stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడం, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ దీనికి కారణం. రిలయన్స్, ఐసీఐసీఐ వంటి ప్రధాన స్టాక్స్లో విక్రయాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఐటీ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. క్రిస్మస్ సందర్భంగా గురువారం మార్కెట్లకు సెలవు కావడంతో ట్రేడింగ్ యాక్టివిటీ కూడా అంతంతమాత్రంగానే ఉంది.
సెన్సెక్స్ ఉదయం 85,533.11 పాయింట్ల (క్రితం ముగింపు 85,524.84) వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు లాభాల్లో కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 85,342.19 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 116.14 పాయింట్ల నష్టంతో 85,408.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 35.05 పాయింట్ల నష్టంతో 26,142.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 89.78గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇండిగో, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 62.51 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4,494 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :