Bangladesh: భారత నూలుకు డ్యూటీ-ఫ్రీ సౌకర్యం తొలగించాలి: బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్-బంగ్లాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తూ వచ్చాయి. మరోవైపు ఆ దేశంలోని హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్కు వ్యతిరేకంగా అక్కడి వస్త్ర పరిశ్రమ వర్గాలు (Bangladesh textile mills) మరో డిమాండ్ను తెర పైకి తీసుకువచ్చాయి. ఇప్పటివరకు భారత నూలుకు బంగ్లాదేశ్లో ఉన్న డ్యూటీ-ఫ్రీ సౌకర్యం తొలగించాలని పట్టుబట్టాయి. లేదంటే ఫిబ్రవరి 1 నుంచి కర్మాగారాలు మూసివేస్తామని బంగ్లా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు ఆ దేశ వాణిజ్యశాఖ నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు లేఖ అందినట్లు యూనస్ ప్రభుత్వం పేర్కొంది.
జనవరి చివరి నాటికి భారత నూలుకు (Indian yarn) సుంకం లేని దిగుమతి సౌకర్యాన్ని ఉప సంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా అన్ని స్పిన్నింగ్ యూనిట్లలో కార్యకలాపాలు నిలిపేస్తామని దేశీయ మిల్లర్లు హెచ్చరించారు. చాలా ఏళ్లుగా సుంకం లేకుండా భారత్ నుంచి చౌకగా నూలును దిగుమతి చేసుకుంటుండడం వల్ల స్థానిక స్పిన్నింగ్ యూనిట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల దేశీయ వస్త్ర పరిశ్రమలో 12వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన అమ్ముడుపోని నిల్వలు మిగిలిపోయాయని తెలిపారు. 50కి పైగా వస్త్ర పరిశ్రమలు మూసేయడం వల్ల వేలాదిమంది కార్మికులు నిరుద్యోగులుగా మారారన్నారు.
- చైనా అణు రహస్యాలు లీక్.. టాప్ జనరల్పై దర్యాప్తు
మరోవైపు బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ వర్గాల డిమాండ్ను అక్కడి వస్త్ర ఎగుమతిదారుల సంఘం వ్యతిరేకిస్తోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న నూలుతో పోలిస్తే స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న నూలు ఖరీదైనదని వస్త్ర ఎగుమతిదారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్లు, మెరుగైన నాణ్యత విషయాల్లో ప్రపంచ దేశాలు భారత్లో ఉత్పత్తి అయ్యే నూలుకు ప్రాముఖ్యత ఇస్తాయన్నారు. ఇప్పుడు భారత్కు ఉన్న డ్యూటీ-ఫ్రీ సదుపాయాన్ని నిలిపివేస్తే అక్కడి నుంచి ఎగుమతులు తగ్గుతాయన్నారు. దీనివల్ల ప్రపంచ దుస్తుల మార్కెట్లో పోటీని బంగ్లాదేశ్ ఎదుర్కోలేదన్నారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 11:24 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అమెరికాతో చర్చలకు జెనీవాకు ఇరాన్ విదేశాంగ మంత్రి అమెరికాతో అణు చర్చల కోసం ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్విట్జర్లాండ్లోని జెనీవాకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్లింది. అక్కడ అరాఘ్చీ స్విట్జర్లాండ్, ఒమన్ విదేశాంగమంత్రులతో భేటీ అవుతారు.
- గ్రహాంతర జీవులు ఉన్నాయి.. కానీ: ఒబామా ఏరియా 51లో గ్రహాంతర జీవులను అమెరికా నిర్భందించిందనే ఊహాగానాలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒబామా స్పందించారు.
- రష్యా చమురు కొనమని భారత్ హామీ ఇచ్చింది! - అమెరికా చమురు దిగుమతి విషయంలో జాతీయ ప్రయోజనాలే తొలి ప్రధాన్యమని భారత్ పునరుద్ఘాటిస్తున్న విషయం తెలిసిందే.