
Andhra News: రెవెన్యూ దస్త్రమా.. ‘డిస్కస్’!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
- ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వేతో సమస్య మొదలైంది. గతంలో ఉన్న 302 అనే ఎల్పీఎంను విభజించి భూనక్ష మ్యాప్లో 307, 308 నంబర్లుగా నమోదు చేశారు. వెబ్ల్యాండ్ ఆర్ఓఆర్లో 314, 315 ఎల్పీఎం నంబర్లుగా పేర్కొన్నారు. వాస్తవానికి భూనక్షలోని నంబర్లే వెబ్ల్యాండ్లోనూ కనిపించాలి. అలా కాకుండా రెండుచోట్ల వేర్వేరుగా అప్డేట్ అయ్యాయి. దీన్ని సరిదిద్దాలంటూ సీసీఎల్ఏకు పది నెలల కిందట దస్త్రం పంపినా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అధికారులకు లేఖలు రాసినా ఫలితం లేదు.
- గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామం 1134 సంవత్సరం నుంచి రికార్డుల్లో ఉంది. 1906లో ఆర్ఎస్ఆర్ తయారీ సమయంలో చెరువు సర్వే నంబరులో ఊరి విస్తీర్ణాన్ని కలిపేశారు. దీంతో రికార్డుల్లో ఊరంతా చెరువు భూమిగా కనిపిస్తోంది. దీంతో గ్రామంలోని 735 గృహాల వారు భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా కలెక్టరేట్, సీసీఎల్ఏ స్థాయిలోనూ ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఎట్టకేలకు ప్రస్తుతం ఆర్డీవో స్థాయిలో రికార్డులు తయారు చేస్తున్నారు.
ఈనాడు, అమరావతి: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాలే కాదు.. కలెక్టరేట్, సీసీఎల్ఏ కార్యాలయాలూ నిద్ర నటిస్తున్నాయి. మండలం, డివిజన్, జిల్లా నుంచి ఏదైనా దస్త్రం వచ్చిందంటే పరిష్కారం మాట అటుంచి.. కొర్రీలేస్తున్నారు. తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల్లో రెవెన్యూ అర్జీలను పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు.. వారి వద్ద ఉన్న దస్త్రాల ఊసెత్తడం లేదు. కొందరు సంయుక్త కలెక్టర్లు, కలెక్టర్లు ఆయా దస్త్రాలపై ‘డిస్కస్’ అని రాసి.. వెనక్కి పంపేస్తున్నారు. ఆ తర్వాత వాటి పరిష్కారానికి నెలలు, ఏళ్ల సమయం పడుతోంది. జిల్లాల నుంచి సీసీఎల్ఏ వరకు ఎవరికి వారే.. తమకు ఎందుకొచ్చిన గొడవ అని పక్కవారిపై నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాత రికార్డులు కనిపించడం లేదంటూ పక్కన పెట్టేయడమూ రివాజుగా మారింది. ఎన్ని కొర్రీలు వేస్తే.. అంత గొప్పగా పరిశీలించినట్లు లెక్క అనే భావన కలెక్టరేట్లలోని కొందరు రెవెన్యూ అధికారుల్లో పాతుకుపోయింది. సిబ్బంది కొరత కూడా సమస్యకు మరో కారణం. రెవెన్యూ ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా వీటిపై ఆలోచించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వచ్చేవన్నీ దీర్ఘకాలిక సమస్యలే
గ్రామాల్లో వేల రెవెన్యూ సమస్యలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. వాటిలో అధిక భాగం సమస్యలకు సంబంధించిన దస్త్రాలు కలెక్టరేట్లు, సీసీఎల్ఏ కార్యాలయాలకు వచ్చి, మళ్లీ వెనక్కి వెళ్తున్నాయి. ఇందులో 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన వాటితో పాటు.. సుమోటో కరెక్షన్లు, చుక్కల భూములు, రీసర్వేకు సంబంధించినవి ఎక్కువగా ఉంటున్నాయి. ఏదైనా దస్త్రం వచ్చిందంటే కొన్నిచోట్ల కలెక్టరేట్లోని అధికారులు లోపాలున్నాయని వెనక్కి పంపిస్తున్నారు. కలెక్టర్, సంయుక్త కలెక్టర్ కూడా వారు చెప్పిన దానికి తలూపుతున్న పరిస్థితులున్నాయి.
వందేళ్ల ఆధారాలతో సమర్పించాలంటూ..
ఏదైనా భూ సమస్యకు సంబంధించిన అర్జీ వస్తే.. వాటికి సంబంధించిన లింక్ దస్తావేజులు ఇవ్వాలని మండల అధికారుల్ని కోరుతున్నారు. అక్కడ అందుబాటులో లేకపోతే .. ఏళ్లపాటు ఆయా దస్త్రాలు కదలవు. కొన్నింటికి వందేళ్ల ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తున్నారు. రైతులకు అది సాధ్యమా? కాదా? అని ఆలోచించడం లేదు. ఉదాహరణకు కోస్తాలోని ఓ జిల్లాలో వందేళ్ల కిందట కన్వర్షన్ అయిన భూమిని 22ఏ కింద పెట్టేశారు. దీన్ని సరిదిద్దాలని తహసీల్దారు, ఆర్డీవోలు కూడా కలెక్టర్, సీసీఎల్ఏకు లేఖలు రాశారు. అయినా పరిష్కారం దొరకలేదు. న్యాయస్థానం జోక్యంతో చివరకు ఆధారాలు లేవని తిరస్కరించేశారు. ఈ సమస్య కారణంగా సుమారు 40 మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో వేలల్లో ఉన్నాయి. ప్రభుత్వం వీటన్నిటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
- విలేజ్ టు విరాట్ మీరు క్రికెట్ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ‘విలేజ్ టు విరాట్’ ట్యాగ్తో ‘రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
- ‘ఆరెంజ్ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇందుకోసం జూన్ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
- పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
- వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
- వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
- నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
- శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
- తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
- 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి, ఐఆర్ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎన్.ప్రసాద్ డిమాండ్ చేశారు.
- అమరావతిలో క్యాట్ శాశ్వత బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సర్క్యూట్(క్యాట్) శాశ్వత బెంచ్ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
- బిల్గేట్స్ పర్యటన.. సీఎం విజన్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్గేట్స్ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
- 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
- అమర్నాథ్ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్లో కలిసేందుకు ఇష్టపడలేదు.
- ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్’లో బిల్గేట్స్ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్గేట్స్ పేర్కొన్నారు.
- మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
- అసెంబ్లీలో పని చేయని మైక్ సిస్టమ్ అసెంబ్లీలో మంగళవారం మైక్ సిస్టమ్ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
- ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
- వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.