సరస్వతి కాళికాదేవిలా మారితే...!

- A
- A+
- A++

ప్రతి అమ్మాయి ఒక సరస్వతిలా ఉండదు. అవసరమైతే కాళికలా కూడా మారుతుందంటూ తనదైన శైలిలో హెచ్చరించింది ఓ యువతి. ఆమె ఎందుకలా చెప్పింది? అసలు సరస్వతి ఎవరు? కాళిలా మారి కన్నెర్రజేయాల్సిన అవసరం ఎవరికి, ఎందుకొచ్చిందో తెలియాలంటే ‘సరస్వతి’ చూడాల్సిందే. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి దోస డైరీస్ పతాకంపై నిర్మించారు. ఈటీవీ విన్ సమర్పిస్తోంది. ప్రియమణి, ప్రకాశ్రాజ్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. హై కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ని డిజిటల్ వేదికల్లో కథానాయకుడు నాని, శనివారం నిర్వహించిన వేడుకలో దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్కుమార్ మాట్లాడుతూ ‘‘మహిళా ప్రధానమైన సినిమా అని సందేశం ఇచ్చినట్టుగా ఉండదు ఈ చిత్రం. థ్రిల్లింగ్గా సాగుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. తెలుగులో నటిగా నన్ను పునః పరిచయం చేసి రెండో జీవితాన్నిచ్చారు గోపీచంద్ మలినేని. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదిగేందుకు అందరూ మరింతగా సహకారం అందించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. వేదికపై వరలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘‘నేను తీసిన ‘క్రాక్’లో జయమ్మ పాత్రని పోషించిన వరలక్ష్మీ శరత్కుమార్ని చూసి మా ప్రకాశం జిల్లా వాసులంతా షాక్ అయ్యారు. జయమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనుకున్నారు. సావిత్రి, శారదలా మంచి నటి వరలక్ష్మి. ఆమె ‘సరస్వతి’ కథని చెప్పిన విధానంతో నేను ఆశ్చర్యపోయా. థియేటర్లో ఈ సినిమా చూసి అందరూ షాక్ అవుతారు. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ‘‘నాణ్యతలో రాజీపడకుండానే వేగంగా ఈ సినిమాని పూర్తి చేశారు వరలక్ష్మి. మంచి నటులు, స్క్రీన్ప్లేతో తెరకెక్కించారు. గీత ఆర్ట్స్ విడుదల చేస్తున్న ఈ సినిమాతో దర్శకురాలిగానూ వరలక్ష్మికి మంచి పేరొస్తుంది’’ అన్నారు. ఈటీవీ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ ‘‘ఒక లక్ష్మి... సరస్వతిని ఎలా చూపిస్తుందో అలాంటి సినిమానే ఇది. మా సంస్థ నుంచి దర్శకులుగా పరిచయమైనవాళ్లలో వరలక్ష్మి తొమ్మిదో వ్యక్తి. ఈ సినిమాతో దర్శకురాలిగా కూడా బిజీ అవుతారని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత పూజా శరత్కుమార్తోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అక్షయ్ మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి: మృణాల్ ఠాకూర్ శరీరాకృతి ఎలా ఉన్నప్పటికీ.. ముందుగా మనల్ని మనం గౌరవించుకుంటే ఇతరులు కూడా విలువిస్తారంటోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.
- వందశాతం థియేటర్ అనుభవాన్నిచ్చే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ‘‘థియేటర్ అనుభవమే అసలు సిసలైన సినిమా వినోదం. వేరే ఎక్కడ చూసినా అంత ఆనందం రాదు. థియేటర్నే లక్ష్యంగా చేసుకుని మొదలుపెట్టిన ఈ సినిమాని అక్కడే విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ నటుడు శివాజీ.
- కథల ఎంపికే కారణమైనా కానీ...! చిన్న సినిమాలతో మెరుస్తూ... విజయానికి కేరాఫ్గా నిలుస్తున్న కథానాయిక నయన్ సారిక. ‘గం గం గణేశా’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ‘క’, ‘ఆయ్’ సినిమాలతో ప్రేక్షకులకు మరింతగా చేరువైంది.
- మణిరత్నం సినిమాలో సాయిపల్లవి? అటు హిందీలోనూ... ఇటు దక్షిణాదిలోనూ అవకాశాల్ని అందుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు కథానాయిక సాయిపల్లవి. ప్రస్తుతం నటిస్తున్నవే కాకుండా,
- జడలు రో.. హడలు రో ‘‘సవారీకి దొరుకు బిడ్డా.. శవాలే లేస్తాయ్ బిడ్డా.. జడలు రో.. హడలు రో’’ అంటూ సవాల్ విసురుతున్నాడు జడల్. మరి అతనెవరు.. తను సవాల్ చేస్తోంది ఎవరినీ తెలియాలంటే ‘ది ప్యారడైజ్’ చూడాల్సిందే.
- ‘ది కేరళ స్టోరీ 2’ని ముందు మాకు చూపించండి ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ 2’ సినిమా ట్రైలర్లో కేరళను తప్పుగా చూపించారని, మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అంశాలున్నాయని సామాజికమాధ్యమాల వేదికగా చర్చానీయాంశమైంది.
- సంక్షిప్త వార్తలు (4) ‘‘బ్యాండ్ మేళం’ చిత్ర కథలోని సంఘర్షణ చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ అందర్నీ కట్టిపడేస్తుంది’’ అంటున్నారు కోన వెంకట్.