆర్సీబీతో జరిగిన బ్యాటింగ్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే.
- మయాంక్పై అప్డేట్.. రహానేకు ఫైన్.. నల్ల రిబ్బన్లతో ప్లేయర్స్ చెపాక్లో కేకేఆర్పై సీఎస్కే అద్భుత విజయం.. కోల్కతా కెప్టెన్కు జరిమానా.. లఖ్నవూ స్టార్ పేసర్ మాయంక్ యాదవ్పై అప్డేట్తో ఐపీఎల్ విశేషాలు ఇవీ..
- సాకులు చెప్పం.. నాతో సహా మెరుగుపడాల్సిందే: రుతురాజ్ కోల్కతా నైట్రైడర్స్పై విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఓ విషయంలో మాత్రం ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ఆ జట్టు సారథి రుతురాజ్ గైక్వాడ్ కూడా వెల్లడించాడు.
- చెన్నై.. మళ్లీ కొట్టింది హ్యాట్రిక్ ఓటములతో ఐపీఎల్-19ను పేలవంగా ఆరంభించిన చెన్నై సూపర్కింగ్స్.. కొంచెం ఆలస్యంగా జోరందుకుంది. గత మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ను మట్టికరిపించిన సీఎస్కే.. మంగళవారం కోల్కతా నైట్రైడర్స్పై అలవోకగా గెలిచింది.
- షూ కూడా కొనలేని స్థితి నుంచి.. మొన్నటి సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత రాత్రికి రాత్రి స్టార్లు అయిపోయారు.. ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్. ఈ ఇద్దరూ తలో నాలుగు వికెట్లతో రాయల్స్ ఓటమిని శాసించారు. ప్రఫుల్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ నడ్డి విరిస్తే.
- ఆయుష్ అదరహో.. కొంతకాలంగా ఆ యువ షట్లర్ తన నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మంచి భవిష్యత్తున్న వర్ధమాన ఆటగాడిగా భారత బ్యాడ్మింటన్ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆసియా ఛాంపియన్షిప్స్లో ప్రదర్శనతో అతడి పేరు మార్మోగుతోంది.
- సూర్య భవితవ్యంపై చర్చ కెప్టెన్గా టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియాను విజయపథంలో నడిపించినప్పటికీ బ్యాటుతో పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
- ఐర్లాండ్ పర్యటనకు వైభవ్! ఈ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్లతో అదరగొడుతున్న వైభవ్.. జూన్ 26న ప్రారంభంకానున్న ఐర్లాండ్ పర్యటన ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
- ఉత్తమ ప్లేయర్లుగా అభిషేక్, దీప్తి 2026 విజ్డెన్ అవార్డుల్లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. మొత్తం 9 పురస్కారాల్లో ఏడు భారత క్రికెటర్లకు లభించాయి. భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మ ఉత్తమ మహిళా క్రికెటర్గా ఎంపికవగా..
- టైటిల్కు చేరువలో వైశాలి క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న వైశాలి టైటిల్కు చేరువైంది. అగ్రస్థానంలో ఉన్న ఆమె ఆఖరి రౌండ్లో నెగ్గితే.. ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం పోటీపడే అవకాశం లభిస్తుంది.
- సంక్షిప్త వార్తలు(3) సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శ్రీలంక పేసర్ దిల్షాన్ మదుశంక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఈ సీజన్కు దూరమైన ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్ స్థానంలో ఎడమచేతి వాటం బౌలర్ మదుశంకను జట్టులోకి తీసుకున్నట్లు సన్రైజర్స్ మంగళవారం ప్రకటించింది.
- బోల్ట్ను మించిన వేగం పరుగు అనగానే గుర్తుకొచ్చే పేరు.. ఉసేన్ బోల్ట్. ఓ దశాబ్దం పాటు ప్రపంచ అథ్లెటిక్స్లో అతను సాధించిన ఆధిపత్యం ఒక చరిత్ర. అప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టేయడమే కాదు.. భవిష్యత్తులో బద్దలు కావేమో అనిపించే స్థాయి రికార్డులు నెలకొల్పిన ఘనుడతడు.