కొత్త దృష్టితో చూద్దాం!

Eenadu icon
By Editorial Team Published : 31 Dec 2025 02:37 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

సంవత్సరం మారే క్షణం గడియారంలో కాదు, మన లోపల జరుగుతుంది. చివరి అర్ధరాత్రి, ఆకాశంలో బాణాసంచా వెలుగులు విరుస్తుంటే, మనసులో మాత్రం ఒక మౌనదీపం వెలుగుతుంది. అది వెలుగూ కాదు, చీకటీ కాదు. అనుభూతి. జీవితం తనను తాను చూసుకునే క్షణం.

పాత సంవత్సరం మనకు కేవలం రోజులు ఇవ్వలేదు. అది మనల్ని మనమే ఎదుర్కొనేలా చేసింది. నవ్వించింది, కన్నీరు పెట్టించింది. కొన్ని సందర్భాల్లో దేవుణ్ని నిందించాం. కొన్ని సందర్భాల్లో ఆయన్నే శరణు వేడాం. అయినా జీవితం నడిచింది. శ్వాస ఆగలేదు. ఆశ చావలేదు. అదే పాత సంవత్సరం మనకిచ్చిన అతిపెద్ద వరం. వీడ్కోలు అనేది విస్మరణ కాదు. విడిచిపెట్టడం. మనసులో పేరుకుపోయిన బాధలు, అపార్థాలు, అపజయాల బరువును మెల్లగా దించేయడం. గతించిన ఏడాదికి మనం చెప్పాల్సింది ఒకటే. ధన్యవాదాలు!

కొత్త సంవత్సరం తలుపు తట్టదు. ఆకాశం నుంచి దిగిరాదు. అది మెల్లగా మన హృదయంలోకి అడుగుపెడుతుంది... ఖాళీ కాగితంలా. దానిపై ఏమి రాయాలో మనమే నిర్ణయించుకోవాలి. కొత్త సంవత్సరం అంటే కొత్త దుస్తులు ధరించడం కాదు. కొత్త మాటలు చెప్పడం కాదు. కొత్త దృష్టితో జీవితాన్ని చూడటం. అదే మనలో జరిగే నిజమైన మార్పు. ఉదయం లేచి శ్వాస తీసుకుంటున్నామంటే, అదొక ఆశీర్వాదం! సాయంత్రం మనసు ప్రశాంతంగా ఉంటే, అదొక సాధన. రోజూ సాటివారి పట్ల కాస్త మానవత్వం చూపగలిగితే... అదే ఆధ్యాత్మికత. కొత్త సంవత్సరంలో మనం పెద్ద సంకల్పాలు చెప్పుకోకపోయినా ఫరవాలేదు. రోజుకు ఒక మంచి ఆలోచన చాలు. మనసుకు నచ్చని దారిలో నడవకుండా ఆగే నిజాయతీ చాలు.

మనలో మనం ఒక మాట చెప్పుకొందాం... ‘ఇప్పటివరకు ఎలా ఉన్నానో కాదు, ఇకపై ఎలా ఉండాలో నేనే నిర్ణయిస్తాను’. అదే కొత్త సంవత్సరానికి హృదయపూర్వక ఆహ్వానం. మన జీవితపుస్తకమూ సంవత్సరం లాంటిదే. కొన్ని పుటలు వెలుతురుతో నిండితే, మరికొన్ని చీకటితో మసకబారినవిగా ఉంటాయి. ఈ రెండింటి మధ్యే అవగాహన పుడుతుంది. పాత సంవత్సరం మనల్ని కొన్ని నిజాల ముందు నిలబెట్టింది. మన బలహీనతలు, భయాలు, లోపలి ఖాళీలు... వాటిని అంగీకరించి, ముందుకు నడవాలి. ప్రతి గాయం ఒక జ్ఞాపకం, ప్రతి ఓటమి ఒక మౌనపాఠం. ఇవన్నీ లేకపోతే మన ప్రయాణం ఉపరితలంలోనే ఉండిపోయేది. అందుకే పాత సంవత్సరానికి కన్నీళ్లతో కాదు, అవగాహనతో వీడ్కోలు పలకాలి.

ఆనందాన్నిస్తాననో, బాధల్లేకుండా చూస్తాననో కొత్త సంవత్సరం మనకేమీ మాటివ్వదు. కానీ చైతన్యంగా జీవించే అవకాశం మాత్రం ఇస్తుంది. ప్రతి క్షణాన్నీ యాంత్రికంగా కాకుండా, అనుభూతితో జీవించే అవకాశం. మాటలు తక్కువైనా మన మౌనం లోతుగా ఉండే అవకాశం. మన ప్రార్థనలు పదాలతో కాకుండా, ప్రవర్తనతో చేసే అవకాశం. ఆ అవకాశం చేతిలో పడినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవడమే కొత్త సంవత్సరానికిచ్చే నిజమైన స్వాగతం!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జీవితమే సందేశం పాలూ నీళ్లను వేరు చేసేదిగా హంసకు పేరు. భౌతిక సుఖాలను, కష్టాలను సమ స్థితిలో అనుభవించేలా చేయగలిగే వైరాగ్య భావనలను ప్రబోధించిన వారు పరమహంస. శ్రీరామకృష్ణులు ఆచరణయోగ్యమైన ఆధ్యాత్మిక తత్వానికి నిలువెత్తు నిదర్శనం. కలకత్తాలోని దక్షిణేశ్వర్‌ కాళికా ఆలయంలో పూజారిగా ఉంటూ ఎంతోమందికి జ్ఞానభిక్ష అందించారు.
  • యాదగిరీశా నమోస్తుతే! బ్రహ్మ, విష్ణు, రుద్ర సమన్వయ శక్తులతో సృష్టి, స్థితి, లయాత్మకమైన చైతన్య స్వరూపమే నృసింహాకృతి! శ్రీహరి దశావతారాల్లో నరసింహ రూపం విశేషమైనది. నృసింహావతారం ఎంత ప్రచండమో, అంత ప్రహ్లాదం. ఎంత ప్రళయత్వమో అంత ప్రసన్నం.
  • దూరదృష్టి ‘రాబోవు నాపదలను/ లేబోనీయకయె ముందు తెలిసి మెలంగున్‌/ ప్రాబల్యము గలవాడే/ శోభిలు నిల నతడె’ అంటూ దూరదృష్టితో మెలిగితే ఆపదలను తప్పించుకోగలరని వర్ణించాడొక కవి. దూరదృష్టితో వ్యవహరించడమంటే, భవిష్యత్తును ఊహించగలిగే శక్తిగా భావించకూడదు.
  • శరణం శరణం... శంకరం మహాశివరాత్రి లోతైన ఆధ్యాత్మిక పరమార్థం ఉన్న పండుగ. ‘శివ’ అంటే అక్షరాలా కల్యాణకారి. మహాశివరాత్రి నిరాకార స్వరూపుడైన ఆ మహాశివుడి దివ్య కార్యాలను స్మరించుకుంటూ, పరమేశ్వరుడికి ప్రణమిల్లే సుదినం.
  • తపస్సు భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు.
  • మాటే మంత్రం తల వెనక తలంత బలగం ఉన్నా ఒక్కరూ కష్టకాలంలో ఆదుకోలేదు... అంటారు. ఈ కాలంలో ఎంతటి సంపదనైనా ఆర్జించవచ్చు కానీ కష్టంలో మనకోసం నిలబడేవారిని సంపాదించుకోవడం కష్టమే. అలా సంపాదించుకోవడం మన ప్రవర్తన, సంస్కారం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కత్తికన్నా పదునైంది నాలుక.
  • మహోన్నత సంస్కర్త ప్రథమ స్వాతంత్య్ర సమరానికి అజ్ఞాతంగా బీజావాపన చేసిన యోధ, భారతీయులు పరపీడన నుంచి బయటపడి ఉజ్వల భవిష్యత్తు గల జాతిగా నిలవడానికి సహస్ర విధాలుగా పరిశ్రమించిన మహామనీషి, సంఘంలోని దురాచారాలను ఖండించి జనంలో ఆత్మవిశ్వాసానికి పాదుకొల్పిన తపస్వి స్వామి దయానందులు.
  • అమూల్య వరం మనిషి ముఖం నుంచి ‘అగ్ని’ వాగ్రూపంలో వెలువడుతోందని ఐతరేయోపనిషత్తు పేర్కొంటోంది. మాట అగ్ని అంతటి పవిత్రమైనదీ ప్రమాదకరమైనదీ కూడా.
  • సంకల్ప బలం మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, విజయాలు, వైఫల్యాలు అనే కొండలను, లోయలను ఎక్కుతూ దిగుతూ ముందుకు పయనించాల్సిందే! నిజానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఇంధనం ఏమై ఉంటుందీ అంటే- సంకల్ప బలం అని చెప్పొచ్చు.
  • దాన ఫలం! సర్వ ప్రాణుల పట్ల దయ ఉన్నవారిని దైవిక లక్షణాలు కలిగినవారిగా చెబుతారు. పవిత్ర భావనలతో, నిస్వార్థంతో జీవించేవారిని తాను వెన్నంటి ఉంటానంటాడు పరమాత్ముడు గీతలో.
  • ఎవరు గొప్ప? నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
  • అజ్ఞానాన్ని రూపుమాపాలి! ఆదిశంకరుడు చెప్పిన అజ్ఞానం వేరు. ఈ అజ్ఞానం అది కాదు. అంతటా వ్యాపించి రాజ్యమేలుతున్న ఈ అజ్ఞానమే అధర్మానికి, అన్యాయానికి కూడా కారణం.
  • పంచ సూత్రాలు భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపించినా, అది ప్రతిక్షణం చలనంలో ఉంటుంది. మరి ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? పురాణాల ప్రకారం, భూమిని నాలుగు దిగ్గజాలు (ఐరావతాలు) మోస్తున్నాయి.
  • భక్తి - ధర్మం భక్తిభావం, ధర్మగుణం కలిగినవారే మనకు మార్గదర్శకులు, పురాణపురుషులు అయ్యారు. భక్తి వేరు, ధర్మగుణం వేరు. ధర్మగుణంలేని భక్తి శోభించదు, జయించదు.
  • గురుబ్రహ్మ... భౌతిక ప్రపంచంలో వినోద, విహారాలతో సంతృప్తి చెందుతున్నంతవరకు ఆధ్యాత్మిక లోకంలో విహరించాలనే ఆలోచన రాదు. ప్రాపంచిక సుఖాలే శాశ్వతమన్న భ్రమలో ఉండి దారితెన్నులు తెలియని వారికి భగవత్సన్నిధికి దిశానిర్దేశం చేసే వ్యక్తి గురువు. 
  • సృష్టికి మార్గదర్శకుడు సృష్టి... యాదృచ్ఛికంగా నడిచే ప్రక్రియ కాదు. దానికి ఒక క్రమం ఉంది, నియమం ఉంది, ధర్మం ఉంది. ఆ ధర్మానికి దిశానిర్దేశం చేసే శక్తే శ్రీకృష్ణుడు. ఆయన ద్వాపర యుగ అవతార పురుషుడు మాత్రమే కాదు. కాలం, దేశం, పరిస్థితులను దాటి నిలిచిన పరమసత్యానికి సాకార రూపం. సృష్టి ఎలా సాగాలి, జీవితం ఎలా నడవాలి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన తత్వమే కృష్ణుడు.
  • జ్ఞానాయుధం జ్ఞానం మనిషి వికాసానికి మూలాధారం. అది అంధకార మార్గంలో వెలుగులను ప్రకాశింపజేసే దివ్యజ్యోతి. వ్యక్తి ఉనికే ఙ్ఞానం... అంటాడు దక్షిణామూర్తి.
  • ఏది హింస? ‘అహింసా పరమోధర్మః’ అన్నారు పెద్దలు. అంటే హింస చేయకుండా ఉండటమే గొప్ప ధర్మమని అర్థం. హింస అంటే శారీరకంగా బాధించడమో, చంపడమో అని మాత్రమే అర్థంకాదు. ఎదుటివారిని మానసికంగా క్షోభకు గురిచేసినా అది హింస కిందకే వస్తుంది. శరీరానికి బాణాలు గుచ్చుకున్నా ఉపాయంతో తీసి వేయవచ్చు, ఆ గాయాలు మందులతో కొంత కాలానికి మానతాయి.
  • సహనం ఒక వరం ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవాలన్నా, భౌతికమైన కోరికలు తీర్చుకోవాలన్నా మనిషికి సహనం తప్పనిసరి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ, నిరంతరం అంకితభావంతో చేసే కృషే- సహనం. అవాంతరాలను ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఎదుర్కొని; పొగడ్తలకు, విమర్శలకు ప్రాధాన్యమివ్వకుండా చేసే యజ్ఞం అది.
  • కాలం విలువ కాలం ప్రతీ క్షణం ఓ ఇంద్రజాలం. కళ్లముందే మాయమైపోతుంటుంది మరి. కదిలే కాలం అనుకోని విజయాలను, వైభవాలను ఇచ్చినట్లే అప్పుడప్పుడు ఓటమినీ చవిచూపిస్తుంది.