Bangladesh: యూనస్‌ మెడకు చుట్టుకున్న హాదీ హత్య.. పారిపోవడం తప్పదంటూ హెచ్చరికలు

Eenadu icon
By International News Team Published : 24 Dec 2025 11:32 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఢాకా: రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్‌లో నానాటికీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. యువనేత ఉస్మాన్‌ హాదీ హత్యలో ప్రభుత్వం ప్రమేయం ఉందన్న ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ను (Muhammad Yunus) చిక్కుల్లో పడేస్తున్నాయి. అదే సమయంలో అవామీ లీగ్‌ పార్టీపై నిషేధం విధించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేయడం కూడా యూనస్‌ సర్కారును ఇబ్బంది పెడుతోంది. (Bangladesh Protests)

పారిపోవాల్సి వస్తుంది జాగ్రత్త..!

యువ నాయకుడు, ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ (Sharif Osman Hadi Killing) హత్యతో ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై హాదీ సోదరుడు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. హాదీ హత్యలో యూనస్‌ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు ఆరోపించారు. ‘‘ఉస్మాన్‌ హాదీని మీరే (యూనస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) చంపేశారు. ఈ ఘటనను ఉపయోగించుకొని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు రద్దు చేయాలని చూస్తున్నారు. నా సోదరుడి హత్యపై వేగంగా దర్యాప్తు జరిపి హంతకులను పట్టుకోవాలి. హాదీకి న్యాయం జరగకపోతే.. మీరు కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్‌ను వీడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త..!’’ అని ఉస్మాన్‌ హాదీ సోదరుడు ఒమర్ హెచ్చరించాడు. విద్యార్థి ఉద్యమంతో గతేడాది షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో హాదీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యమంతో హసీనా దేశం వీడాల్సి వచ్చింది. ఆ పరిణామాలను ఉద్దేశిస్తూనే హాదీ సోదరుడు పరోక్షంగా యూనస్‌ను హెచ్చరించారు.

  • భారత్‌తో గొడవలు కోరుకోవడం లేదు: బంగ్లాదేశ్‌

అమెరికా ఆందోళన..

ఇదిలాఉండగా.. మాజీ ప్రధాని షేక్‌ హాసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనిపై అమెరికా చట్టసభ్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శక, స్వేచ్ఛాయుత విధానంలో ప్రభుత్వాన్ని ఎన్నుకొనే హక్కు బంగ్లాదేశ్‌ పౌరులకు ఉందని వారు పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలు నిర్వహించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. అవామీ లీగ్‌పై నిషేధాన్ని పునఃసమీక్షించాలని వారు సూచించారు.

ఆమెను తొలగిస్తారా, లేదా?

మరోవైపు, బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పలు మీడియా సంస్థలపై ఆందోళనకారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మీడియా సంస్థకు బెదిరింపులు వచ్చాయి. గ్లోబల్‌ టీవీ హెడ్‌ నాజ్నిన్‌ మున్నీని తొలగించాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వీసా హక్కు కాదు : అమెరికా విదేశాంగ శాఖ కఠిన వీసా విధానాలపై అమెరికా విదేశాంగ మరోసారి స్పందించింది. వీసా అనేది హక్కు కాదని, విదేశీ పర్యటకులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.
  • ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు. 
  • అమెరికా బాటలో చైనా.. మెరైన్‌ కోర్‌ ఏర్పాటు ప్రపంచవ్యాప్తంగా సైనిక ఆపరేషన్లు చేసేందుకు అమెరికా మాదిరిగా చైనా సైతం మెరైన్‌ కోర్‌ను ఏర్పాటుచేసింది. 
  • యూనస్‌ నోట మళ్లీ ‘సెవెన్‌ సిస్టర్స్‌’.. వెళ్లిపోతూ భారత్‌పై కవ్వింపులు Bangladesh: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్‌ యూనస్‌ సోమవారం తన పదవి నుంచి వైదొలిగారు.
  • పిల్లలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌ Indian Man Arrested: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో అరెస్ట్‌ అయ్యాడు. నిందితుడిని ఓడెల యశస్వీ కొత్తపల్లిగా గుర్తించారు.
  • ముంబయి తీరంలో సీజ్‌ అయిన నౌకలు ఇరాన్‌వే! చమురు అక్రమ రవాణాకు పాల్పడుతున్న కారణంగా భారత్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది సీజ్‌ చేసిన మూడు నౌకలకు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
  • కిమ్‌ కుమార్తెకు వారసత్వ పగ్గాలు! నిరంకుశ పాలనకు చిరునామాగా నిలిచే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రాజ్యంలో కుటుంబ పోరుకు తెరలేచిందా? అధికార పగ్గాల కోసం కిమ్‌ సోదరి, కుమార్తె పోటీ పడనున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
  • గ్రహాంతర జీవులు సంప్రదింపులు జరిపినట్లు ఆధారాల్లేవు: ఒబామా గ్రహాంతర జీవులున్నాయంటూ ఓ పాడ్‌కాస్ట్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
  • బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం చైనాలో వీసా లేకుండా పర్యటించే అవకాశం బ్రిటన్, కెనడా దేశాల ప్రజలకు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది.
  • పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్‌ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.