

TDP: బీసీలు, మహిళలకు పెద్దపీట

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ.. లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని ఆదివారం ప్రకటించింది. 25 లోక్సభ స్థానాలకు ఐదుచోట్ల మహిళల్ని అధ్యక్ష స్థానంలో నియమించింది. మొదటి నుంచీ తెదేపాకి వెన్నెముకగా నిలిచిన వెనుకబడిన వర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ 8 లోక్సభ స్థానాల్లో వారిని పార్టీ అధ్యక్షులుగా, 12 చోట్ల ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. అధ్యక్ష పదవుల్లో ఓసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీలు, మైనారిటీలకు ఒక్కోటి చొప్పున కేటాయించింది. లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపికకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేశారు. సామాజిక, రాజకీయ, స్థానిక సమీకరణలు, పార్టీకి విధేయత, భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయడం వంటి అంశాల్ని ప్రాతిపదికగా చేసుకున్నారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటించారు.
త్రిసభ్య కమిటీలు ఆయా లోక్సభ స్థానాలకు వెళ్లి.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జుల నుంచి సేకరించిన అభిప్రాయాలు, ఐవీఆర్ఎస్ సహా వివిధ సర్వేల ద్వారా తీసుకున్న సమాచారం, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని, ఇతర కార్యకవర్గాన్ని ఎంపిక చేశారు. చంద్రబాబు త్రిసభ్య కమిటీలతో పలు దఫాలు సమావేశమయ్యారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులకు పరిశీలనలో ఉన్న వారి పేర్లతో మంగళవారమే ఒక జాబితా సిద్ధం చేశారు. దానిపై పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆ జాబితాలో కొన్ని మార్పులు చేశారు.
చంద్రబాబు శనివారం రాత్రి మరోసారి సమీక్షించి, తుది జాబితా ఖరారు చేశారు. మంగళవారం బయటకు వచ్చిన అధ్యక్షుల జాబితాలో ఐదు, ప్రధాన కార్యదర్శుల జాబితాలో రెండు మార్పులు జరిగాయి. అనకాపల్లికి కోట్నే బాలాజీ, నరసరావుపేటకు కొమ్మాలపాటి శ్రీధర్, అనంతపురం స్థానానికి కాలవ శ్రీనివాసులు, కర్నూలుకు షేక్ వహీద్ హుస్సేన్, నంద్యాలకు మన్నె సుబ్బారెడ్డి పేర్లను మొదట ప్రతిపాదించగా, ఇప్పుడు వారికి బదులు బత్తుల తాతయ్యబాబు, షేక్ జానే సైదా, పూల నాగరాజు, గుడిసె కృష్ణమ్మ, గౌరు చరితారెడ్డిల్ని ఆయా స్థానాలకు అధ్యక్షులుగా నియమించారు. ప్రధాన కార్యదర్శుల్లో నరసరావుపేటకు మొదట సయ్యద్ ఆమీర్ ఆలీ పేరు ప్రతిపాదించగా.. ఇప్పుడు నల్లపాటి రామచంద్రప్రసాద్ను నియమించారు. తిరుపతికి బిల్లు చెంచురామయ్య, గంగల కామేశ్వర్ పేర్లను మొదట పరిశీలించగా, చివరకు డాలర్ దివాకర్రెడ్డి పేరు ఖరారు చేశారు.
లోక్సభ నియోజకవర్గ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు పట్టుబట్టి మరీ కార్యరూపం దాల్చేలా చూశారు.
మహిళలకు సముచిత ప్రాతినిధ్యం
తెదేపా లోక్సభ నియోజకవర్గ కమిటీల్లో మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు త్రిసభ్య కమిటీలకు పదేపదే చెప్పారు. కనీసం 30 శాతం పదవులు మహిళలకు కేటాయించాలని చెబుతూ రెండుసార్లు జాబితాలో మార్పులు చేయించారు. జిల్లా కార్యవర్గాన్ని 32 నుంచి 40కి పెంచారు. జిల్లా అధ్యక్ష పదవుల్లో ఐదు మహిళలకు కేటాయించారు. మొదట ముగ్గురు మహిళలకే అధ్యక్ష పదవులు ప్రతిపాదించగా.. తుది జాబితాలో దాన్ని ఐదుకు పెంచారు.
- కేంద్ర మాజీమంత్రి, తితిదే పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మోజోరు తేజోవతి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న గుడిసె కృష్ణమ్మలకు అధ్యక్ష పదవులు దక్కాయి.
- నలుగురు ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణ (చంటి), ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఎం.ఎస్.రాజు, గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాద్లను అధ్యక్షులుగా నియమించారు. వీరిలో ఎం.ఎస్.రాజు తితిదే పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు.
- ఇప్పటికే లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులుగా ఉన్న బత్తుల తాతయ్యబాబు, కిమిడి నాగార్జున, జ్యోతుల నవీన్, సలగల రాజశేఖర్బాబుకు మళ్లీ అవకాశం దక్కింది.
- లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమితులైనవారిలో బత్తుల తాతయ్యబాబు, పిల్లి మాణిక్యరావు, మంతెన రామరాజు, వీరంకి గురుమూర్తి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లుగా ఉన్నారు.
- బొడ్డు వెంకటరమణ చౌదరి రుడా ఛైర్మన్గా, కిమిడి నాగార్జున విజయనగరం డీసీసీబీ అధ్యక్షుడిగా, పూల నాగరాజు ఆర్టీసీ కడప రీజియన్ ఛైర్మన్గా పనిచేస్తున్నారు.
బీసీలకు 12 ప్రధాన కార్యదర్శుల పదవులు
తెదేపా లోక్సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శుల పదవుల్లోను బీసీలకు సముచిత ప్రాధాన్యమిచ్చారు. 12 స్థానాలు వారికి కేటాయించారు. ఓసీలకు 9, ముస్లింలకు 3, ఎస్సీలకు ఒకచోట అవకాశమిచ్చారు. ప్రధాన కార్యదర్శుల్లో డాలర్ దివారక్రెడ్డి ప్రస్తుతం తుడా ఛైర్మన్గా ఉన్నారు. చెన్నుబోయిన చిట్టిబాబు కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్గా పనిచేస్తున్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సంక్షిప్త వార్తలు(16) జోడు రథాలు.. మిన్నంటిన శివనామస్మరణలు.. కిక్కిరిసిన వీధులతో శ్రీకాళహస్తిలో రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది.
- స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి: రొమానా క్రోపిలోవా మధ్య ఆదాయ దేశాల్లో విద్యలో తీసుకొచ్చిన కొన్ని ఏఐ సాధనాలు విఫలమవుతున్నాయని ఫ్యాబ్ ఏఐ ఎడ్యుటెక్ డైరెక్టర్ రొమానా క్రోపిలోవా తెలిపారు.దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంప్యాక్ట్ సమ్మిట్లో సోమవారం ఆమె మాట్లాడుతూ..
- ప్రభుత్వ సేవలు మరింత సులభతరం ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశించారు.
- సింగిల్ జడ్జి ఉత్తర్వులపై దామోదరనాయుడు అప్పీల్ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్గా తన నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డాక్టర్ టి.దామోదరనాయుడు దాఖలు చేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
- వైకాపా హయాంలోని ఇళ్ల పట్టాలపై విచారణ చేయాలి ఎన్నికలకు ముందు వైకాపా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో అసలైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై ప్రభుత్వం విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు.
- జస్టిస్ బాలాజికి ఘన సన్మానం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మెడమల్లి బాలాజిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు.
- నూజివీడు కోర్టుకు హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో నమోదైన కేసులో వైకాపాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సోమవారం నూజివీడులోని న్యాయస్థానంలో హాజరయ్యారు.
- తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము, ఇతర నిందితులు బాలరాజు, రాజేష్, మణిమారన్, ఎన్.రవి, అన్బురాసు, అల్లాబక్షు కోర్టులో వాయిదాకు హాజరయ్యారు.
- డ్వాక్రా మహిళలకు తీపికబురు మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
- రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల.. మే నెల కోటా విడుదల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఈనెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
- 498 కేసులో లుకౌట్ నోటీసా? పోలీసులు యాంత్రిక ధోరణిలో లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసేస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది.
- బీసీ కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా రాష్ట్రంలో బీసీల జనాభా అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్ను నియమించనుంది.
- నెల్లూరు మేయర్, ఏలూరు డిప్యూటీ మేయర్ స్థానాలకు 26న ఎన్నికలు రాష్ట్రంలోని నెల్లూరు, ఏలూరు నగరపాలక సంస్థల్లో ఖాళీ అయిన మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు.
- త్యాగనిరతికి నిలువెత్తు ఆకృతి రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన ఆ మహనీయుడి త్యాగనిరతిని భావితరాలకు తెలియజేసేందుకు శాఖమూరు వద్ద ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో ఆయన విగ్రహాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది.
- రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ ‘కృత్రిమ మేధ(ఏఐ)తో భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం సాధ్యం. త్వరలోనే ఒక వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం అందే సాంకేతిక వ్యవస్థను (వీ2వీ) అందుబాటులోకి తీసుకురానున్నాం.
- ఇంటింటికీ నీటి సరఫరాపై నిఘా గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరాలో నాణ్యత ప్రమాణాలను ఏఐతో ఎలా పర్యవేక్షిస్తున్నారో వివరించారు ‘ఆర్ఘ్యం’ సంస్థ సీనియర్ మేనేజర్ భావన బడోలా.
- క్రీడాకారుల ఆటను ఏఐతో ట్రాక్ చేస్తున్నాం క్రీడాకారుల ఆట తీరు, వ్యక్తిగత శిక్షణ కార్యక్రమాలను కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా ట్రాకింగ్ చేస్తున్నామని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపకులపతి కపానా శర్మ తెలిపారు.
- సముద్రాలకు ప్లాస్టిక్ నుంచి విముక్తి ఏఐ ఆధారిత విధానాలతో సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపొచ్చని కర్ణాటకలోని ఉడుపికి చెందిన బేరు కోస్ట్ క్లియర్ సంస్థ వ్యవస్థాపకురాలు దివ్యా హెగ్డే అనుభవపూర్వకంగా తెలిపారు.
- సాగరతీరంలో మిలన్ సంబరాలు అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (ఐఎఫ్ఆర్-2026), మిలన్ వేడుకల్లో భాగంగా తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో సోమవారం సన్నాహక విన్యాసాలు జరిగాయి.
- తిరుమలలో తెలంగాణ భవన్కు స్థలం కేటాయించండి తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని, భద్రాచలం సమీపంలోని ఐదు ఏపీ గ్రామాల్ని తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరినట్టు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.