ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌

Eenadu icon
By Telangana News Desk Published : 19 Dec 2025 06:36 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం. ఈ కేసు నమోదైన దాదాపు 21 నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది. దీంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్‌కు హైదరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ నేతృత్వం వహించనున్నారు. ఆయనతోపాటు మరో 9 మంది పోలీస్‌ అధికారులతో సిట్‌ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్‌ ఏసీపీ వెంకటగిరినే సిట్‌ దర్యాప్తు అధికారిగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని గుర్తించగా.. తాజా దర్యాప్తులో ఇంకా ఎవరు బయటికొస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకు సమర్థులైన అధికారులు దర్యాప్తు చేసినా.. దర్యాప్తును సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతుల్లో జాప్యం జరిగిందనే ప్రచారం నేపథ్యంలో సిట్‌ ఏర్పాటైంది. ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారనే కోణంలో ఈసారి దర్యాప్తును విస్తృతం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వారం క్రితమే సిట్‌పై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొని.. ఇందులోకి తీసుకోబోయే అధికారులతో ఒకట్రెండు విడతలు చర్చించి గురువారం ఉత్తర్వులు వెలువరించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడటం ద్వారా భారత రాష్ట్ర సమితికి సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదు నమోదైంది. ఆ కేసు దర్యాప్తును హైదరాబాద్‌ నాటి కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ అప్పటి డీసీపీ ఎస్‌.ఎం.విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి దర్యాప్తు చేపట్టారు. అప్పట్లోనే టాస్క్‌ఫోర్స్‌ విశ్రాంత డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్‌రావును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని విచారించిన క్రమంలోనే ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా గుర్తించి 90 రోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు అమెరికాలో తలదాచుకోవడంతో రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయించి రప్పించారు. వారిని రప్పించినా ఎస్‌ఐబీలో కీలకాధారాల్ని ధ్వంసం చేయడంతో దర్యాప్తులో పెద్దగా పురోగతి కనిపించలేదు.

ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాను ఆధారాల్ని ధ్వంసం చేశానని ప్రభాకర్‌రావు చెప్పడంతో దర్యాప్తు జటిలంగా మారింది. ప్రభాకర్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్న ఉన్నతాధికారులను విచారించేందుకు పలు అవాంతరాలు ఎదురు కావడంతో అప్పట్లో ఈ కేసు విచారిస్తున్న పోలీస్‌ అధికారుల బృందం ముందుకెళ్లలేకపోయిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. వారిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేయకుండా కేసు దర్యాప్తు కొలిక్కిరాదనే అభిప్రాయాలు వ్యక్తమైనా ఇన్నాళ్లూ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ వ్యవహారం వెనక నాటి ప్రభుత్వంలోని కీలక నేతలున్నా.. ఆధారాల్ని ధ్వంసం చేశామనే ధీమాతో ప్రభాకర్‌రావు వాస్తవాల్ని వెల్లడించడంలేదని అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలోనే మరింత లోతుగా విచారించడం ద్వారా ఉన్నతాధికారులు, నేతల గుట్టు విప్పేందుకే సిట్‌ను ఏర్పాటు చేశారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఎస్‌ఐబీపై ఉన్న నమ్మకంతోనే తాము ప్రభాకర్‌రావు సూచించిన ఫోన్‌లను ట్యాప్‌ చేసేందుకు అనుమతించామని రాష్ట్ర హోంశాఖ అప్పట్లో న్యాయస్థానానికి నివేదిక పంపించింది.

అంబర్‌ కిషోర్‌ ఝా (రామగుండం కమిషనర్‌), ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌ (సిద్దిపేట కమిషనర్‌), రితీరాజ్‌ (మాదాపూర్‌ డీసీపీ), కె.నారాయణరెడ్డి (మహేశ్వరం డీసీపీ), ఎం.రవీందర్‌రెడ్డి (గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌), కె.ఎస్‌.రావు (రాజేంద్రనగర్‌ అదనపు డీసీపీ), పి.వెంకటగిరి (జూబ్లీహిల్స్‌ ఏసీపీ),  సీహెచ్‌ శ్రీధర్‌ (టీజీఏఎన్‌బీ డీఎస్పీ), నాగేందర్‌రావు (హైదరాబాద్‌ మెట్రో రైల్‌ డీఎస్పీ).

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.