Guntur: మాతృభాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పేలా..

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
గుంటూరులో వైభవంగా కొనసాగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు

గుంటూరు: మాతృ భాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పిన మహనీయులను గుర్తుకు తెచ్చుకునేలా.. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా.. గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు శివారులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో ఏర్పాటు చేసిన మహాసభలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టి.డి.జనార్ధన్, జస్టిస్ మానవేంద్ర రాయ్, తమిళనాడు నేత గోపీనాథ్ తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అతిథులకు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు.

పిల్లలకు మాతృభాషను దూరం చేయొద్దు: జస్టిస్ ఆకుల శేషసాయి
‘‘సందేశం ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు.. నాలుగు అమ్మ మాటలు వినటానికి వచ్చా. మాతృభాషను విస్మరిస్తే ఆ జాతి మనుగడ కష్టం. అమ్మను, అమ్మ భాషని గౌరవించే వాళ్లు ఎప్పటికీ తప్పు చేయరు. పిల్లలను మాతృభాషకు దూరం చేయొద్దు. అమ్మ భాషను భావితరాలకు అందించాలి’’ అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి అన్నారు.
తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు: టి.డి.జనార్థన్
‘‘చాలామంది ఇతర దేశాల్లో తెలుగు భాష కోసం సంఘాల నడుపుతున్నారు. అలాంటి అభిమానులంతా ఈ మహాసభలకు హాజరయ్యారు. ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదు. తెలుగువారి కోసం, తెలుగు భాష కోసం ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషిని సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారు. మనమంతా అమ్మ భాష అభివృద్ధికి కృషి చేయాలి. తెలుగు మహాసభల లాంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని ఘనంగా చాటాలి. సినిమాల్లో కూడా తెలుగు భాష అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారు. అనేక దేశాల్లో తెలుగును రెండో భాషగా బోధిస్తున్నారు. మాతృభాష మనుగడలో ఉన్నప్పుడు మాత్రమే మన ఉనికి ఉంటుంది. పాఠశాలల్లో పిల్లలు ఆంగ్లం మాట్లాడినప్పటికీ ఇంట్లో మాత్రం తెలుగు మాట్లాడేలా చూడాలి’’ అని తెదేపా నేత టి.డి.జనార్థన్ అన్నారు.
తెలుగు భాష పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: జస్టిస్ మానవేంద్ర రాయ్
‘‘తెలుగు మహాసభలకు హాజరు కావడానికి తొలుత సంకోచించా. ఉద్యోగరీత్యా ఆంగ్లంతో ఎక్కువ సంబంధం ఉంటుంది. అందువల్ల తెలుగులో మాట్లాడడం తక్కువగా ఉంటుంది. బ్రిటిష్ వారి పరిపాలన వల్ల చట్టాలన్నీ ఆంగ్లంలోనే ఉన్నాయి. వైద్య విద్య కూడా ఆంగ్లంలోనే కొనసాగుతోంది. బ్రిటిష్ వారు వెళ్లిపోయినా.. వారి భాషను మనం కొనసాగించడం వల్ల ఆంగ్లం మనం జీవితంలో భాగమైంది. ఆంగ్ల భాష ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. గుజరాత్లో ప్రభుత్వ పరమైన అన్ని అంశాలు గుజరాతీ భాషలోనే ఉంటాయి. ప్రభుత్వ పరమైన విధానాల వల్ల మార్పు సాధ్యం. మాతృభాషను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయం. కేవలం ఈ మూడు రోజులు మహాసభల ద్వారానే కాకుండా భాషా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
తమిళనాడులో తమిళ భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు: గోపీనాథ్
‘‘తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనేందుకు ప్రయత్నిస్తాను. తమిళనాడులో తమిళ భాషకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నేను ప్రాతినిథ్యం వహించే ప్రాంతం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. అప్పట్లో రాష్ట్ర విభజన సందర్భంగా ఎంతో ఇబ్బంది పడ్డాం. తెలుగు వారైనా మా పిల్లలకు తమిళంలో పరీక్షలు పెట్టారు. ఏ పార్టీ కూడా తమిళనాడులోని తెలుగువారి సమస్యను పట్టించుకోలేదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తమిళనాడులో 40 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే నేనొక్కడినే తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తాను. తమిళనాడు నేతలు తమిళంలోనే ప్రసంగాలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన ఎంపీలు ఎవరూ కూడా తెలుగులో మాట్లాడకపోవడం బాధాకరం’’ అని తమిళనాడు నేత గోపీనాథ్ అన్నారు.
► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మహాశివరాత్రి తిరునాళ్లు.. ప్రారంభమైన ఎడ్ల పూటీ లాగుడు పోటీలు [ 17-02-2026] నందిగామ మండలం దాములూరు శివారు కూడలిలో సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి.
- రైల్వే వంతెన నిర్మాణ పనుల పరిశీలన [ 17-02-2026] గుంటూరు నగరంలోని రైల్వే వంతెన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు.
- వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి [ 17-02-2026] వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
- జీతాలు పెంచాలంటూ అటవీ ఒప్పంద ఉద్యోగుల నిరసన [ 17-02-2026] ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు పెంచాలని కోరుతూ అటవీశాఖలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు మంగళగిరి జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.
- ఎమ్మెల్యే ధూళిపాళ్ల తల్లి నివాసంలో భారీ చోరీ [ 17-02-2026] గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో భారీ చోరీ జరిగింది.
- అర్థరాత్రి నుంచి మొదలైన రిక్రూట్మెంట్ ర్యాలీ [ 17-02-2026] గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం అర్థరాత్రి నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది.
- ఉపాధి హామీ పనుల పూర్తికి పరుగులు [ 17-02-2026] మరో 40 రోజుల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముగిసిపోతుండడం, వీబీజీరామ్జీ పేరుతో సరికొత్తగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో పనులు, పద్దులను యుద్ధప్రాతిపదికపై ముగించేందుకు అధికారులు దృష్టి సారించారు.
- బడ్జెట్ లేదంటారు... బకాయిలు కట్టరు! [ 17-02-2026] కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆస్తిపన్ను వసూలు చేసేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ఆపసోపాలు పడుతోంది. ఏటా బడ్జెట్ లేదన్న సాకుతో చాలా కార్యాలయాలు బకాయి పెడుతున్నాయి.
- వారు ఆడిందే ఆట! [ 17-02-2026] అధికారుల నిర్లిప్తత.. స్వార్థం... గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల పరువు తీస్తున్నాయి. అవినీతి అక్రమాలపై అంతులేని ఆరోపణలున్నా ఏళ్ల తరబడి పాతుకుపోయి రాజకీయ అండతో శాసిస్తూ.. నచ్చినట్టుగా వ్యవహారాలు నడిపిస్తున్నారు.
- అంబటి సంక్రాంతి వసూళ్ల కేసులో ముగిసిన వాదనలు [ 17-02-2026] మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబుపై సంక్రాంతి వసూళ్ల కేసులో వాదనలు ముగిశాయి. తీర్పు ఈ నెల 18న వెలువరిస్తామని గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి కుముదిని ప్రకటించారు.
- పనిలో చేరగానే.. పసిడిపై కన్నేశాడు! [ 17-02-2026] పంజాగుట్టలోని బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడిన ఇంటిదొంగను సోమవారం అరెస్ట్ చేసినట్టు ఖైరతాబాద్ డీసీపీ కె.శిల్పవల్లి తెలిపారు. దొంగతనం జరిగిన 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్న పంజాగుట్ట ఏసీపీ మురళీకృష్ణ.
- వినమ్రులై.. వి‘జేఈఈ’లై [ 17-02-2026] ఐఐటీ, ఎన్ఐటీలలో చదవాలనేది వారి ఆకాంక్ష... కల సాకారానికి సంకల్ప సిద్ధితో అడుగులేశారు.. చక్కటి ప్రణాళిక.. నిరంతర కార్యాచరణతో దూసుకెళ్లారు.
- అబ్బురం.. అభినందనీయం [ 17-02-2026] సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో రైతుల చొరవకు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్గేట్స్ అబ్బురపడ్డారు. సాగు విధానాల్లో ఇక్కడి రైతులు ముందంజలో ఉన్నారని ప్రశంసల వర్షం కురిపించారు.
- విదేశీ విడిదికి వచ్చేశాయ్! [ 17-02-2026] ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురం గ్రామం వందల ఏళ్ల నుంచి విదేశీ విహంగాల విడిదిగా గుర్తింపు పొందింది. ఏటా క్రమం తప్పకుండా వచ్చే వేవ్స్ జాతి కొంగలు(వేవ్స్ స్టార్క్స్) కోసం గ్రామస్థులు ఎదురుచూస్తూ ఉంటారు.
- సులభతరం.. చేలోకి యంత్రం [ 17-02-2026] సాగులో ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోంది. రైతులకు వ్యయ, ప్రయాసలను తగ్గిస్తూ సులభతర పద్ధతులను అందుబాటులోకి తెస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కొన్నేళ్ల నుంచి ఆన్లైన్ సేవలను వ్యవసాయానికి అనుసంధానం చేస్తోంది.
- కాళ్లరిగేలా తిరిగినా.. కాస్తయినా కనికరించరా? [ 17-02-2026] ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రతి అర్జీదారుడి సమస్యను సకాలంలో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ అధికారులకు సూచిస్తున్నా జిల్లాలో ఆశించిన స్థాయిలో ఫలితం ఉండట్లేదు.
- కొడుకులు ఉన్నా.. ఆదరించడం లేదు! [ 17-02-2026] ముదిమి వయసులో తనను కన్నబిడ్డలు ఆదరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ వృద్ధురాలు అధికారుల ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది. మచిలీపట్నంలోని జవ్వారుపేటకు చెందిన షేక్ అస్మతున్నీసా లేవలేని స్థితిలో ఇబ్బందులు పడుతోంది.
- నాలుగేళ్ల చిన్నారిపై సొంత బంధువు లైంగిక దాడి [ 17-02-2026] పెదపారుపూడి మండలానికి చెందిన నాలుగేళ్ల బాలికపై సొంత పెదనాన్న లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పామర్రు స్టేషన్లో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ వెల్లడించిన వివరాల ప్రకారం..
- హలధారీ.. ఇదిగో సేంద్రియ దారి! [ 17-02-2026] రసాయనాలతో నిండిన సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యం వైపు రైతన్నను నడిపించేదుకు సేంద్రియ రైతోత్సవానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో సేంద్రియ సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో రైతు సాధికార సంస్థ అడుగేస్తోంది.
- వేసవి డిమాండ్ తట్టుకునేందుకు విద్యుత్తు శాఖ సిద్ధం [ 17-02-2026] ఈ ఏడాది వేసవి విద్యుత్తు డిమాండ్ తట్టుకునేందుకు విద్యుత్తు శాఖ సన్నద్ధమైంది. ఏటా 20 నుంచి 30 శాతం విద్యుత్తు డిమాండ్ పెరుగుతుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉపకేంద్రాలు కొత్తవి ఏర్పాటు చేస్తారు.
- ఈ వినతి వెనుక లక్షల కుటుంబాల కన్నీళ్లు ఉన్నాయి [ 17-02-2026] వైకాపా ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య పేదలకు జారీ చేసిన ఇళ్ల పట్టాలు చెల్లుబాటు కాలేదని, వీటిపై విచారణ చేపట్టాలని భాజపా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ నేతృత్వంలో.