IND u19 Vs PAK u19: ఫైనల్లో భారత్‌ బోల్తా

Eenadu icon
By Sports News Desk Published : 22 Dec 2025 03:34 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

యువ భారత్‌ బోల్తా కొట్టింది. అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీ ఆరంభం నుంచి అదిరే ప్రదర్శన చేసిన జట్టు.. తుది మెట్టుపై చతికిల పడింది. ఆదివారం ఫైనల్లో బంతితో, బ్యాటుతో ఘోరంగా విఫలమైన భారత్‌.. 191 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయింది. సమీర్‌ మిన్హాస్‌ (172; 113 బంతుల్లో 17×4, 9×6) విరుచుకుపడడంతో మొదట పాకిస్థాన్‌ 8 వికెట్ల నస్టానికి 347 పరుగుల భారీస్కోరు సాధించింది. అహ్మద్‌ హుస్సేన్‌ (56), ఉస్మాన్‌ ఖాన్‌ (35) రాణించారు. బంతితో భారత్‌ తేలిపోయింది. దీపేశ్‌ (3/83), కనిష్క్‌ చౌహాన్‌ (1/72), హెనిల్‌ పటేల్‌ (2/62) ధారాళంగా పరుగులిచ్చారు. ఖిలాన్‌ పటేల్‌ (2/44) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఛేదనలో భారత్‌ చేతులెత్తేసింది. అలీ రజా (4/42), హుజైఫా (2/12), సుభాన్‌ (2/29), సయ్యమ్‌ (2/38) ధాటికి 26.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. 36 పరుగులు చేసిన దీపేశ్‌  టాప్‌ స్కోరర్‌. సమీర్‌ మిన్హాస్‌.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.

తేలిపోయారు..:పాకిస్థాన్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పేలవంగా బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు అతణ్ని ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. మరో ఓపెనర్‌ హంజా (18) త్వరగానే నిష్క్రమించినా.. సమీర్‌ జోరుతో పాక్‌ భారీ స్కోరు దిశగా సాగింది. సమీర్‌.. ఉస్మాన్‌ ఖాన్‌తో రెండో వికెట్‌కు 92, అహ్మద్‌ హుస్సేన్‌తో మూడో వికెట్‌కు 137 పరుగులు జోడించాడు. ఆ తర్వాత ఫర్హాన్‌ (19)తో నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించి.. 43వ ఓవర్లో ఔటయ్యాడు. ఆఖర్లో భారత బౌలర్లు కాస్త మెరుగ్గా బౌలింగ్‌ చేయగలిగారు. పాక్‌ చివరి ఏడు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు రాబట్టింది. ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన భారత్‌.. ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. పది ఓవర్లలోపే ఓటమి ఖాయమైపోయింది. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (26; 10 బంతుల్లో 1×4, 3×6) ధాటిగానే ఆరంభించినా.. ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 5వ ఓవర్లో అతడు ఔటయ్యేటప్పటికి స్కోరు 49. అంతకన్నా ముందే ఆయుష్‌ మాత్రే (2), ఆరోన్‌ జార్జ్‌ (16) వెనుదిరిగారు. విహాన్‌ మల్హోత్రా (7), వేదాంత్‌ త్రివేది (9) కూడా విఫలం కావడంతో భారత్‌ 68/5తో పీకలలోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ తర్వాత అద్భుతమేమీ జరగలేదు. మిగతా బ్యాటర్లు కూడా పోరాడకుండానే వెనుదిరిగారు.

సంక్షిప్త స్కోర్లు...

పాకిస్థాన్‌:347/8 (సమీర్‌ మిన్హాస్‌ 172, అహ్మద్‌ హుస్సేన్‌ 56, ఉస్మాన్‌ ఖాన్‌ 35, ఫర్హాన్‌ 19; దీపేశ్‌ 3/83, ఖిలాన్‌ పటేల్‌ 2/44, హెనిల్‌ పటేల్‌ 2/62)

భారత్‌:26.2 ఓవర్లలో 156 ఆలౌట్‌ (దీపేశ్‌ 36, వైభవ్‌ సూర్యవంశీ 26, ఖిలాన్‌ పటేల్‌ 19, ఆరోన్‌ జార్జ్‌ 16, అభిజ్ఞాన్‌ కుందు 13, ఆయుష్‌ మాత్రే 2; అలీ రజా 4/42, సుభాన్‌ 2/29, సయ్యమ్‌ 2/38)

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.