సంబంధ బాంధవ్యాలు

Eenadu icon
By Editorial Team Published : 10 Jun 2026 02:58 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

నుషులందరూ అనుబంధానికి, ఆత్మీయతకు పట్టంకడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తోంది. కుటుంబ గౌరవవృద్ధికి కూడా ఇవే మూలసూత్రాలని వేదాలు ఉపదేశిస్తున్నాయి. స్వతహాగా మనిషి సంఘజీవి. అందరితో   కలసిమెలసి ఉండటం మానవ సహజ లక్షణం. ఇరుగుపొరుగుతో, ఊరివారితో, సహోద్యోగులతో వ్యక్తికి ఉండేవి స్నేహపూర్వక సంబంధాలైతే; కుటుంబ సభ్యులు, బంధువులతో ఉండేవి బంధుత్వాలు.

పూర్వం మన సమాజంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. రెండుమూడు తరాల కుటుంబ సభ్యులందరూ సదవగాహనతో కలసి ఉండేవారు. కాలక్రమంలో ఈ సమష్టి కుటుంబాలు వ్యష్టి కుటుంబాలుగా మారాయి. దాంతో ఒకనాటి కుటుంబ సభ్యులు ఇప్పుడు బంధువుల జాబితాలోకి చేరారు. నిజానికి ఈ కుటుంబ సంబంధాలు చాలా విలువైనవి. వీటి గురించి రామాయణం ఎంతో ఉన్నతంగా వివరించింది. ముఖ్యంగా అందులోని అన్నదమ్ముల అనుబంధం ఆదర్శవంతమైనది. తండ్రి మాట జవదాటకుండా అరణ్యానికి వెళ్లినా సమభావనతో అందరి పట్ల ధర్మాన్ని పాటించాడు శ్రీరాముడు. సోదరులను ప్రేమించాడు. వానరుడైన సుగ్రీవుడితో మిత్రధర్మాన్ని కొనసాగించాడు. శరణు వేడిన దానవవీరుడు విభీషణుణ్ని ఆదరించాడు. అనుబంధాలకు విలువిచ్చే విషయంలో శ్రీరాముడు సర్వోన్నత గుణ సంజాతుడిగా తేజరిల్లుతాడు. అందుకే రామమార్గం అందరికీ అనుసరణీయమైనది. ఇక, భారతంలో ధర్మరాజు మాయాజూదంలో సర్వం కోల్పోయినప్పుడు ద్రౌపదితో పాటు తమ్ముళ్లయిన భీమార్జున నకుల సహదేవులు కూడా అన్న వెంట అడవులకు వెళ్లారు. కష్టసుఖాలలో పాలుపంచుకున్నారు. 

నిజానికి బంధం అంటే అందరినీ కలుపుకోవడం. బంధుత్వాలు ఆ భగవంతుడు ప్రసాదించినవి. స్నేహసంబంధాలు మనం ఎంచుకుని, పెంచుకునేవి. వాటిని నిలుపుకొంటూ పదుగురికీ ఆదర్శంగా నిలవాలి. మన మాట ప్రేమగా, ఆత్మీయంగా ఉన్నప్పుడే బాంధవ్యాలు, స్నేహాలు బలపడతాయి. అనేకమంది మనల్ని ఇష్టపడవచ్చు. కానీ కొద్దిమంది మాత్రమే మన అంతరంగానికి దగ్గరవుతారు. అలాంటివారే మనతో శాశ్వత బంధాన్ని కోరుకుంటారు. కలుపుకొనిపోయే మనస్తత్వం ఉంటే అందరూ మనవాళ్లే అవుతారు. మనతో కలసి ఉండాలని ఆరాటపడతారు. అలా కాకుండా అందరితోనూ అంటీ ముట్టనట్టు ఉండేవారికి సన్నిహితులంటూ ఎవరూ ఉండరు. కలవడానికి, విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గరవడానికి చూపిస్తే ప్రతి బంధం పటిష్ఠంగానే ఉంటుంది. బంధాలు తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. 

ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన నేటి మానవ సంబంధాలలో నిజమైన మానవీయ పరిమళం లోపిస్తోంది. షరతులతో కూడిన సహాయాలు, మీ ఇంటికొస్తే నాకేమిస్తావు, మా ఇంటికొస్తే నాకేం తెస్తావు... తరహా స్వార్థాలు అనుబంధాలను కలుషితం చేస్తున్నాయి. వ్యక్తిని అతడి బలాలూ బలహీనతలతోపాటు అర్థం చేసుకుని, బేషరతుగా ప్రేమను పంచగలిగితే ఏ అనుబంధమైనా అపురూపమవుతుంది.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఏదీ అసాధ్యం కాదు రామాయణంలో విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణ ఘట్టం విశిష్టమైనది. పట్టుదలతో, అచంచల దీక్షతో పనిచేస్తే ఏదీ అసాధ్యం కాదని నిరూపించే గొప్ప సందేశాత్మక గాథ ఇది.
  • దృఢవ్రతుడు! భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ‘వ్రతం’ అంటే కేవలం ఒక పూజో ఉపవాసమో కాదు. మనసు, మాట, కర్మ... మూడింటినీ ఒక లక్ష్యంపై స్థిరంగా నిలపడం. మన సంస్కృతిలో వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రమాణం సంపద కాదు, పదవి కాదు; సంకల్ప స్థిరత్వం. అలాంటి స్థిరచిత్తుణ్ని శాస్త్రాలు ‘దృఢవ్రతుడు’ అని సంబోధించాయి.
  • దైవిక లక్షణం... క్షమ జీవితంలో ముందుకు సాగడం అంటే సవాళ్లను దాటుకుంటూ, వాటి నుంచి నేర్చుకుంటూ ఎదగడమే. అయితే అప్పుడప్పుడు అవాంఛనీయ పరీక్షలు కూడా ఎదురవుతాయి- ఇతరుల అజ్ఞానం వల్ల కలిగే ఇబ్బందుల రూపంలో! కొందరు మాటలతో నొప్పిస్తారు, మరికొందరు చేతలతో నష్టం కలిగిస్తారు. 
  • శ్వాసే నేను ‘నేను ఎవరు?’ అనే అన్వేషణ మనిషిని అనాదిగా వెంటాడుతున్న అతి పెద్ద ప్రశ్న. దేహం మారుతుంది. ఆలోచనలు మారతాయి. భావోద్వేగాలు అలల్లా వచ్చి పోతుంటాయి. కానీ పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రాణితో నిరంతర బంధాన్ని కలిగి ఉండేది శ్వాస మాత్రమే. 
  • శ్రమయేవ జయతే! శ్రమను జీవనసౌందర్యంగా అభివర్ణిస్తారు భారతీయులు. మన పురాణాలు, ధార్మిక గ్రంథాలు శారీరక శ్రమ ప్రాధాన్యాన్ని పలు సందర్భాలలో నొక్కి చెప్పాయి. మహాభారతం శాంతిపర్వంలో భీష్మపితామహుడు ధర్మరాజుకు రాజధర్మాలను బోధించే సందర్భంలో అదృష్టం శ్రమించేవాడి వెంటే నడుస్తుంది...
  • సంతృప్తికర జీవనం నిజమైన సంపద అంటే ఏమిటి? మనం కష్టపడి సంపాదించిన ధనం, అధికారం, పేరు ప్రతిష్ఠలు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ, మనసు ప్రశాంతంగా, తృప్తిగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం సొంతమవుతుంది.
  • తరిగిపోని ఆస్తి మనిషన్నాక ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆస్తి కచ్చితంగా ఉంటుంది. ధనవంతుడికైతే ఏడుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఆ ధీమాతో అతడు ఏ చీకూచింతా లేకుండా జీవితాన్ని గడిపేస్తూంటాడు.
  • సూత్రధారులు- పాత్రధారులు జగన్నాటకంలో మనుషులంతా పాత్రధారులే. కొందరే సూత్రధారులుగా పేరొందుతారు. కొందరి జీవితం దీపంలా పరిమిత వెలుగులను పంచితే మరికొందరి జీవితం సూర్యుడిలా ప్రపంచానికే వెలుగిస్తుంది.
  • తలచినవారికి తలచినట్లుగా... మూడు కోట్లమంది దేవతలు ఉన్నారని చాలామంది నమ్మకం. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ దేవుణ్ని ప్రార్థించాలన్న సందేహం కూడా వారికి కలుగుతుంటుంది.
  • గుహుడి భక్తి రామాయణ మహాకావ్యంలో భక్తిరసానికి పరాకాష్ఠగా నిలిచే ఘట్టాల్లో నిషాదరాజు గుహుడి వృత్తాంతం అద్వితీయమైనది. పితృవాక్య పరిపాలన కోసం అడవులకు బయలుదేరిన దాశరథికి గంగాతీరంలో ఎదురైన తొలి ప్రేమామృతం గుహుడు.
  • పలకరింపు జీవితం అనేది అనేక బంధాలతో అల్లుకున్న అందమైన గూడు వంటిది. ఆ గూడు బలంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది... అదే పలకరింపు. మాటలతో గానీ, స్మరణతో గానీ రోజూ తాకని బంధం క్రమంగా బలహీనమవుతుంది.
  • వేదాలు నీ నివాసం మనిషి చరిత్ర ఎన్నో యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.
  • బలి చక్రవర్తీ! భళీ భళీ!! ‘వందమందిలో ఒక శూరుడు పుడతాడు. వెయ్యి మందిలో ఒక పండితుడు ఉంటాడు. లక్షమందిలో ఒక వక్త పుడతాడు. కానీ అంతమందిలోనూ ఒక దాత ఉంటాడో లేదో!’ అన్నారు. దానానికి ఉన్న ప్రశస్తి అలాంటిది.
  • తాపత్రయం! ‘ఎందుకీ తాపత్రయం?’ అనే ప్రశ్న తరచూ వింటూ ఉంటాం. అసలు ‘తాపత్రయం’ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మోక్షం గురించి తెలియాలి.
  • కాల పరీక్ష జీవితంలో అన్నిటికన్నా కష్టమైన పరీక్ష ఏది స్వామీ? అడిగాడు శిష్యుడు. గురువు చిరునవ్వుతో... భగవంతుడు పెట్టే పరీక్షలను తట్టుకుంటూ, సమయం వచ్చేదాకా ఓపికగా వేచి ఉండటమే అసలైన పరీక్ష నాయనా అన్నారు. ఆ సమాధానం శిష్యుణ్ని ఆలోచనలో పడేసింది.
  • ఉత్తమోత్తమ ప్రార్థన మనిషి అనుభవించే లోతైన అనుభూతులలో ప్రార్థన ఒకటి. అది కేవలం ఆరాధనలో భాగమే కాదు; మన అంతరంగానికి, విశ్వశక్తికి మధ్య నిరంతరం ప్రవహించే నది లాంటిది.
  • అహం ఆడే ఆట మనిషి ఎప్పుడూ తనకు తాను సక్రమంగా ఉన్నాననే భావనలో ఉంటాడు. ఏ విషయంలోనైనా సరే, తనపై తనకు అంచనాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి ‘అహం’ ఎంత బలంగా ఉంటే జీవితంలో అంతగా పోరాడాల్సివస్తుంది.
  • కాలమహిమ కాలానిది నిరంతర ప్రయాణం. ఆగదు.. ఆపడానికి వీలవదు. క్షణం ఆలస్యమైనా తీసుకురాలేనిది కాలం ఒక్కటే. కాలం కొట్టే దెబ్బలు, చెప్పే పాఠాలు భరించనివారు దాదాపుగా నర వానర రాక్షస దేవతా గణాలలో లేరని చెప్పవచ్చు. కాలం చెప్పిన మాట మనిషి వినాలి. మనిషి వివరించే పని కాలం చేయదు. 
  • అంతా మంచివాళ్లే కానీ... ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అన్నాడు వేమన. కానీ, ఇవాళ చూస్తే అసలు పుణ్యపురుషులు ఏరయా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
  • కడుపుమంట లోకంలో మనకన్నా ఎవరైనా పై స్థాయిలో కనిపించినా, మనకన్నా వారికి ఎక్కువ ఉందనిపించినా, మనకన్నా ఎదుటి వాడు ఎందులో గొప్ప? అనే ఆలోచన వచ్చినా... మనకు తెలియకుండానే లోలోపల అలజడి చెలరేగుతుంది. దాని పేరే- అసూయ లేదా కడుపుమంట. నిజానికి అది ఈనాటిది కాదు. ఆకాశం ఏనాటిదో- అసూయ ఆనాటిది.