Bengaluru: భార్య హత్యకు.. బిహార్లో శిక్షణ

Eenadu icon
By Karnataka News Desk Published : 04 Jan 2026 07:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ‘భువనేశ్వరితో చాన్నాళ్లుగా వేగలోకపోయా. ఆమె తీరుతో విసిగి వేసారి చివరికి కడతేర్చాలనుకున్నా. ఆ క్రమంలోనే తుపాకీ ఎలా ఉపయోగించాలో శిక్షణ పొందా’నని ఆ భర్త బాలమురుగన్‌ చెబుతుంటే విస్తుపోవడం పోలీసు అధికారుల వంతైంది. డిసెంబరు 24న భువనేశ్వరి హత్య నగరాన్ని కుదిపేసింది. కేసు దర్యాప్తు వేళ కీలకమైన విషయాలు వెలుగు చూశాయి. ‘నాకు దూరమైంది. అంతటితో ఊరుకోక మరొకడికి చేరువైంది. ఆమెకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నా. కడతేర్చడమే మిగిలింది. అందుకే తుపాకీ కాల్చడంలో శిక్షణ పొందా’ అంటూ కేసు దర్యాప్తు చేస్తున్న మాగడి రోడ్డు ఠాణా అధికారులకు మురుగన్‌ వివరించాడు. ‘వెస్ట్‌ ఆఫ్‌ కార్డ్‌’ రహదారిలో ఉంటోన్న భువనేశ్వరిని కడతేర్చడానికి తుపాకీ కొనుగోలు చేయాలని మురుగన్‌ మూడు సార్లు బిహార్‌కు వెళ్లాడట. అక్కడ రెండుసార్లు దళారుల చేతుల్లో మోసపోయి డబ్బు పొగొట్టుకున్నాడు.

మూడోసారి బిహార్‌కు వెళ్లి ‘సరైన వ్యక్తుల’ను కలుసుకుని, నగదు చెల్లించి రెండు ఆయుధాలు కొనుగోలు చేశాడని పోలీసు దర్యాప్తులో తేలింది. ‘వాటిని కొన్నా. పేల్చడం నాకు రాకపోవడంతో పక్షం రోజులు అక్కడే ఉండి తుపాకీ ఎలా కాల్చాలో శిక్షణ పొందా. బెంగళూరుకు తిరిగి వచ్చాక తుపాకీ ఉపయోగించడంలో తడబడతాననే భయంతో తమిళనాడుకు చెందిన సుపారీ కిల్లర్‌తో ఒప్పందం చేసుకున్నా. ఆ వ్యక్తికి రూ.1.50 లక్షలు, ఆ తుపాకీ ఇచ్చా. ఆ కిల్లర్‌ కొద్ది రోజులు ఆమె కదలికలనున గమనించినా హత్యచేయలేక వెనక్కివెళ్లిపోయాడు. ఇక నేనే కాల్చేద్దామని ప్రయత్నించినా కాలేదు. మళ్లీ ఆ సుపారీ హంతకుడిని బతిమాలి రప్పించా. ఈసారి అతడి గురి తప్పలేదు. గుండ్లు ఆమె శరీరంలోకి దూసుకుపోయాయి. అంతా.. నేనే చంపానని అనుకున్నారు. ఆ వ్యక్తి ఎటు పారిపోయాడో నాకు తెలియదు’ అంటూ పోలీసులకు వివరించాడు. మురుగన్‌ అందించిన సమాచారంతో హంతకుడి వేట మళ్లీ మొదలుపెట్టామని సంబంధిత అధికారులు వెల్లడించారు. 

► Read latest Karnataka Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విదేశీ పర్యటన మర్మమేమిటో? [ 17-02-2026] రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై చర్చ కొనసాగుతుండగానే ఎమ్మెల్యేల బృందం విదేశీ పర్యటన ఆసక్తి రేకెత్తిస్తోంది. సాధారణంగా మంత్రులకు విదేశీ పర్యటన కొత్తేమీ కాకున్నా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా విదేశాలకు వెళ్లటం..
  • సుబ్బారెడ్డి ఎన్నిక చెల్లదు [ 17-02-2026] చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లి ఎమ్మెల్యే ఎస్‌ఎస్‌ సుబ్బారెడ్డి ఎన్నిక చెల్లదని ఉన్నత న్యాయస్థానం సోమవారం ప్రకటించింది. ఇదే సమయంలో ఆ ఎన్నికల్లో ఓడి, రెండో స్థానంలో నిలిచిన భాజపా అభ్యర్థి సి.మునిరాజు ఎన్నికైనట్లు ప్రకటించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.
  • ‘జేఈఈ మెయిన్స్‌’లో సాయితేజం! [ 17-02-2026] బెంగళూరుకు చెందిన ఎ.విష్ణుసాయి తేజ జేఈఈ మెయిన్స్‌ సెషన్స్‌-1 పేపర్‌-1 పరీక్షలో దేశంలో 14వ ర్యాంకు సాధించాడు! విష్ణు సాయి తేజ 99.99 పర్సంటైల్‌తో రాణించాడు
  • ప్రాణం తీసిన చెట్టుకొమ్మ [ 17-02-2026] జీవాలకు ఆకుల కోసం అడవిలో చెట్టెక్కి కొమ్మలు నరుకుతున్న సమయంలో మర్మాంగానికి కొమ్మ తగిలి హేమంత్‌ (27) అనే యువకుడు మరణించాడు.
  • ప్రేమించలేదని.. బీరు సీసాతో దాడి [ 17-02-2026] తన ప్రేమను అంగీకరించడం లేదని ఒక యువతి (23)పై స్వరూప్‌ (26) అనే యువకుడు బీరు సీసా పగులగొట్టి పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం మణిపాల్‌ ఆసుపత్రిలో చేర్పించారు.
  • న్యాయాలయాలకు బాంబు బెదిరింపు [ 17-02-2026] మడికేరి, దావణగెరె జిల్లా న్యాయస్థానాలు, ధార్వాడ హైకోర్టు కార్యాలయాల్లో బాంబులు పెట్టామని వచ్చిన ఈ-మెయిల్‌ కలకలాన్ని సృష్టించింది.
  • ఓరబ్బీ.. ఇది బ్యాడగి డబ్బీ! [ 17-02-2026] బ్యాడగి రకం మిరపకు చక్కని ధర లభిస్తోంది. ‘బ్యాడగి డబ్బీ’ రకం మిరప క్వింటాల్‌ రూ.89 వేల ధర పలికింది. ‘బ్యాడగి కడ్డి’ రకం మిరప క్వింటాల్‌ రూ.69 వేల ధర పలికింది.
  • సాకేత్‌ను గుర్తించేందుకు అమెరికా పయనం [ 17-02-2026] అమెరికా బర్కిలీ సమీపంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేస్తూ అనుమానాస్పదంగా కన్నుమూసిన సాకేత్‌ (22) మృతదేహాన్ని ఇక్కడకు తీసుకువచ్చే అవకాశం తక్కువని ఎమ్మెల్సీ, కర్ణాటకలోని ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఉపాధ్యక్షురాలు ఆరతి కృష్ణ విచారం వ్యక్తం చేశారు.