YV Subbareddy: కల్తీ నిజమే.. కానీ నేరం నాది కాదు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 08 Feb 2026 06:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
6 min read

నెయ్యి కల్తీ జరిగింది. పామాయిల్, పామ్‌కెర్నల్‌ ఆయిల్, కొన్ని ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని సిట్‌ నివేదికలో తెలిపింది. కల్తీ నెయ్యి సరఫరాలో చాలా మంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందని, బయటి వ్యక్తుల (థర్డ్‌ పర్సన్స్‌) పాత్ర ఉందని చెప్పింది. వారి పేర్లు ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది.

కల్తీ నెయ్యి సరఫరా వాస్తవమేనట! దానిలో చాలా మంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందట! కల్తీ నెయ్యి సరఫరా జరిగినప్పుడు తితిదే పాలక మండలి ఛైర్మన్‌గా ఉన్న ఆయన ప్రమేయం మాత్రం లేదట! నాలుగేళ్లపాటు తితిదే ఛైర్మన్‌గా ఉన్నా కల్తీ నెయ్యి విషయం ఒక్కసారి కూడా ఆయన దృష్టికి రానేలేదట! కల్తీ నెయ్యి వ్యవహారంలో తానేదో పులుకడిగిన ముత్యం అన్నట్టుగా సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. తితిదేకి సరఫరా చేసిన నెయ్యిని రసాయనాలు, 

పామాయిల్‌ వంటి వాటితో కల్తీ చేసినట్టు సిట్‌ చెప్పిందే తప్ప, జంతు కొవ్వులు, చేప నూనె వంటివి కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని సుబ్బారెడ్డి అడ్డగోలుగా బుకాయిస్తారు. ఆయన వాదన చూస్తుంటే మర్డర్‌ చేసిన హంతకుడు.. ‘హత్య జరగడం వాస్తవమే. నేను కత్తితో పొడిచి చంపితే తుపాకీతో కాల్చానంటారేంటి? అలా అనడం తప్పు కదా’ అని దబాయించినట్లుగా ఉంది.

తితిదేకి అవసరమైనంత నెయ్యి సరఫరా జరగకపోవడంతో అధికారులు నిపుణుల కమిటీని వేసి, వారి సిఫారసు మేరకు నిబంధనలు సడలించారు. ఎందుకు సడలించారని తర్వాత మేం అడిగితే ఎక్కువ మంది పాల్గొనేందుకు అవకాశమిస్తే పోటీ పెరుగుతుందని, తక్కువ ధరలకు కోట్‌ చేస్తారని చెప్పారు. నెయ్యి నాణ్యతపై రాజీ పడకుండానే టెండర్‌ నిబంధనల్ని సడలించాం.

నిబంధనలు సడలించి నాణ్యత పెంచారా? అంతకంటే హాస్యాస్పదం ఉంటుందా?భోలేబాబా డెయిరీ లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసింది  మీరు నిబంధనలు సడలించాకే కదా! నాణ్యత పెంచడమంటే నెయ్యే కాని రసాయన మిశ్రమాన్ని కొనడమా? అసలు ఎవరైనా నాణ్యత పెంచడానికి నిబంధనలు సడలిస్తారా? అన్నట్టు నిబంధనల సవరణకు కమిటీ వేసిందీ, సవరణకు ఆమోదం తెలిపిందీ మీరు ఛైర్మన్‌గా ఉన్న పాలకమండలే కదూ! 

సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదిక తొక్కిపెట్టడంలో దురుద్దేశం లేదా?

‘సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదికను నేను తొక్కిపెట్టానని ఘోరమైన అభియోగం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే నెయ్యి శాంపిళ్లను సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపాలని రాసిందే నేను. రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులది. నివేదికలోని అంశాల్ని వారు మా దృష్టికి తేలేదు’

అధికారులు తాత్సారం చేస్తారేమోనని మీరే సంతకం చేసి, శాంపిళ్లను సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. సంతోషం! నెయ్యి నాణ్యతపై నిజంగా మీకంత శ్రద్ధే ఉన్నప్పుడు సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపిన శాంపిళ్ల పరిస్థితేంటని అధికారుల్ని అడగాలి కదా? అధికారులు మీ దృష్టికి తేలేదనడం అడ్డగోలు బుకాయింపు కాదా? సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదికనూ తొక్కిపెట్టిన మీకు ఎలాంటి దురుద్దేశాలు లేవంటే నమ్మాలా? కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని పరీక్షల్లో నిర్ధారణైన తర్వాత కూడా భోలేబాబా డెయిరీకి 1.07 లక్షల కిలోల సరఫరాకు 2022 ఆగస్టు 29న ఆర్డరు ఇవ్వటం, అక్టోబరు 28 వరకూ ఆ డెయిరీ నెయ్యి సరఫరా చేయటం వాస్తవం కాదా? ప్రీమియర్‌ అగ్రి ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వైష్ణవి డెయిరీలు 2024 వరకూ సరఫరాదారులుగా కొనసాగటానికి కారకులెవరు? ల్యాబ్‌ రిపోర్టు చూపించి, ఆ డెయిరీల నుంచి ఎక్కువ కమీషన్లు దండుకోవడానికే ఆ పరీక్షలు చేయించారన్న ఆరోపణలకు మీ సమాధానమేంటి?  

చిన్నప్పన్న మీ పీఏ కానప్పుడు ఫిర్యాదులు వచ్చినా ఎందుకు పట్టించుకోలేదు?

‘నేను తితిదే ఛైర్మన్‌గా ఉన్నప్పుడు చిన్నప్పన్న నా పీఏ కాదు. అంతకుముందు 2014 నుంచి 2018 వరకు నాకు పీఏగా ఉన్నాడు. 2019 నుంచి ఏపీ భవన్‌లో పనిచేశాడు’

చిన్నప్పన్న అప్పుడు మీ పీఏ కాకపోవచ్చు. కానీ మీ అండ లేకపోతే చిన్నప్పన్న లాంటి ఒక సాధారణ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి తితిదే ఇన్‌స్పెక్షన్‌ కమిటీని భోలేబాబా డెయిరీకి తనిఖీకి పంపించగలడా? బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించగలడా? ఆ డెయిరీ ప్రతినిధుల్ని దిల్లీ పిలిపించి కిలోకి రూ.25 చొప్పున లంచం అడగ్గలడా? ప్రీమియర్‌ డెయిరీ నుంచి రూ.50 లక్షలు లంచం తీసుకోగలడా? అతని ఖాతాలోకి రూ.4.69 కోట్లు ఎలా వచ్చాయి? చిన్నప్పన్న మీ పీఏ కాకపోతే అతను లంచం అడిగాడని భోలేబాబా డెయిరీ ప్రతినిధులు మీకే ఎందుకు ఫిర్యాదు చేశారు? దాన్ని మీరెందుకు తొక్కిపెట్టారు? చిన్నప్పన్న ఒక అనామక ఫిర్యాదును మీకు అందజేస్తే దాని ఆధారంగా నెయ్యి శాంపిళ్లను సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపాలని ఎందుకు ఆదేశించారు? కల్తీ జరిగిందని నివేదిక వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోలేదు?  

జంతువుల కొవ్వు కలవలేదని సిట్‌ ఎక్కడ చెప్పింది? 

‘నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని, వేరే పదార్థాలతో కల్తీ చేశారని సిట్‌ చెప్పింది. నెయ్యిలో జంతువుల కొవ్వు, ఫిష్‌ ఆయిల్‌ కలిసేందుకు అవకాశాలున్నాయని మాత్రమే ఎన్‌డీడీబీ నివేదికలో ప్రస్తావించారు’

ఆ నెయ్యి శాంపిళ్లలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్‌ ఎక్కడా నిర్ధారించలేదు. ఎన్‌డీడీబీ రిపోర్టులో వెజిటబుల్‌ ఆయిల్స్‌తో పాటు, పంది కొవ్వు (లార్డ్‌), గొడ్డు కొవ్వు (బీఫ్‌ టాలో), చేపనూనె (ఫిష్‌ ఆయిల్‌) కలిసేందుకు అవకాశాలున్నాయని స్పష్టంగా పేర్కొంది. కర్నాల్‌లోని ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌ తాము చేసిన పీసీఆర్‌ పరీక్షా విధానంలో.. నెయ్యిలో పందికొవ్వు పది శాతం కంటే తక్కువుంటే గుర్తించలేమని చెప్పింది. గొడ్డుకొవ్వు, చేపనూనె కల్తీని నిర్ధారించే పరీక్షల తమ వద్ద లేవని స్పష్టం చేసింది. ల్యాబ్‌ రిపోర్టులు అంత స్పష్టంగా ఉంటే జంతువుల కొవ్వు కలవలేదని సిట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టుగా అడ్డగోలు వాదనేంటి సుబ్బారెడ్డీ? 

ఆర్జిత సేవల్ని చేపల మార్కెట్‌లా వేలం వేసినప్పుడే మీ నైజం తెలిసింది

‘సుప్రభాతం టికెట్‌ ధర రూ.400 నుంచి రూ.800కి పెంచావు కదా! వై ఎనిమిది వందలు.. రెండు వేలు చెయ్‌! విచక్షణ కోటాలోని అన్ని సేవల ధరలూ పెంచేయ్‌.  తోమాల సేవ టికెట్‌ ధర రూ.2 వేలు చేశావు కదా.. రూ.5 వేలు చెయ్‌. అర్చన కూడా రూ.5 వేలు చెయ్యండి. కల్యాణోత్సవం రూ.2 వేలు చేద్దామా. రూ.2,500 లేదా రూ.3 వేలు చేయండి’ 

మీరు తితిదే పాలకమండలిని చేపల మార్కెట్‌లా మార్చేసి, స్వామివారి ఆర్జిత సేవల టికెట్‌ ధరల పెంపు ప్రతిపాదనను వేలం పాటలా మార్చేసిన తీరును లైవ్‌లో చూసిన జనం ఛీత్కరించుకున్నారు! ఇలాంటి ఘనకార్యాల్ని ప్రజలు చూస్తే బండారం బయట పడుతుందనుకున్నారో ఏమో ఆ తర్వాత ఇంకెప్పుడూ సమావేశాల ప్రత్యక్షప్రసారం చేయలేదు. పాలకమండలి ఎజెండాను, నిర్ణయాల్ని తితిదే వెబ్‌సైట్‌లోనూ పెట్టడం మానేశారు. లైవ్‌ కొనసాగించి ఉంటే కల్తీ నెయ్యి సరఫరాకు రాచబాట పరిచిన మీ నిర్వాకాన్ని ప్రజలు అప్పుడే గుర్తించేవారేమో!

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 03:26 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సంక్షిప్త వార్తలు(16) జోడు రథాలు.. మిన్నంటిన శివనామస్మరణలు.. కిక్కిరిసిన వీధులతో శ్రీకాళహస్తిలో రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.
  • స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రొమానా క్రోపిలోవా మధ్య ఆదాయ దేశాల్లో విద్యలో తీసుకొచ్చిన కొన్ని ఏఐ సాధనాలు విఫలమవుతున్నాయని ఫ్యాబ్‌ ఏఐ ఎడ్యుటెక్‌ డైరెక్టర్‌ రొమానా క్రోపిలోవా తెలిపారు.దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంప్యాక్ట్‌ సమ్మిట్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ..
  • ప్రభుత్వ సేవలు మరింత సులభతరం ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు.
  • సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై దామోదరనాయుడు అప్పీల్‌ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌గా తన నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డాక్టర్‌ టి.దామోదరనాయుడు దాఖలు చేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
  • వైకాపా హయాంలోని ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అసలైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై ప్రభుత్వం విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ కోరారు.
  • జస్టిస్‌ బాలాజికి ఘన సన్మానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ మెడమల్లి బాలాజిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
  • నూజివీడు కోర్టుకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో నమోదైన కేసులో వైకాపాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సోమవారం నూజివీడులోని న్యాయస్థానంలో హాజరయ్యారు.
  • తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, ఇతర నిందితులు బాలరాజు, రాజేష్, మణిమారన్, ఎన్‌.రవి, అన్బురాసు, అల్లాబక్షు కోర్టులో వాయిదాకు హాజరయ్యారు.
  • డ్వాక్రా మహిళలకు తీపికబురు మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
  • రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల.. మే నెల కోటా విడుదల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఈనెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
  • 498 కేసులో లుకౌట్‌ నోటీసా? పోలీసులు యాంత్రిక ధోరణిలో లుకౌట్‌ సర్క్యులర్‌ (ఎల్వోసీ) జారీ చేసేస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.
  • బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్‌ కమిషన్‌! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీల జనాభా అధ్యయనానికి డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించనుంది.
  • నెల్లూరు మేయర్, ఏలూరు డిప్యూటీ మేయర్‌ స్థానాలకు 26న ఎన్నికలు రాష్ట్రంలోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్‌ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.
  • త్యాగనిరతికి నిలువెత్తు ఆకృతి రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు శాఖమూరు వద్ద ‘స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌’ పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
  • రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ ‘కృత్రిమ మేధ(ఏఐ)తో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం. త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం అందే సాంకేతిక వ్యవస్థను (వీ2వీ) అందుబాటులోకి తీసుకురానున్నాం.
  • ఇంటింటికీ నీటి సరఫరాపై నిఘా గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరాలో నాణ్యత ప్రమాణాలను ఏఐతో ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరించారు ‘ఆర్ఘ్యం’ సంస్థ సీనియర్‌ మేనేజర్‌ భావన బడోలా.
  • క్రీడాకారుల ఆటను ఏఐతో ట్రాక్‌ చేస్తున్నాం క్రీడాకారుల ఆట తీరు, వ్యక్తిగత శిక్షణ కార్యక్రమాలను కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా ట్రాకింగ్‌ చేస్తున్నామని లక్ష్మీబాయి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉపకులపతి కపానా శర్మ తెలిపారు.
  • సముద్రాలకు ప్లాస్టిక్‌ నుంచి విముక్తి ఏఐ ఆధారిత విధానాలతో సముద్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపొచ్చని కర్ణాటకలోని ఉడుపికి చెందిన బేరు కోస్ట్‌ క్లియర్‌ సంస్థ వ్యవస్థాపకురాలు దివ్యా హెగ్డే అనుభవపూర్వకంగా తెలిపారు.
  • సాగరతీరంలో మిలన్‌ సంబరాలు అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (ఐఎఫ్‌ఆర్‌-2026), మిలన్‌ వేడుకల్లో భాగంగా తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక విన్యాసాలు జరిగాయి.
  • తిరుమలలో తెలంగాణ భవన్‌కు స్థలం కేటాయించండి తిరుమలలో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భద్రాచలం సమీపంలోని ఐదు ఏపీ గ్రామాల్ని తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్టు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.