TG News: 29 నుంచి అసెంబ్లీ!

Eenadu icon
By Telangana News Desk Published : 23 Dec 2025 04:06 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కృష్ణా, గోదావరి జలాలపై చర్చించేందుకు ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మంత్రులందరితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మొదట పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించారంటూ మంత్రులను సీఎం అభినందించారు. పంచాయతీ ఫలితాల గురించి చర్చించిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి బేసిన్లలో పరిస్థితి, తాజాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాజీ సీఎం కేసీఆర్‌ మాట్లాడిన అంశాలపై వివరంగా చర్చించినట్లు తెలిసింది. వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని.. ఓటర్ల జాబితాలో సవరణల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు సమాచారం.

70-80 డివిజన్లతో..

గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తరణ, డివిజన్ల పెంపు, వాటిపై వస్తున్న ఫిర్యాదులపైనా మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారని పార్టీ వర్గాలు చెప్పాయి. విస్తరణ పూర్తయిన తరవాత మొత్తం నగరాన్ని మూడు నగరపాలక సంస్థలుగా విభజిస్తే ఎలా ఉంటుందని ఆరాతీసినట్లు తెలిసింది. ప్రస్తుతమున్న జీహెచ్‌ఎంసీ పరిధిని అలాగే ఉంచి, కొత్తగా ఏర్పడిన డివిజన్లతో మరో రెండు నగరపాలక సంస్థలు ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సైబరాబాద్‌ పేరుతో వీటిలో ఒకటి ఉండవచ్చని తెలుస్తోంది. కొత్తగా 70-80 డివిజన్లతో ఒక్కో నగరపాలక సంస్థను  ఏర్పాటుచేసి.. ఆ తరవాత వందకు పెంచాలనే ప్రతిపాదనలపైనా మాట్లాడినట్లు సమాచారం. నగర విస్తరణపై ఆర్డినెన్స్‌ జారీచేయాలని సమావేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగర విస్తరణతో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, అభివృద్ధి పనులు పుంజుకుంటాయని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఏయే అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి ఎన్ని డివిజన్లు వస్తాయి, నగర విస్తరణ తర్వాత రాజకీయంగా వచ్చే మార్పులపైనా చర్చించారని సమాచారం.

సర్పంచులతో భారీ సభ

ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గెలిచిన స్థానాలు, సర్పంచుల విద్యార్హతలు.. ఇలా అనేక అంశాలు చర్చించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. గెలిచిన సర్పంచులందరినీ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన విభజించి మూడు బృందాలుగా శిక్షణ ఇవ్వాలని సీఎం సూచించినట్లు సమాచారం. సర్పంచులతో హైదరాబాద్‌లో సంక్రాంతి నాటికి భారీ సభ ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పంచాయతీల వారీగా పోటీచేసిన, గెలిచిన, ఓడిన పార్టీల మద్దతుదారులకు వచ్చిన ఓట్ల వివరాలను మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా తయారు చేసి విశ్లేషించాలనుకొన్నట్లు తెలిసింది. 

గట్టిగా వాదనలు వినిపించాలి

అసెంబ్లీ సమావేశాల్లో ‘నీళ్లు- నిజాలు’ అనే అంశంపై నదీ జలాల్లో వాటాసాధనలో భారాస చేసిన పనుల గురించి గట్టిగా వాదనలు వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి వాటాలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీ అక్రమ నీటి వినియోగం, అనుమతి లేకుండా ఆ రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను చర్చకు పెట్టనున్నారని సమాచారం. నీటిపారుదల, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను అసెంబ్లీలో ఎండగట్టాలని మంత్రుల భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారని తెలుస్తోంది. 

2023లో భారాస అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు-రంగారెడ్డి ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’(డీపీఆర్‌) కేంద్రం నుంచి వెనక్కు వచ్చిందని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఎన్జీటీ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగినపుడు తాగునీటి ప్రాజెక్టుగానే చేపడతామని అప్పటి ప్రభుత్వం చెప్పగా.. 7.25 టీఎంసీలకే పనులు చేయాలని కోర్టు ఆదేశించిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90 టీఎంసీలతో పూర్తి స్థాయిలో పాలమూరును చేపట్టేందుకు చర్యలు తీసుకొంటుంటే ప్రజలను తప్పుదారి పట్టించేలా కేసీఆర్‌ మాట్లాడారని, దీనిపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా, మంత్రులందరూ అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో 29వ తేదీ నుంచి సమావేశాలు పెట్టి కృష్ణా, గోదావరి బేసిన్ల గురించి సమగ్రంగా చర్చించాలని నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. 29న అసెంబ్లీ ప్రారంభమైన తరవాత మూడు రోజుల విరామం ప్రకటించి తిరిగి జనవరి 2 నుంచి సమావేశాలను కొనసాగించాలని చర్చించినట్లు తెలుస్తోంది.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.