నాదబ్రహ్మ త్యాగయ్య

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

అరవై నాలుగు కళల్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అది ఏ సంగీతమైనా అందులోని మాధుర్యాన్ని అనుభవించడంలో ఆనందం ఉంటుంది. పాటలకు రాగాలను సమకూర్చి, సంగీతానికి సిద్ధాంతాలను రూపొందించి నిర్దిష్టమైన సంప్రదాయాలను ప్రవేశపెట్టిన మహనీయులు ఎందరో! వారిలో నాదబ్రహ్మ త్యాగయ్య చిరస్మరణీయులు, గొప్ప వాగ్గేయకారులు.
త్యాగయ్య తంజావూరు జిల్లాలో కావేరీ నదీ తీరంలోని తిరువారూరులో సీతమ్మ, రామబ్రహ్మం దంపతులకు 1767 మే నాలుగో తేదీన జన్మించారు. తన ఆరాధ్య దైవాలైన సీతారాముల పేర్లే తన తల్లిదండ్రుల పేర్లు కూడా కావడం తన అదృష్టంగా భావించేవారట. బాల్యం నుంచి పరమ రామభక్తుడైన త్యాగయ్య తండ్రి దేవతార్చన చేసుకునేటప్పుడు నిత్యం పక్కనే కూర్చుని తన్మయత్వంతో గొంతుకలిపేవారు. ఒకరోజు అలాగే భక్తిపారవశ్యంలో ‘నమో నమో రాఘవా’ అనే కీర్తన పాడగా తండ్రి ఆశ్చర్యపోతూ ‘ఇంత చక్కటి పాట ఎక్కడ నేర్చుకున్నావు?’ అని అడిగారు. ‘నోటికి వచ్చింది, పాడేశాను’ అన్నారట త్యాగయ్య. అది విని కొడుకు గొప్ప వాగ్గేయకారుడు అవుతాడని రామబ్రహ్మం ఆనాడే పసిగట్టారు.
ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా త్యాగయ్యకు సంగీతం నేర్చుకోవాలన్న కోరిక తీరే మార్గం కనిపించలేదు. ఊరి వెలుపల ఉన్న పూలతోటకెళ్లి తండ్రి పూజకు పూలు కోసుకొచ్చేవారు త్యాగయ్య. ఆ దారిలోనే శొంఠి వెంకట రమణయ్య అనే సంగీత విద్వాంసుడి ఇల్లు ఉండేది. రోజూ పూలు తెస్తూ ఆ ఇంటి ముందు ఆగి ఆయన శిష్యులకు చెప్పే సంగీత పాఠాలను శ్రద్ధగా వినేవారు త్యాగయ్య. ఒకరోజు అలాగే సంగీతపాఠంలో లీనమై ఇంట్లో తండ్రి పూజ విషయం మర్చిపోయారు. దాంతో వెతుక్కుంటూ వెళ్లిన రామబ్రహ్మానికి వెంకట రమణయ్య ఇంటి ముందు నిలబడి పాఠం వింటున్న కొడుకు కనిపించాడు. వెంటనే అతణ్ని తీసుకుని రమణయ్య దగ్గరికి వెళ్లి విషయం వివరించారు. అప్పటికే త్యాగయ్య పేరు విని ఉన్న రమణయ్య అతణ్ని శిష్యుడిగా చేర్చుకున్నారు. ఓ సందర్భంలో వెంకట రమణయ్య ఇంట్లో జరిగిన సంగీత సభలో గురువు ఆనతి మేరకు త్యాగయ్య అప్పటికప్పడు బిలహరి రాగంలో ‘దొరకునా ఇటువంటి సేవ’ అనే కీర్తన ఆశువుగా ఆలపించారు. ముగ్ధుడైన గురువు ఆనందం పట్టలేక త్యాగయ్యను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. అప్పట్నుంచీ త్యాగయ్య కీర్తిప్రతిష్ఠలు దశదిశలా వ్యాపించాయి.
తండ్రి మరణానంతరం త్యాగయ్య శిష్యులను కూడదీసుకుని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ తన గానమాధుర్యంతో శ్రోతలను పరవశులను చేస్తూ రామభక్తి సాగరంలో మునిగితేలేవారు. త్యాగయ్య రాసి స్వరపరచిన ఆణిముత్యాల్లాంటి అయిదు కీర్తనలను పంచరత్నాలంటారు. ఏటా శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో ఈ అయిదు కీర్తనలను సామూహికంగా గానం చేయడం ఆనవాయితీ. ఆ ఉత్సవాల్లో పాల్గొని విద్వాంసులతో గొంతు కలిపి పాడటాన్ని అదృష్టంగా భావిస్తారు సంగీత కళాకారులు. ఐహిక ప్రలోభాలకు దాసులవకుండా నాదబ్రహ్మగా కీర్తి పొంది ఆరాధనలు అందుకుంటున్న త్యాగయ్య ప్రాతఃస్మరణీయులు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
- దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
- శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
- తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
- మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
- మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
- అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
- సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
- దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
- ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
- అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
- పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.
- భక్తి - ధర్మం భక్తిభావం, ధర్మగుణం కలిగినవారే మనకు మార్గదర్శకులు, పురాణపురుషులు అయ్యారు. భక్తి వేరు, ధర్మగుణం వేరు. ధర్మగుణంలేని భక్తి శోభించదు, జయించదు.
- గురుబ్రహ్మ... భౌతిక ప్రపంచంలో వినోద, విహారాలతో సంతృప్తి చెందుతున్నంతవరకు ఆధ్యాత్మిక లోకంలో విహరించాలనే ఆలోచన రాదు. ప్రాపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారితెన్నులు తెలియని వారికి భగవత్సన్నిధికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు.
- సృష్టికి మార్గదర్శకుడు సృష్టి... యాదృచ్ఛికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, నియమం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి, జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు.
- జ్ఞానాయుధం జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగులను ప్రకాశింపజేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే ఙ్ఞానం... అంటాడు దక్షిణామూర్తి.
- ఏది హింస? ‘అహింసా పరమోధర్మః’ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మమని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపడమో అని మాత్రమే అర్థంకాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురిచేసినా అది హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసి వేయవచ్చు, ఆ గాయాలు మందులతో కొంత కాలానికి మానతాయి.
- సహనం ఒక వరం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే- సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని; పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం అది.
- కాలం విలువ కాలం ప్రతీ క్షణం ఓ ఇంద్రజాలం. కళ్లముందే మాయమైపోతుంటుంది మరి. కదిలే కాలం అనుకోని విజయాలను, వైభవాలను ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఓటమినీ చవిచూపిస్తుంది.
- దర్శనకళ ‘దర్శనం’ అనేది చాలా విలువైన పదం. విరివిగా ఉపయోగిస్తూనే ఉన్నా, అంతరార్థం చాలామందికి బోధపడని పదమది. ఉదాహరణకు ‘మీరు దేవుణ్ని చూశారా’ అనే ప్రశ్న ఎదురైతే, మనలో చాలామందిమి బిత్తరపోతాం. ఏం చెప్పాలో తెలియక తికమక పడతాం.