CBI: జెనీవాలోని భారత శాశ్వత మిషన్‌లో అధికారి చేతివాటం.. రూ.2 కోట్లు దుర్వినియోగం

Eenadu icon
By International News Team Published : 22 Dec 2025 00:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్ డెస్క్‌: జెనీవాలో ఉన్న భారత శాశ్వత కమిషన్‌లోని ఓ అధికారి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిసింది. అక్కడ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తించిన ఆ అధికారి చేతివాటం ప్రదర్శించి దాదాపు 2లక్షలకుపైగా స్విస్‌ ఫ్రాంక్‌ (సుమారు రూ.2కోట్లు)లను సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు తేలింది. దీంతో అతడిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

జెనీవాలో ఉన్న భారత శాశ్వత కమిషన్‌లో మోహిత్‌ అనే అధికారి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా గతేడాది డిసెంబర్‌లో చేరారు. భారత కార్యాలయానికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌లో అకౌంట్లు ఉన్నాయి. ఆ లావాదేవీల నిర్వహణ బాధ్యతలు అతడికి అప్పగించారు. చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌లను ఉపయోగిస్తుండగా.. అందులో కొన్ని నకిలీ కోడ్‌లను సృష్టించిన మోహిత్‌ సొంత ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది. ఏడాది కాలంలో మొత్తంగా రూ.2 కోట్లకుపైగా దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారం గురించి అధికారులు ప్రశ్నించగా.. చేసిన మోసాన్ని మోహిత్‌ అంగీకరించాడు. ఆ నిధులను క్రిప్టో గ్యాంబ్లింగ్‌ కార్యకలాపాలకు మళ్లించినట్లు పేర్కొన్నాడు. దీంతో అతడిని కుటుంబంతో సహా భారత్‌కు పంపించారు. నేరపూరిత ద్రోహం, ఫోర్జరీ, ఖాతాలు దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేపట్టింది.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఎవరెస్టంత ఎత్తు వెళ్లే హెలికాప్టర్లు భారత్‌లోనే తయారీ - మోదీ భారత్‌- ఫ్రాన్స్‌ సంబంధాలు ప్రత్యేకమైనవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌ దశాబ్దాలుగా భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామిగా ఉందని చెప్పారు.
  • బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం Bangladesh PM Tarique Rahman: బంగ్లాదేశ్‌ నూతన ప్రధానిగా తారిఖ్‌ రెహమాన్‌ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు.
  • వీసా హక్కు కాదు : అమెరికా విదేశాంగ శాఖ కఠిన వీసా విధానాలపై అమెరికా విదేశాంగ మరోసారి స్పందించింది. వీసా అనేది హక్కు కాదని, విదేశీ పర్యటకులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరించింది.
  • ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు. 
  • అమెరికా బాటలో చైనా.. మెరైన్‌ కోర్‌ ఏర్పాటు ప్రపంచవ్యాప్తంగా సైనిక ఆపరేషన్లు చేసేందుకు అమెరికా మాదిరిగా చైనా సైతం మెరైన్‌ కోర్‌ను ఏర్పాటుచేసింది. 
  • యూనస్‌ నోట మళ్లీ ‘సెవెన్‌ సిస్టర్స్‌’.. వెళ్లిపోతూ భారత్‌పై కవ్వింపులు Bangladesh: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్న మహమ్మద్‌ యూనస్‌ సోమవారం తన పదవి నుంచి వైదొలిగారు.
  • పిల్లలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌ Indian Man Arrested: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో అరెస్ట్‌ అయ్యాడు. నిందితుడిని ఓడెల యశస్వీ కొత్తపల్లిగా గుర్తించారు.
  • ముంబయి తీరంలో సీజ్‌ అయిన నౌకలు ఇరాన్‌వే! చమురు అక్రమ రవాణాకు పాల్పడుతున్న కారణంగా భారత్‌ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది సీజ్‌ చేసిన మూడు నౌకలకు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
  • కిమ్‌ కుమార్తెకు వారసత్వ పగ్గాలు! నిరంకుశ పాలనకు చిరునామాగా నిలిచే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రాజ్యంలో కుటుంబ పోరుకు తెరలేచిందా? అధికార పగ్గాల కోసం కిమ్‌ సోదరి, కుమార్తె పోటీ పడనున్నారా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.
  • గ్రహాంతర జీవులు సంప్రదింపులు జరిపినట్లు ఆధారాల్లేవు: ఒబామా గ్రహాంతర జీవులున్నాయంటూ ఓ పాడ్‌కాస్ట్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
  • బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం చైనాలో వీసా లేకుండా పర్యటించే అవకాశం బ్రిటన్, కెనడా దేశాల ప్రజలకు మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది.
  • పాక్‌లో భారీ చోరీ.. 700 తులాల బంగారు కడ్డీలు మాయం! పాకిస్థాన్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు.. 300 మిలియన్‌ పాకిస్థానీ రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.