Andhra Pradesh News: చిలకలూరిపేట ప్రమాద ఘటన.. వెంకటనాయుడి ముఠా నుంచి మరిన్ని కార్లు స్వాధీనం

Eenadu icon
By Crime News Team Updated : 20 Dec 2025 13:39 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రమాదానికి కారణమైన ఏఎస్సై కుమారుడు వెంకటనాయుడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెంకటనాయుడు ముఠా చోరీ చేసిన కార్లను నరసరావుపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 కార్లను పీఎస్‌కు తరలించారు. గతంలోనూ 10 కార్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 కార్లను ఈ ముఠా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన కార్లు కూడా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ముఠా చిలకలూరిపేట పోలీసుల కస్టడీలో ఉంది. ఇప్పటికే వెంకటనాయుడు తండ్రి ఏఎస్సై శ్రీనివాసరావును ఎస్పీ సస్పెండ్ చేశారు. 

అసలేం జరిగిందంటే..?

ఈ నెల 4న నాదెండ్ల మండలం గణపవరం సమీపంలోని చిలకలూరిపేట బైపాస్‌ వద్ద జరిగిన ప్రమాదంలో అయిదుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. వెంకటనాయుడి బృందం ఓ భారీ లారీని ఆపి అక్రమంగా డబ్బులు వసూలు చేసే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు సీసీ ఫుటేజీ ద్వారా చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుల్ని సీసీ కెమెరాల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నాక డీఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఏఎస్సై శ్రీనివాసరావు కుమారుడి లీలలు వెలుగులోకి వచ్చాయి. 2023లో ఏఎస్సై కుమారుడు కోటప్పకొండ వద్ద రూ.2వేల నోట్ల మార్పిడికి రూ.10 లక్షల కమీషన్‌ ఎరవేసి.. కారుతో పాటు రూ.50 లక్షలు దోచుకున్నట్లు కేసు నమోదైంది. ఆ కేసులో తండ్రి పాత్రపై ఎప్పటినుంచో విచారణ ఫైలు ఎస్పీ కార్యాలయంలో పెండింగులో ఉంది.

ఏఎస్సై 15 ఏళ్లుగా నరసరావుపేటలోనే పనిచేస్తున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారుడు వెంకటనాయుడు దందాలు చేసినట్లు, ఫైనాన్స్‌ కార్లను తీసుకొచ్చి ఫేక్‌ నంబర్లతో ఇతరులకు తక్కువ ధరకే అమ్మడం, గంజాయి క్రయవిక్రయాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటి విషయంలో కుమారుడిని ఎప్పటికప్పుడు రక్షిస్తూ.. అరాచకాలకు అండగా నిలిచినట్లు తేలడంతో ఏఎస్సైని మొదట వెల్దుర్తి ఠాణాకు బదిలీ చేశారు. ఇటీవల సస్పెండ్‌ చేశారు. ( Andhra Pradesh News)

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 13:11 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • 4 గ్రాముల బంగారం కోసం వృద్ధుడి దారుణ హత్య! శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన వృద్ధుడి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తస్కరించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను దారుణంగా హతమార్చారు.
  • కల్వర్టును ఢీకొన్న వాహనం..ముగ్గురి దుర్మరణం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
  • కత్తులతో పొడిచి న్యాయవాది దారుణ హత్య ఓ న్యాయవాదిని తన సొంత బావమరుదులే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో శనివారం చోటు చేసుకుంది.
  • దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక పంట దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలంలో చోటు చేసుకుంది.
  • విద్యార్థిపై వార్డెన్ల దాష్టీకం.. ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపరిచిన ముగ్గురు వార్డెన్లపై ఖమ్మం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ కథనం ప్రకారం...
  • భార్యతో గొడవ.. కత్తెరతో పసికందు హత్య రక్షించాల్సిన తండ్రే రాక్షసుడిగా మారాడు. భార్యతో జరిగిన చిన్న గొడవకు అభం శుభం తెలియని పసికందును బలి తీసుకున్నాడు. కన్నకూతురు అని కూడా చూడకుండా, అత్యంత కిరాతకంగా కత్తెరతో పొడిచి చిన్నారిని హతమార్చాడు.
  • కారులోనే ప్రేయసిని కాల్చేసి.. తనూ కాల్చుకుని.. ప్రేమికుల రోజున ప్రేయసిని హత్యచేసి, ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన నొయిడాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దాద్రీ రోడ్డులో ఓ కారు చాలా సమయం నుంచి నిలిచి ఉందని పోలీసులకు సమాచారం శనివారం అందింది.
  • విమానంలో ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని బెదిరింపులు ‘ప్రయాణికుల మాటున దిల్లీ విమానంలో ఐదుగురు ఆత్మాహుతి బాంబర్లు ప్రయాణిస్తున్నారు.. శంషాబాద్‌లో ల్యాండింగ్‌ కాగానే ఆ విమానాన్ని పేల్చివేస్తాం’ అంటూ గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆర్జీఐఏ ఈ-మెయిల్‌కు సందేశం పంపించాడు.