పరీక్ష ఓ ఆట.. గెలుపు మన బాట!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 25 Feb 2026 18:24 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

పరీక్షలంటే పాస్, ఫెయిల్‌ లెక్కలు కాదు... జీవన్మరణ సమస్యగా చూస్తున్న రోజులివి. తల్లిదండ్రుల ఆశలు, టీచర్ల టార్గెట్లు... వెరసి విద్యార్థి మెదడును ప్రెషర్‌ కుక్కర్‌లా మార్చేస్తున్నాయి. ఫలితం.. నిద్ర లేని రాత్రులు, తెలియని భయాలు. అయితే ‘పరీక్ష అనేది ఒక ఆట మాత్రమే.. సరైన ప్రణాళిక ఉంటే ఒత్తిడిని చిత్తు చేసి విజయాన్ని అలవోకగా సాధించొచ్చు’ అంటున్నారు తిరుపతి రుయాలో మానసిక వైద్యులు డాక్టర్‌ మానస. పరీక్షల్లో రాణించాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు తక్షణం పాటించాల్సిన సూచనలు ఇవిగో..

ప్రస్తుతం 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో (తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు) సుమారు 30 నుంచి 40 శాతం మంది తీవ్రమైన ఆందోళనతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు, టీచర్లు విధిస్తున్న ఆవాస్తవిక లక్ష్యాలే. ‘నీకు ర్యాంకు రావాలి.. లేకపోతే వేస్ట్‌’ అనే మాటలు పిల్లలను మానసికంగా కుంగదీస్తున్నాయి. దీనివల్ల పిల్లలు పరీక్షలంటేనే భయపడిపోతున్నారు. పరీక్ష గదిలోకి వెళ్లగానే చదివిందంతా మర్చిపోవడం, గుండెదడ లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ధోరణిని మార్చాల్సిందే తల్లిదండ్రులే...

7డే- రూల్‌:పరీక్షల కోసం గంటల తరబడి చదవడం కాదు.. ‘స్మార్ట్‌’గా చదవడం ముఖ్యం. సరైన ప్రణాళిక, వ్యూహం ఉంటే సులువుగా విజయాన్ని చేరుకోవచ్చు. రెండు నెలల టైం టేబుల్‌ ఒకేసారి వేసుకుంటే ఎవరూ పాటించలేరు. కేవలం ఒక వారం (సోమవారం నుంచి శనివారం వరకు) షెడ్యూల్‌ వేసుకోండి. అందులో కష్టమైన సబ్జెక్టును (గణితం లేదా సైన్స్‌) ఎంచుకోండి. ఆ టార్గెట్‌ పూర్తయ్యాకే.. తర్వాత వారం ప్లాన్‌ చేయండి..

నిద్రే మీ బలం:ఏడాదంతా చదివి, పరీక్ష ముందు రోజు నిద్రపోకపోతే బ్రెయిన్‌ మొరాయిస్తుంది. కనీసం 7- 8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్రలోనే మన బ్రెయిన్‌ రిపేర్‌ అవుతుంది.  

పొమిడారో టెక్నిక్‌:గంటల తరబడి చదవడం కాదు.. 25 నిమిషాలు చదివితే.. 5 నిమిషాల బ్రేక్‌ తీసుకోవాలి. అలా సుదీర్ఘంగా చదివాక, 15 నుంచి 20 నిమిషాలు విరామం ఇవ్వాలి. దీనివల్ల ఎక్కువ సేపు ఏకాగ్రత ఉంటుంది. 

గుర్తుంచుకోడానికో మార్గం:‘నాకు గుర్తుండటం లేదు’ అని భయపడేవారి కోసం ఒక టెక్నిక్‌ ఉంది. చదివిన దాన్ని ఫ్లో-చార్ట్‌ రూపంలో లేదా కీ పాయింట్ల రూపంలో పేపర్‌పై పెట్టండి. సినిమా చూసినట్లు కాకుండా, రాస్తూ.. చదివితే మెదడులో నిక్షిప్తం అవుతుంది.

పిల్లలు పరీక్షల్లో గెలవాలంటే.. ముందు ఇంట్లో వాతావరణం బాగుండాలి. వారిలో స్థైర్యం పెంచేలా తల్లిదండ్రులే ఊతం ఇవ్వాలి.

ఆ ప్రశ్న అడగొద్దు:సాయంత్రం ఇంటికి రాగానే ‘ఈరోజు ఎన్ని పాఠాలు చదివావ్‌’ అని అడగకండి. ‘ఈరోజు స్కూల్లో ఎలా గడిచింది.? ఫ్రెండ్స్‌తో ఆడుకున్నావా..? భోజనం చేశావా..?’ అని అడగండి.. దీనివల్ల వారికి ‘మా అమ్మానాన్నలకు నా చదువు కంటే నేనే ముఖ్యం’ అనే భరోసా వస్తుంది. 

పోలిక వద్దు:పక్కింటి పిల్లలతో మీవాళ్లను పోల్చకండి. ప్రతి విద్యార్థీ యూనిక్‌ అని గుర్తుంచుకోండి.

జీవితంలో గెలవాలి:మార్కులు జీవితాన్ని నిర్ణయించలేవు. కేవలం సీటు కోసమే పనికొస్తాయి తప్ప, జీవితంలో గెలిచేందుకు కాదు. ఫెయిలైనా పర్లేదు, మళ్లీ రాసుకోవచ్చు ఆ ధైర్యాన్ని మీ పిల్లలకు ఇవ్వండి.. ఓటమి దరిచేరకుండా ఊతమివ్వండి..ఆ ధైర్యమే వారిని విజేతలుగా నిలబెడుతుంది. 

చివరిగా.. పరీక్ష అనేది మీ సామర్థ్యాన్ని కొలిచే సాధనం మాత్రమే.. అదే మీ జీవితం కాదని గుర్తుంచుకోండి.. ఆల్‌ ది బెస్ట్‌..!

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 18:23 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మీ పనితీరు మెరుగుపడలేదు.. మంత్రి కొండపల్లికి సీఎం మందలింపు ‘రాజకీయ అరంగేట్రంతోనే ఎమ్మెల్యేగా గెలిచావు. వెంటనే మంత్రిని చేశాం. ఇలా జాక్‌పాట్‌ కొట్టినా పనితీరు మెరుగుపడలేదు. మీ తండ్రిని దూరం పెట్టాలని చెప్పాం కదా’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించినట్టు విశ్వసనీయ సమాచారం.
  • మహిళల్ని జిహాదీలుగా మార్చేందుకు ‘ఖవాతీన్‌’ గ్రూప్‌ విజయవాడ ఉగ్రమూలాల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిహాదీ కార్యకలాపాల్లో మహిళలను భాగస్వాముల్ని చేసేందుకు విదేశీ హ్యాండ్లర్లు మహిళలతో ‘ఖవాతీన్‌’ పేరిట ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
  • ఆన్‌లైన్‌లో ఓ పని.. ఆఫ్‌లైన్‌లోనూ అదే పని! పాఠశాల విద్యలో ఒకే పని వివరాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహించాల్సి వస్తుండడంతో బోధనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విద్యార్థుల హాజరును ఉదయం ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు.
  • అన్ని పోర్టులనూ అనుసంధానిస్తూ హైవేలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా హైవేలు, రాష్ట్ర రహదారుల నిర్మాణం ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
  • కేజీబీవీల్లో చన్నీటి కష్టాలకు తెర! గురుకులాల విద్యార్థులకు ఇకనుంచి చన్నీటి స్నానాల బాధ తప్పినట్లే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) సౌరగీజర్లు ఏర్పాటుచేస్తోంది.
  • 2016కు ముందు ప్రభుత్వం ఇంటి పట్టా ఇస్తే.. అమ్ముకోవచ్చు ప్రభుత్వ గృహనిర్మాణ పథకంలో భాగంగా 2016కు ముందు ఇంటిపట్టా పొందిన ప్రతి ఒక్కరికీ దాన్ని అమ్ముకునే, రిజిస్ట్రేషన్‌ చేసే హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
  • 16 నుంచి స్వీయగణన ‘ఆంధ్రప్రదేశ్‌లో జనగణనకు రంగం సిద్ధమైంది. దేశంలో మొదటిసారి పూర్తిగా డిజిటల్‌ విధానంలో జరగనున్న ఈ ప్రక్రియలో ఈ నెల 16న ప్రజలు తమ వ్యక్తిగత కుటుంబ వివరాలను ఎవరికి వారే నేరుగా పోర్టల్‌లో నమోదుచేసే స్వీయగణన విధానం మొదలు కానుంది.
  • రూ.528 కోట్లతో వ్యర్థాల ప్రాసెసింగ్‌ ప్రాజెక్టు నగరాలు, పట్టణాల్లో చెత్త సమస్యకు పరిష్కారంగా దేశంలోనే మొదటి ‘తాజా వ్యర్థాల ప్రాసెసింగ్‌ ప్రాజెక్టు’కు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
  • త్వరలో 5 కిలోల సిలిండర్లు.. కిరోసిన్‌ పంపిణీ ఎల్‌పీజీ ఏజెన్సీలతో సంయుక్త కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని.. ప్రజలను ఇబ్బంది పెడుతూ గ్యాస్‌ సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధికారులను ఆదేశించారు.
  • నియామక బోర్డు ద్వారానే జోనల్‌ స్థాయి పోస్టుల భర్తీ: మంత్రి సత్యకుమార్‌ పారదర్శకత పెంచేందుకు జోనల్‌ స్థాయి నియామకాలు సైతం ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవల నియామక బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) ద్వారా చేపడతామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.
  • మీడియా స్వేచ్ఛపై వైకాపా దాడి ప్రజాస్వామ్యానికి పత్రికలు, ప్రసార మాధ్యమాలు నాలుగో స్తంభం. ప్రభుత్వ, రాజకీయపార్టీల విధానాల్లోని లోపాల్ని, లోటుపాట్లను విశ్లేషించడం, విమర్శించడం వాటి కర్తవ్యం.
  • ఎంవీవీ సంస్థ సెస్‌ బకాయిపై మంత్రి ఆగ్రహం నిర్మాణరంగ కార్మికుల భద్రత, సంక్షేమంపై రాజీపడే ప్రసక్తే లేదని, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి పెద్ద సంస్థలనైనా ఉపేక్షించబోమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు.
  • ఆ నేతలకు షోకాజ్‌ నోటీసులివ్వండి కార్యకర్తల సమావేశాలు, గ్రీవెన్స్‌లు నిర్వహించని పలువురు తెదేపా నేతలపై పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • పర్యాటక రంగంలో పెట్టుబడులపై భారీ ప్రోత్సాహకాలు: మంత్రి కందుల దుర్గేష్‌ పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా సృజనాత్మక ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రాధాన్యమని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.
  • ‘నల్లమల’లో రాజధాని పెట్టుకోవాలేమో ‘‘అమరావతికి కేంద్రం గెజిట్ ఇచ్చిన తర్వాత కూడా రాజధాని మారుస్తామని చెప్పడమంటే.. అది మూర్ఖులు మాత్రమే చేసే పని.. జగన్‌ ఆలోచనల మేరకు రాజధానిని నల్లమల అడవిలో పెట్టుకుంటే బాగుంటుందేమో’’ అని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
  • సీఎం చంద్రబాబుతో మాధవ్‌ భేటీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ బుధవారం భేటీ అయ్యారు. మత్స్యకారులు, హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందించారు.
  • పాలిటెక్నిక్‌ పరీక్షలకు ఈసెట్‌కు మధ్య ఐదు రోజులే సమయం ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించే ఈసెట్‌కు తక్కువ సమయం ఇవ్వడంపై పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలిటెక్నిక్‌ మూడో ఏడాది పరీక్షలు ఈ నెల 17 వరకు ఉన్నాయి.
  • లోకో పైలట్ల స్థానిక కార్యాలయాన్ని విజయవాడలోనే కొనసాగించండి దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలో సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌కు చెందిన లోకో పైలట్ల స్థానిక కార్యాలయాన్ని (గాలా క్రూ డిపో) తరలించకుండా అక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను పలువురు రైల్వే ఉద్యోగులు కోరారు.
  • అమ్మో.. ఆ ఐఏఎస్సా! ఆయన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. కిందిస్థాయి అధికారులతో సమీక్షలంటే చాలు.. తిట్లతో ఊగిపోతారు.
  • పౌడర్‌ రాసుకుంటేనే పనిమంతుడని తేల్చింది ఇదేంటి ఈ వ్యక్తి ముఖానికి ఇంత పౌడర్‌ పూసుకుని బయటకు వచ్చారని ఆశ్చర్యపోతున్నారా? ఉపాధిహామీ పనుల్లో హాజరు కోసం వచ్చిన తిప్పలు ఇవి. పార్వతీపురం మన్యం జిల్లా అక్కన్నగూడకు చెందిన సవర సుంబురు..