Gold and Silver Prices Today: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (23/12/2025)

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Gold and silver prices | పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు.. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో వాటి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..

బంగారం గురించి..
- బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారట్లుగా (24 carat Gold ) చెబుతారు. అంటే ఇది 99.9 స్వచ్ఛమైన బంగారమన్నమాట. ఇది కాయిన్స్ (Gold Coins), బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది.
- నగల తయారీకి 22 క్యారట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు/916 స్వచ్ఛతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తే సరిపోతుంది.
- బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది.
- కొన్ని దుకాణాలు, ప్రాంతాల్లో పన్నులు, సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ప్రకటిస్తుంటాయి. దీనివల్ల ధర తక్కువగా కనపడుతుంది. ఆభరణం నచ్చి, బిల్లు వేయమన్నప్పుడు, పన్నులు/సుంకాలు కలిపితే.. ఏ ప్రాంతంలో అయినా బంగారానికి ఒకటే ధర అవుతుంది. ఆభరణం తయారీ, తరుగు ఛార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికీ తేడా ఉంటుంది.
- కొంతమంది వ్యాపారులు బిల్లు లేకుండా విక్రయిస్తాం.. అప్పుడు 3 శాతం జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదని చెబుతుంటారు. అయితే బిల్లు లేకుండా కొంటే కొన్ని చిక్కులు ఎదుర్కోవాలి. బంగారం నాణ్యత సరిగా లేకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఆభరణం మరమ్మతులకూ బాధ్యత వహించరు. కాబట్టి బంగారం కొనేటప్పుడు బిల్లు ముఖ్యం.
గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కోడింగ్ కాదు.. ఏఐని ఎలా ఉపయోగించాలనేదే కీలకం! - నందన్ నీలేకని కృత్రిమ మేధ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గ్రామర్ను తిరిగి రాస్తోందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పేర్కొన్నారు.
- ఏఐ కళ్లద్దాలతో ప్రధాని మోదీ.. మేడ్ఇన్ ఇండియా ‘సర్వం కేజ్’ గురించి తెలుసా..? Sarvam AI: భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026, సమిట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి
- మారుతీ సుజుకీ ఇ-విటారా @ రూ.11 లక్షలు.. బ్యాటరీ EMI ₹3.99km Maruti Suzuki e VITARA: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన విద్యుత్ ఎస్యూవీ ఇ-విటారాను (Maruti Suzuki e VITARA) దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.
- గిగ్ వర్కర్ల కోసం కర్ణాటక కీలక నిర్ణయం.. వారినుంచి 1 శాతం ఫీజు గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- వీలునామా లేని ఎఫ్డీలు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చంటే! పెట్టుబడి మార్గాలు ఎన్ని ఉన్నప్పటికీ చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లకే ప్రాధాన్యత ఇస్తారు.
- రెండో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి.
- సామాజిక మాధ్యమాల వినియోగంపై వయసుల వారీ పరిమితులు! Social Media: సామాజిక మాధ్యమాల వినియోగంపై వయసుల వారీ పరిమితులు విధించాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆయా టెక్ కంపెనీలతో (సామాజిక మాధ్యమాలు) చర్చలు జరుపుతోంది.
- డేటా సెంటర్లపై 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి: అదానీ గ్రూప్ Adani Group: గౌతమ్ అదానీకి చెందిన వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ (Adani Group) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీ పెట్టుబడి ప్రకటించింది.
- ఆరోగ్యబీమా క్లెయిమ్ తిరస్కరణ.. వైరల్ పోస్ట్పై స్పందించిన స్టార్ హెల్త్ Star Health: వైద్యపరంగా ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆదుకుంటుందన్న ఉద్దేశంతో చాలామంది ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటారు. అదే పాలసీ అవసర సమయంలో అక్కరకు రాకపోతే..?
- ఆంథ్రోపిక్తో ఇన్ఫీ జట్టు.. ఐటీ షేర్ల జంప్ IT Stocks: కృత్రిమమేధ ‘ఆంథ్రోపిక్’ భయాలతో గతవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైన భారత ఐటీ కంపెనీల షేర్లు.. మంగళవారం కోలుకున్నాయి.
- ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు బిల్గేట్స్ దూరం.. ఎప్స్టీన్ వ్యవహారమే కారణమా..? Bill Gates: బిల్గేట్స్ ఏఐ సమ్మిట్కు హాజరుకావడం లేదని తెలుస్తోంది.
- తొలి ట్రిలియనీర్గా మస్క్? రికార్డు దిశగా కుబేరుడు Elon Musk: ఈ ఏడాదిలో మస్క్ ట్రిలియనీర్గా మారే అవకాశం ఉంది.
- చలామణిలో రూ.40 లక్షల కోట్ల నగదు దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం కొనసాగుతున్నా, ప్రజల చేతుల్లో నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది.
- ఉద్యోగం ఉండాలంటే ఏఐ టూల్స్ నేర్చుకోండి కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భరోసానిచ్చే సలహాను టెక్ పరిశ్రమ దిగ్గజాలు సూచిస్తున్నారు. ‘ప్రశాంతంగా ఉండండి, నైపుణ్యాలు పెంచుకోండి’ అని తెలిపారు.
- మన వ్యవసాయ రంగానికి రూ.36 లక్షల కోట్ల అవకాశాలు అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదిరిన వాణిజ్య ఒప్పందాల కారణంగా, భారత వ్యవసాయ రంగానికి 400 బి. డాలర్ల (దాదాపు రూ.36 లక్షల కోట్ల) అవకాశాలు లభించగలవని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
- రాణించిన బ్యాంకింగ్, విద్యుత్ షేర్లు విద్యుత్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్ల రాణింపుతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అమెరికా- ఇరాన్ చర్చల ప్రభావంతో, అంతర్జాతీయంగా చమురు ధరలు సానుకూలంగా కదలాడటం మార్కెట్ సెంటిమెంట్ను బలోపేతం చేసింది.
- 2035కు రూ.215 లక్షల కోట్ల రిటెయిల్ విపణి మన దేశ భారత రిటెయిల్ రంగ విపణి పరిమాణం 2035 నాటికి రూ.210-215 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. 2025లోని రూ.90- 95 లక్షల కోట్ల స్థాయితో పోలిస్తే, ఈ విలువ రెట్టింపు కంటే ఎక్కువ.
- టోకు ధరలూ పెరిగాయ్ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలా పెరిగి, జనవరిలో 1.18 శాతంగా నమోదైంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులు, తయారీ వస్తువులు ప్రియం కావడం ఇందుకు కారణం.
- స్నాప్డీల్పై రూ.5 లక్షల జరిమానా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) ధ్రువీకరణకు అనుగుణంగా లేని బొమ్మలు విక్రయించినందుకు, 2020 టాయ్స్ (నాణ్యతా నియంత్రణ) ఆర్డర్ను ఉల్లంఘించినందుకు..
- వేణుగోపాల్ ధూత్ సహా 12 సంస్థలకు దిల్లీ న్యాయస్థానం నోటీసులు మొజాంబిక్లోని కంపెనీ చమురు-గ్యాస్ ఆస్తులకు నిధులు సమకూర్చడంలో భాగంగా రూ.61,700 కోట్ల బ్యాంకు రుణ మోసానికి పాల్పడిన వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, ఆ గ్రూప్ అనుబంధ డజను సంస్థలకు దిల్లీ న్యాయస్థానం..