Rayadurgam: రాయదుర్గం కో లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: రాయదుర్గం పరిధిలోని కో లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా మరోసారి వెలుగు చూసింది. స్థానిక అంజయ్య నగర్లోని కో లివ్ గెర్నట్ పీజీలో డ్రగ్స్ దందా సాగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులు, డ్రగ్స్ను వినియోగిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సరఫరాదారులను ఏపీకి చెందిన డ్రగ్ పెడ్లర్లు వంశీ దిలీప్, బాల ప్రకాశ్గా, వినియోగదారులను హైదరాబాద్కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్గా గుర్తించారు. వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించిన ఎస్వోటీ పోలీసులు.. నిందితులను రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ప్రియుడి కోసం కపట నాటకం కర్ణాటక రాష్ట్రం హాసన తాలూకా కల్కెర గ్రామంలో స్నేహితురాలి వివాహానికి వచ్చిన ఓ మహిళ (29) గత శుక్రవారం కనిపించకుండా పోయింది. తుమకూరు జిల్లా కుణిగల్కు చెందిన ఆమెకు ఇప్పటికే వివాహమైంది. భర్తతో కలిసి చిక్కమగుళూరులో ఉంటోంది.