School: స్థాయి పెంచారు సరే.. హెచ్ఎంలు ఏరి?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, హైదరాబాద్: పదో తరగతి వరకు బోధించే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో (హైస్కూళ్లలో) ప్రధానోపాధ్యాయు(హెచ్ఎం)ల పాత్ర అత్యంత కీలకం. పాఠశాలల అభివృద్ధి.. విద్యార్థుల ప్రగతి.. ఉత్తమ ఫలితాల సాధన వంటివాటికి హెచ్ఎంల అవసరం ఎంతో ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టులు.. గత దశాబ్దకాలంగా రాష్ట్రంలోని చాలా స్కూళ్లకు మంజూరు కాలేదు. ప్రధానంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా ఉన్నతీకరించిన చోట గెజిటెడ్ హెచ్ఎం(జీహెచ్ఎం) పోస్టులను మాత్రం ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఈ మేరకు 300 వరకు హైస్కూళ్లు జీహెచ్ఎం పోస్టుల కోసం ఎదురు చూస్తున్నాయి.
- రాష్ట్రంలో 4,704 హైస్కూళ్లు ఉండగా.. వాటిలో 300 వరకు అప్గ్రేడ్ అయినవి ఉన్నాయి. అవన్నీ రాష్ట్ర విభజన తర్వాత జరిగినవే. హైస్కూళ్లకు జీహెచ్ఎం పోస్టు ఉండాలి. అయితే చాలాచోట్ల వాటిని మంజూరు చేయకపోవడంతో.. అక్కడి సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జి హెచ్ఎంలుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు అటు పాఠాలు బోధించడంతోపాటు.. ఇటు పరిపాలనాపరమైన వ్యవహారాలు చూడటం సమస్యగా మారింది. పోస్టులు మంజూరైతే సీనియారిటీ ఆధారంగా పదోన్నతి కల్పించి.. భర్తీ చేయవచ్చు.
- ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో అప్గ్రేడ్ అయిన హైస్కూళ్లలో వలసల వల్ల పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. ఉదాహరణకు 2015లో (పదేళ్ల క్రితం) అప్గ్రేడ్ అయిన శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 640 మంది పిల్లలుండగా.. ఆ పాఠశాలకు హెచ్ఎం పోస్టు మంజూరు కాలేదు. అలాగే 2018లో ఏర్పడిన కోకాపేట హైస్కూల్లో 315 మంది విద్యార్థులుండగా.. అక్కడా అదే పరిస్థితి. మేడ్చల్ జిల్లాలో మొత్తం 12 హైస్కూళ్లకు హెచ్ఎం పోస్టులు అవసరం.
పోస్టులను బదిలీ చేసినా మంచిదే..
కనీసం 50-100 మంది విద్యార్థులు లేని హైస్కూళ్లు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్నాయి. కేవలం 10 మంది పిల్లలున్న ఉన్నత పాఠశాలలు 18 ఉండటం గమనార్హం. అలాంటివాటి నుంచి హెచ్ఎం పోస్టులను అప్గ్రేడ్ అయిన చోటుకు మార్చినా కొంతవరకు సమస్య తీరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైన చోటుకు పోస్టులను బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించేలా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలని వారు కోరుతున్నారు.
ఒక్క విద్యార్థీ లేని హైస్కూళ్లు కూడా 40 వరకు ఉన్నాయి. వాటికి హెచ్ఎం పోస్టులున్నాయి. ఈక్రమంలో అక్కడ వాటిని రద్దు చేయాలన్నది పాఠశాల విద్యాశాఖ ఆలోచన. మరో 261 జీహెచ్ఎం పోస్టులు అవసరమని, వాటిని మంజూరు చేయాలని మూడు నెలల క్రితం ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య డిమాండ్ చేశారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కార్ టీ-సెల్ థెరపీతో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు కార్ టీ-సెల్, జీన్ థెరపీలతో భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం(అమెరికా) ప్రొఫెసర్ డాక్టర్ బ్రూస్ లెవిన్ పేర్కొన్నారు.
- జీవన ప్రమాణాలను మార్చేసే అద్భుత శక్తి.. ఏఐ కృత్రిమ మేధ (ఏఐ) ఒక సాంకేతిక విప్లవం మాత్రమే కాదని.. అది ప్రకృతి రహస్యాలను ఛేదించి, మానవాళి జీవన ప్రమాణాలను మార్చేసే అద్భుత శక్తి అని గూగుల్ డీప్మైండ్ సైన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ డా.పుష్మీత్ కోహ్లీ స్పష్టం చేశారు.
- రోడ్డుప్రమాద బాధితులకు అండగా ‘పీఎం రాహత్’ రోడ్డుప్రమాద బాధితులను ఆదుకునేలా.. ‘పీఎం రాహత్’ పథకంతో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొనియాడారు.
- ‘టిమ్స్’లో సకల సౌకర్యాలు ఉండాలి: రాజనర్సింహ హైదరాబాద్ సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిని వచ్చే నెల ఉగాదికి ప్రారంభించనున్న నేపథ్యంలో.. సకల సౌకర్యాలతో సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
- ఐదు నుంచి పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల క్యూర్(కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
- సీఎంకు అభినందనల వెల్లువ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వచ్చి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.
- ముంబయి వెళ్లిన సీఎం మహారాష్ట్ర ప్రభుత్వం, బృహన్ ముంబయి కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘క్లైమెట్ వీక్’ పేరుతో బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్రెడ్డి మంగళవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబయి బయలుదేరి వెళ్లారు.
- భూ అక్రమాలపై ‘కోడ్’ ఆడిటింగ్! సాగు భూముల పోర్టల్లోని సాంకేతిక లొసుగులను ఆధారంగా చేసుకుని జరిగిన భూ అక్రమాలను పూర్తిస్థాయిలో వెలికితీసేందుకు ‘కోడ్’ ఆడిటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- గుట్టలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు మహా దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో బుధవారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
- 23న మంత్రివర్గ సమావేశం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న జరగనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు, రానున్న మూడు నెలల్లో తాగునీరు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.
- స్టాండింగ్లోనే.. సిట్ అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- ఏడాదిలో ‘కాళేశ్వరం’ బ్యారేజీల పునరావాస డిజైన్లు కాళేశ్వరం బ్యారేజీలు ‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల’ పునరుద్ధరణకు అవసరమైన పునరావాస డిజైన్లు రూపొందించే టెండర్ అగ్రిమెంట్ ఖరారయింది.
- తెలంగాణ అంటేనే కేసీఆర్ ఆనవాలు ‘‘రాష్ట్రంలో తెలంగాణవాదుల జాతి, తెలంగాణ ద్రోహుల జాతి మాత్రమే ఉన్నాయి. మాది ఉద్యమకారుల జాతి. వారిది ద్రోహుల జాతి. నా తండ్రి తెలంగాణ జాతికి హీరో అన్న విషయం వాస్తవం.
- మెదక్ కలెక్టర్కు 6 నెలల జైలు, జరిమానా ఆస్తి హక్కులకు సంబంధించి ఇరుపక్షాలకు నోటీసులు పంపి వివాదాన్ని పరిష్కరించాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
- ప్రజలు కొన్న భూములను ప్రభుత్వానివని ఎలా నిర్ధారిస్తారు? ప్రజలు కష్టపడి స్థలం కొనుగోలు చేస్తే.. అవి ప్రభుత్వ భూములని ఎలా లాక్కుంటారని హైడ్రాపై మంగళవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
- ‘ఈహెచ్ఎస్ ట్రస్టులో పెన్షనర్ల తరఫున సభ్యులుండాలి’ రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్యపథకం కోసం ఏర్పాటు చేయనున్న ట్రస్టులో పెన్షనర్ల తరఫున ఆరుగురు సభ్యులను నియమించాలని రాష్ట్ర పెన్షనర్ల ఐకాస డిమాండ్ చేసింది.
- గ్రామ పంచాయతీలకు రూ.256 కోట్లు విడుదల తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రూ.256 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
- కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రేవంత్రెడ్డి, చంద్రబాబు భారాస అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మంగళవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు రాజకీయ పార్టీల ప్రముఖులు, సినీ తారలు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
- సంక్షిప్త వార్తలు (13) నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ముగిసినందున రాష్ట్రంలో పురపాలక ఎన్నికల కోడ్ గడువు మంగళవారంతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
- బీసీలకు 61% ఛైర్మన్ పదవులు.. ఉద్యమ ఫలితమే: జాజుల పల్లెల్లోనే కాదూ.. పట్టణాల్లోనూ బీసీల సత్తా చాటామని బీసీ ఐకాస ఛైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు.