Tollywood Pro League: ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్‌ ప్రొ లీగ్‌

Eenadu icon
By Sports News Desk Published : 22 Dec 2025 03:32 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మాదాపూర్, న్యూస్‌టుడే: సినీ ప్రముఖులు పాల్గొనే టాలీవుడ్‌ ప్రొ లీగ్‌ (టీపీఎల్‌) క్రికెట్‌ టోర్నీ ఫిబ్రవరి 13 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఆదివారం ఈ లీగ్‌ ట్రోఫీని, జెర్సీని సినీ, క్రికెట్‌ ప్రముఖులు ఆవిష్కరించారు. దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్, మాజీ స్టార్‌ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్‌ రైనాలతో పాటు సినీ నిర్మాత దిల్‌ రాజు, నటుడు సోనూ సూద్, సంగీత దర్శకుడు తమన్, నటి రాశీ ఖన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిల్, సెహ్వాగ్, దిల్‌ రాజు, సోనూ సూద్‌ కలిసి స్నేహపూర్వక క్రికెట్‌ మ్యాచ్‌ ఆడారు. ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ క్రికెట్‌ పట్ల ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌ అందమైన నగరమే కాదు, రుచికరమైన వంటకాలకు కేంద్రమని కొనియాడారు. వీరేంద్ర సెహ్వాగ్‌ మాట్లాడుతూ.. సినిమా రంగానికి చెందిన నటులు, టెక్నీషియన్లు కలిసి క్రికెట్‌ లీగ్‌ ఆడటం మంచి పరిణామమన్నారు. దిల్‌ రాజు మాట్లాడుతూ.. తెర మీద కనిపించే నటులతో పాటు తెర వెనుక ఉండి పని చేసేవారితో కలిసి టీపీఎల్‌ టోర్నీ జరుగుతుందన్నారు. ఆరు జట్లతో కూడిన ఈ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌లో ప్రముఖ నిర్మాతలు జట్లకు యజమానులుగా వ్యవహరిస్తారని రాజు తెలిపారు. సినీనటుడు ఆశిష్‌ విద్యార్థి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, ఈబీజీ గ్రూప్‌ అధ్యక్షుడు ఇర్ఫాన్‌ ఖాన్, టీపీఎల్‌ వ్యవస్థాపకుడు వంశీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పది పరీక్షలకు వైభవ్‌ దూరం భారత అండర్‌-19 ప్రపంచకప్‌ స్టార్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
  • కోపం వదిలెయ్‌ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్‌ అనంతరం భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అక్కడ మెరుపుల్లేవ్‌ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
  • కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్‌! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 8కు దూసుకెళ్లింది.
  • పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్‌! భారత స్టార్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్‌ అనుగ్రహ పాండే. మోడల్‌ అదితి హుండియాతో ఇషాన్‌ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
  • అజ్మతుల్లా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్‌.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
  • ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్‌-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
  • అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్‌ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
  • పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
  • బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ పరాజయ ప్రభావం.. సీనియర్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజాం, షాహీన్‌ అఫ్రిదిలపై పడేలా ఉంది.
  • సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్‌-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.