విలాసవంత ఇళ్ల ధరలు తగ్గొచ్చు!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంత ఇళ్లు/ఫ్లాట్లకు గిరాకీతో పాటు ధరలూ తగ్గొచ్చని ఒక సర్వే పేర్కొంది. ‘ఇండియా లగ్జరీ రెసిడెన్షియల్ అవుట్లుక్ 2026’ నివేదికలో ఈ విషయాన్ని ప్రాపర్టీ కన్సల్టెంట్ ఇండియా సోథెబైస్ ఇంటర్నేషనల్ రియాల్టీ (ఐఎస్ఐఆర్) తెలిపింది. సుమారు 700 మంది అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐ), అల్ట్రా హెచ్ఎన్ఐల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఈ సర్వేలో అభిప్రాయాలు తెలిపిన వారిలో 53% మంది మూలధన పెట్టుబడులు పెరుగుతాయనే విలాసవంత ఇళ్లపై పెట్టుబడి పెట్టారు. 47% మంది వ్యక్తిగత వినియోగం కోసం కొన్నారు.ఈ నివేదిక ప్రకారం.. అభిప్రాయాలు తెలిపిన వారిలో 56% మంది ధరలు తగ్గుతాయనే భావిస్తున్నారు.
- 2026-27లో జీడీపీ వృద్ధి 6-7 శాతంగా ఉండొచ్చని 72% మంది పేర్కొన్నారు.
- స్థిరాస్తిపై వార్షిక రాబడి 15% ఉంటుందని 67% మంది ధనిక పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు.
- 2025లో దిల్లీ-ఎన్సీఆర్, ముంబయి, గోవా, అలీబాగ్ వంటి ప్రాంతాల్లో విలాసంతవంత ఇళ్లు/ఫ్లాట్ల మార్కెట్ బాగానే రాణించింది. అంకుర సంస్థల వ్యవస్థాపకులు, తదుపరితరం ఔత్సాహికులు, సీనియర్ వృత్తి నిపుణుల వంటివారు విలాసవంత ఇళ్ల కొనుగోలుకు ముందకు రావడం ఇందుకు కారణం.