శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో భక్తులు పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన సంఘటన సంచలనం రేకెత్తిస్తోంది. తాము కొనుగోలు చేసిన పులిహోర ప్రసాదం ప్యాకెట్‌లో నత్త ఉందని, తిరిగి కౌంటరు దగ్గరకి వెళ్లి ప్రశ్నిస్తే అక్కడ పనిచేసే సిబ్బంది నుంచి సరైన సమాధానం రాలేదని, ఇంకో ప్యాకెట్టు ఇచ్చేసి పట్టించుకోలేదని ఇద్దరు భక్తులు సోషల్‌ మీడియా వేదిక ద్వారా నిరుత్సాహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోని కూడా పోస్టు చేశారు.