Anna Canteen: సంక్రాంతికి పల్లె సీమల్లో అన్న క్యాంటీన్లు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 24 Dec 2025 07:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా అన్న క్యాంటీన్లు రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలైన నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వివిధ దశల్లో ఉన్న వీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు. జనవరి 13-15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పట్టణ ప్రాంతాల్లో 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. రోజూ వీటిలో మూడు పూటలా కలిపి 2 లక్షల మందికిపైగా ప్రజలు భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. పూటకు రూ.5కే ఆహారం సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం 70 మంజూరు చేసింది

7.20 కోట్ల మందికి

నగరాలు, పట్టణాల్లో ప్రారంభించిన 205 క్యాంటీన్లలో ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికిపైగా పేదలకు ఆహారం అందించారు. వీరిలో అత్యధికంగా 3.16 కోట్ల మంది మధ్యాహ్న భోజనం చేశారు. ఉదయం అల్పాహారం 2.62 కోట్లు, రాత్రిఅల్పాహారం 1.42 కోట్ల మందికి సరఫరా చేశారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో పేదలు వస్తున్నారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 07:38 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • 520 కేజీల కొమ్ముకోనం కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు శనివారం భారీ కొమ్ముకోనం చేప చిక్కింది. 12 అడుగుల పొడవుతో ఏకంగా 520 కిలోలు ఉంది.
  • విశాఖ తీరంలో మరో సంబరం ప్రపంచ యుద్ధ నౌకల ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం భారత నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి వివిధ దేశాల నౌకల రాక సైతం మొదలైంది.
  • కోటప్పకొండంత భక్తి! శివుడిపై భక్తితో ఓ కళాకారుడు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి మినీయేచర్‌ను తయారు చేశారు.
  • తిరుమల ‘కమాండ్‌’ దేశానికే తలమానికం కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు అత్యాధునిక సాంకేతికతలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. అలిపిరి వద్ద తనిఖీలు, భక్తుల రద్దీని లెక్కగట్టడం, లడ్డూ ప్రసాద పంపిణీలో పారదర్శకత పెంచడం..
  • సవాళ్లున్నా సంక్షేమం.. అభివృద్ధే సంకల్పం ఒకటీ ఒకటీ కలిస్తే ప్రతిసారీ రెండే కానక్కర్లేదు.. ఒక్కోసారి అనూహ్యంగా ఎన్నో రెట్ల బలం సమకూరొచ్చు... 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అఖండ విజయం సాధించడంతోపాటు అటు కేంద్రంలోనూ కీలక భాగస్వామిగా మారడం అలాంటిదే.
  • సీమలో సిరుల పంట ఉమ్మడి ప్రకాశం జిల్లా సహా రాయలసీమ ముఖచిత్రమే మార్చేలా.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేలా రూ.30 వేల కోట్లతో ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు.
  • మౌలికం.. పెట్టుబడుల ఆకర్షణకు మార్గం కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ‘పాలసీ 4.0’ విధానాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎగుమతులు పెంచడం.. రాష్ట్ర సుస్థిర పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
  • అప్పులు తగ్గించుకుని.. ప్రగతి దిశగా అప్పులు తగ్గించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పులపై వడ్డీరేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
  • విద్యకు రూ.34,875 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం బడ్జెట్‌లో విద్యకు రూ.34,875 కోట్లు (11శాతం) కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు కేటాయించింది.
  • ఊపందుకోనున్న అమరావతి రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.6,000.10 కోట్లు ప్రతిపాదించింది. భూసమీకరణ పథకానికి రూ.50 కోట్లు, రాజధాని ప్రాంతంలో సామాజిక భద్రతా నిధి, భూమిలేని పేదలకు పింఛన్ల కోసం రూ.115.14 కోట్లు కేటాయించింది.
  • కొత్త పథకాలు, కార్యక్రమాలు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పలు కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రకటించింది. ఇంద్రధనుస్సు కార్యక్రమం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనుంది.
  • రైతుకు రాజమార్గం రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూలస్తంభమైన వ్యవసాయరంగాన్ని పటిష్ఠపరిచేలా బడ్జెట్‌ కేటాయింపులు చేశామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
  • రోడ్లు, వంతెనలు రయ్‌..రయ్‌.. వైకాపా ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకుండా ప్రజలకు నరకం చూపించగా.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండేళ్లుగా ఆ రోడ్లను బాగుచేసేందుకే పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోంది.
  • ఇది స్వర్ణాంధ్ర బడ్జెట్‌ ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ, దీర్ఘకాలిక వృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది స్వర్ణాంధ్ర బడ్జెట్‌.
  • ఆర్థిక వృద్ధికి త్రిముఖ వ్యూహం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా తలపెట్టిన ఎకనమిక్‌ రీజియన్‌ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
  • రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చింది మేమే రాయలసీమలో ఒకప్పుడు పశువులకు తాగడానికీ నీరు దొరికేది కాదని, రైళ్లలో పశుగ్రాసం, నీరు తరలించిన రోజులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో తాము హంద్రీనీవా ప్రాజెక్టు పనులను సీరియస్‌గా చేపట్టామని, అందుకే ఇప్పుడు దాని ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
  • ఆది దేవుడి సన్నిధిలో.. ఆధ్యాత్మిక వైభోగం! మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రం ముస్తాబైంది. ఆది దేవుడి ఉత్సవ శోభను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. శివదీక్షా భక్తుల శివనామ స్మరణలతో శ్రీగిరులు మార్మోగిపోతున్నాయి.
  • ‘రాయంచ’పై.. సోమస్కందుడి వైభవం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమస్కందమూర్తి శనివారం హంస వాహనంపై దర్శనమిచ్చారు.
  • శివోహం.. అనంతం! మహాశివరాత్రి నేపథ్యంలో బ్రహ్మకుమారీలు జ్యోతిర్లింగాలన్నీ ఒకే చోట చూసేందుకు భక్తులకు వీలు కల్పించారు. చిత్తూరులోని సాంబయ్యకండ్రిగ సమీపంలోని ఓం శాంతి యోగా భవనంలో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
  • సహస్ర వృత్తులకు సంక్షేమ పెన్నిధి గత ఏడాదితో పోలిస్తే ఈ సారి బడ్జెట్‌లో ఎస్టీలకు నిధుల కేటాయింపును ప్రభుత్వం పెంచింది. 2025-26లో రూ.8,159 కోట్లు ప్రతిపాదించగా తాజాగా రూ.9,190 కోట్లు చేసింది.