No jobs for North Korea: ఉత్తరకొరియా పౌరులకు అమెజాన్‌ ‘నో ఎంట్రీ’.. ఎందుకంటే..?

Eenadu icon
By International News Team Updated : 24 Dec 2025 01:07 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: తన సంస్థలో ఉద్యోగాల కోసం ఉత్తరకొరియా పౌరుల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని అమెజాన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్టీఫెన్ స్మిత్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు (No Jobs For North Korea). ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా అమెరికాలో రిమోట్ (ఆఫీస్‌లకు దూరంగా) ఐటీ ఉద్యోగాలను పొందేందుకు నార్త్‌కొరియన్లు ప్రయత్నిస్తున్నారు. గతేడాది కాలంలో ఆ దేశం నుంచి తమ సంస్థకు వచ్చిన దరఖాస్తుల్లో 30 శాతం పెరుగుదల కనిపించిందని స్టీఫెన్ తెలిపారు.

ఇలాంటివారంతా ల్యాప్‌టాప్‌ ఫార్మ్స్‌ (కంప్యూటర్లు అమెరికాలో ఉన్నట్లు చూపించినప్పటికీ.. వాటిని ఇతర దేశం నుంచి ఆపరేట్‌ చేయడం)పై ఆధారపడతారని స్మిత్‌ తెలిపారు. దీంట్లో ఉద్యోగుల ఫోన్‌ నంబర్లు, విద్యార్హతలు వంటి వాస్తవ వివరాలు తెలుసుకోవడం కష్టమవుతుందన్నారు. ఈ సమస్య అమెజాన్‌ ( Amazon) ఒక్కటే ఎదుర్కోవడం లేదని తెలిపారు. ఇలాంటి మోసాలు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాదని.. ఆర్థిక దోపిడీ, డేటా ఉల్లంఘనలకూ దారితీయొచ్చని ఆందోళన వ్యక్తంచేశారు.

  • 3 వేల డాలర్లు తీసుకొని అమెరికా వీడండి.. అక్రమ వలసదారులకు ఆఫర్‌

ప్రముఖ కంపెనీల్లో ఉత్తరకొరియా( North Korea) వాసులు.. అమెరికా వారిలా నటిస్తూ ఉద్యోగాలు చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీరు దొంగిలించిన లేదా తప్పుడు ఐడీలతో ఈ ఉద్యోగాలు సంపాదించినట్లు గుర్తించారు. ఐరాస అంచనాల ప్రకారం ఉత్తర కొరియా ఐటీ వర్కర్స్‌ స్కామ్‌ రూపంలో 2018 నుంచి ఏటా ఆ దేశానికి 250 నుంచి 600 మిలియన్‌ డాలర్ల వరకు చేరుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ఏఐ వినియోగంలోకి వచ్చాక ఉత్తరకొరియా పౌరుల మోసాలు పెరిగిపోయినట్లు పేర్కొంది. ఇటీవల ఆరిజోనాలో ల్యాప్‌టాప్‌ ఫార్మ్స్‌ నిర్వహిస్తూ ఉత్తరకొరియా ఐటీ ఉద్యోగులకు సహకరించిన ఓ మహిళకు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ వ్యవహారంలో ఆపరేటర్, ఉత్తర కొరియా ప్రభుత్వానికి 17 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరిందని అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కిమ్ జోంగ్ ఉన్ ( Kim Jong Un) ప్రభుత్వం నిధుల కోసం తన పౌరులను ఇతర దేశాల్లో ఉద్యోగాల్లోకి చొప్పిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 24 Dec 2025 00:05 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అమెరికా పౌరహక్కుల నేత జెస్సీ జాక్సన్‌ మృతి అమెరికాలో శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అనుచరుడు, రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన మానవ హక్కుల ఉద్యమ ప్రముఖుడు రెవరెండ్‌ జెస్సీ ఎల్‌.జాక్సన్‌ మంగళవారం మరణించారు.
  • భారత్‌ సాయం మాకు అత్యంత కీలకం అంతర్జాతీయ సమాజ అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్‌ అందిస్తున్న సాయం తమకెంతో కీలకమని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ స్పష్టం చేశారు.
  • బంగ్లా ప్రధానిగా రహమాన్‌ ప్రమాణం బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నేత తారిఖ్‌ రహమాన్‌ (60) మంగళవారం పదవీ ప్రమాణం చేశారు.
  • సౌదీలో దర్శనమిచ్చిన రంజాన్‌ నెలవంక సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఉపవాసాలు, భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైనట్లయింది.
  • విన్యాసాలకు హర్మూజ్‌ జలసంధి తాత్కాలిక మూసివేత అస్త్ర ప్రయోగాలతో కూడిన సైనిక విన్యాసాలు జరగకుండా హర్మూజ్‌ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.
  • అమెరికా ఐస్‌ హాకీ ప్రాంగణంలో కాల్పులు ఐస్‌ హాకీ క్రీడా ప్రాంగణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన ఇక్కడి పాటుకెట్‌లోని డెన్నిస్‌ ఎం.లించ్‌ ఎరీనాలో జరిగింది.
  • శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది. 
  • ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.