Visakhapatnam: వహ్వా.. వియత్నాం రుచులు..!

- A
- A+
- A++

ఈనాడు, విశాఖపట్నం: నగరవాసులకు వియత్నాం రుచులు పరిచయం చేస్తున్నారు పలువురు యువత. తక్కువ మందితో డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేసి స్వయంగా వడ్డిస్తున్నారు. ఇందుకోసం ఫేస్బుక్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు. దీనికి యువత ఫిదా అవుతోంది. ఎంవీపీ, పాండురంగాపురం, మధురవాడ ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. విదేశాల్లో చదివి విశాఖ తిరిగొచ్చిన కొందరు యువత వీటిని ఏర్పాటు చేయడం విశేషం.
నైపుణ్యాల వేదికగా..:కేవలం విదేశీ రుచులు పరిచయం చేయడం వరకే నిర్వాహకులు పరిమితం కాలేదు. యువతను ఆకట్టుకోవడానికి కొత్తగా ప్రయత్నిస్తున్నారు. భోజనం చేయడానికి ముందు 15నిమిషాల వరకు వియత్నాం దేశంలో వంటలు ఎలా ఉంటాయి..అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు.. తదితరాలు వివరిస్తారు. వచ్చిన వారు తమలోని వివిధ నైపుణ్యాలను తెలియజేస్తారు. వాటిని అక్కడి గోడలపై అంటిస్తారు. ఎవరైనా వాటిని నేర్చుకోవాలనుకుంటే వారిని సంప్రదించే ఏర్పాట్లు చేశారు.

మెనూ అదుర్స్..వియత్నాం ఆహారంలో ఐస్టీ రుచే వేరు. నిమ్మరసం, గ్రీన్ టీ, తేనెను ఐస్తో కలిపి దీన్ని తయారు చేస్తున్నారు. ఇందులో తినేందుకు వడియాల్లా వేయించిన రొయ్యలు ఇస్తున్నారు.
- స్ట్రాటర్స్గా రొయ్యలను రోల్ చేసి అందులో అన్నం, వెనిగర్ కలిపిన కాయగూర ముక్కలు ఇస్తున్నారు. అలాగే బాన్మీ అనే రొట్టెలో వేయించిన చికెన్ వేసి వడ్డిస్తున్నారు.
- కోల్డ్ న్యూడిల్స్లో చికెన్ కర్రీ వడ్డిస్తున్నారు. వెళ్లేటప్పుడు గిఫ్టులు ఇస్తున్నారు.
ఏడాదిన్నరపాటు కసరత్తు:నేను ఫ్రాన్స్లో చదువుకున్నా. ఆ సమయంలో అక్కడ రెస్టారెంట్ బిజినెస్పై అధ్యయనం చేశా. వియత్నాం ఆహారపు రుచులు భిన్నంగా అనిపించాయి. విశాఖ వచ్చాక ఏదైనా వినూత్నంగా చేయాలనిపించింది. వియత్నాం రుచులు నగరవాసులకు పంచితే ఎలా ఉంటుందని ఆలోచన చేశా. దీన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ఏడాదిన్నరపాటు కసరత్తు చేశా. ఇందుకోసం డిన్నర్ క్లబ్ ఏర్పాటు చేసి నెలలో రెండు, మూడు సార్లు వంటలు చేసి పెడుతున్నా. దీనికి మంచి స్పందన వచ్చింది. విదేశీ రుచులే కాకుండా కొత్త వంటకాలను పరిచయం చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులో లాంగ్ టేబుల్ సొసైటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నా.
► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 08:19 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ‘నౌకా’ సంరంభం..సాగర సంభ్రమం..! [ 18-02-2026] అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)లో భాగంగా ఆర్కేబీచ్ కేంద్రంగా నిర్వహించే సిటీ పరేడ్, నౌకాదళం విన్యాసాలు, ఫైర్, డ్రోన్ షోల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బుధవారం నమూనా విన్యాసాలు నిర్వహించి, గురువారం పూర్తిస్థాయి ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- శ్రమించారు.. సాధించారు! [ 18-02-2026] జేఈఈ మెయిన్ ఫలితాల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. మంచి ప్రణాళిక.. ఉపాధ్యాయుల మార్గదర్శనం.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించామని విద్యార్థులు తెలిపారు. ఐఐటీ లక్ష్యంగా చదువుతున్నామని చెప్తున్నారు.
- సంద్రంలో ‘బలగం’.. శత్రు దుర్భేద్యం...! [ 18-02-2026] గాలిలో.. నీటిపైన.. సముద్రం అడుగున రక్షణ కవచంలా పనిచేసే ఆయుధ సంపత్తి తూర్పు నౌకాదళం ప్రత్యేకం. అందులో యుద్ధనౌకలతోపాటు జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి
- ఉన్నత చదువులకు అండగా.. ‘విద్యా లక్ష్మి’! [ 18-02-2026] ఉన్నత చదువులకు వెళ్లాలని ఉన్నా.. ఆర్థిక సమస్యల కారణంగా పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. అలాంటి వారికి ‘ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి’ పథకం ఆసరాగా నిలుస్తోంది.
- ‘మలుపు’ల్లో..అడుగడుగునా అక్రమాలు! [ 18-02-2026] రుషికొండ వద్ద నేరుగా వెళ్లాల్సిన రోడ్డు ఓ రిసార్టు, కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్లేసరికి మెలికలు తెరిగింది. వైకాపా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి సామాన్యుల ఆస్తుల మీదుగా అలైన్మెంట్ వెళ్లేలా చేశారు.
- ఇక తరగతులకు డుమ్మా కొట్టలేరు..! [ 18-02-2026] అనుబంధ కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు సక్రమంగా తరగతులు, విధులకు హాజరయ్యేలా ఆంధ్రవిశ్వవిద్యాలయం చర్యలకు ఉపక్రమించింది
- నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల [ 18-02-2026] గత ప్రభుత్వంలో నాయకులు అందిన కాడికి జేబులు నింపుకొనే ప్రయత్నాల్లో భాగంగా రోడ్ల నిర్మాణాల్లో అధికారులతో కలిసి నాణ్యతకు నీళ్లొదిలేశారు. దాని ఫలితం ఇప్పుడు కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.
- పరిశ్రమల ప్రవాహం.. ఉపాధికి ప్రోత్సాహం [ 18-02-2026] కూటమి పాలనలో జిల్లాకు పారిశ్రామిక కళ వచ్చింది. అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం పరిశ్రమలు, ఉపాధిపై దృష్టిసారించడంతో జిల్లా ముఖచిత్రమే మారిపోతోంది.
- కనుమరుగైపోతున్నా.. కన్ను తెరవరా..? [ 18-02-2026] పెందుర్తి మండలంలోనే అత్యధికంగా ధర పలుకుతున్న భూములున్న సుజాతనగర్ కాలనీ సమీప రాజుచెరువు కనుమరుగైపోయే దుస్థితి నెలకొంది.
- కోర్టు హాల్లో కుప్పకూలిన మహిళ [ 18-02-2026] కుటుంబ గొడవల నేపథ్యంలో మంగళవారం వాయిదాకు హాజరైన మహిళా కక్షిదారు కోర్టు హాల్లోనే కుప్పకూలిపోవడంతో ప్రధాన కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి కె.రాధారత్నం స్పందించారు.