పొట్టి శ్రీరాములు పేరిట జె.జె.ఎం.వాటర్ గ్రిడ్ పథకం: డిప్యూటీ సీఎం పవన్

- A
- A+
- A++

అమరావతి: ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో తాగునీటి పథకానికి ‘అమరజీవి జలధార’ పేరును ఖరారు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును అందరూ తలచుకొనేలా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన జల్జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకాన్ని రాష్ట్రంలో అమరజీవి జలధార అని వ్యవహరించనున్నట్టు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన పోస్టర్ను డిప్యూటీ సీఎం విడుదల చేశారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను శనివారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామంలో పవన్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో 5 ప్రాజెక్టులను ఈ పథకంలో భాగంగా చేపడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, పల్నాడు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని ఈ పథకం కోసం రూ.7,910 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాబోయే 30 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహార్తి తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వైకాపా ఎమ్మెల్సీలు రెండు రోజుల సభా సమయాన్ని వృథా చేశారు: అనిత ప్రభుత్వంపై బురద చల్లాలనే తపన తప్ప ప్రజా సమస్యలపై చర్చించే ఆలోచన వైకాపా ఎమ్మెల్సీలకు లేదని ఏపీ హోంమంత్రి అనిత (Anitha) దుయ్యబట్టారు.
- అన్నీ తెలిసే నన్ను ఆడుకుంటున్నారుగా.. మీకో నమస్కారం: వైకాపా ఎమ్మెల్యే అసెంబ్లీ ఆవరణలో తెదేపా ఎమ్మెల్యేలకు వైకాపా ఎమ్మెల్యే చంద్రశేఖర్ తారసపడ్డారు.
- కులవర్ధన్ ఆత్మహత్య.. బాణసంచా కాల్చి మదనపల్లెలో సంబరాలు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిపై హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు.
- మదనపల్లె ఘటనను తీవ్రంగా పరిగణించాం: హోంమంత్రి అనిత మదనపల్లెలో చిన్నారిపై ఘాతుకాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని హోంమంత్రి అనిత తెలిపారు.
- గుడివాడ సీసీఎస్ పీఎస్ గోదాములో అగ్నిప్రమాదం కృష్ణా జిల్లా గుడివాడ సీసీఎస్ పోలీస్స్టేషన్ గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
- కులవర్ధన్ను రక్షక్ వాహనంలో తరలిస్తుండగా తప్పించుకున్నాడు: ఎస్పీ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిపై హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఎస్పీ ధీరజ్ చెప్పారు.
- పీపీపీ మోడల్లో వంద పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తాం: మంత్రి సత్యకుమార్ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదిగా భావిస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు.
- తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
- ఫ్లైట్ టికెట్టూ నాదే.. మ్యాచ్ టికెట్టూ నాదే: మంత్రి లోకేశ్ కౌంటర్ ఇటీవల కొలంబోలో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ను తన సొంత ఖర్చుతో వెళ్లి వీక్షించానని ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు.
- విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నం: విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) జరిగింది. ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పాల్గొని ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు 7 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి.
- విశాఖలో ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించిన రాష్ట్రపతి, సీఎం విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) కొనసాగుతోంది. ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి.
- బాలికపై హత్యాచారం.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
- విలేజ్ టు విరాట్ మీరు క్రికెట్ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ‘విలేజ్ టు విరాట్’ ట్యాగ్తో ‘రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
- ‘ఆరెంజ్ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇందుకోసం జూన్ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
- పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
- వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
- వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
- నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.