India: వాణిజ్య చర్చలకు ఆత్మవిశ్వాసంతో భారత్‌ : మంత్రి పీయూష్‌ గోయల్‌

Eenadu icon
By Business News Team Published : 09 Feb 2026 00:07 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

 ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ ( India) ఇటీవల కాలంలో వాణిజ్య చర్చల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొంటోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. భవిష్యత్తులో మన దేశ మార్కెట్‌ 35 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందనే నమ్మకమే దీనికి కారణమన్నారు. బలమైన స్థితిలో ఉండి చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. 

భారత్‌ అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ‘‘మనది 4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని చెబుతున్నాను. భవిష్యత్తులో మనం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేనాటికి 35 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చు. నేడు ఆ నమ్మకం భారత్‌లో బలంగా ఉంది’’ అని పేర్కొన్నారు. 

మరోవైపు భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌తో రైతులు, పాడిపరిశ్రమకు ఎటువంటి నష్టం ఉండబోదని పీయూష్‌ గోయల్‌ భరోసాగా చెప్పారు. కొన్ని రంగాల్లో సున్నాశాతం సుంకాలు పోటీ తత్వాన్ని పెంచుతాయన్నారు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :