Crime News: తెలంగాణలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఆరుగురి అరెస్ట్‌

Eenadu icon
By Crime News Team Published : 20 Dec 2025 18:30 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: నగరంలో న్యూ ఇయర్‌ వేడుకల్లో ఏటా పెద్దఎత్తున డ్రగ్స్‌ పట్టుబడ0తాయి. ఏడాది పొడవునా జరిగే మత్తు పదార్థాల వ్యాపారంలో 80-90 శాతం డిసెంబరు-జనవరి మధ్య అవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఆరుగురు డ్రగ్‌ పెడ్లర్లను ఈగల్‌ టీమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 330 గ్రాముల గంజాయి, 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ జిల్లాలో ముగ్గురు గంజాయి సరఫరా దారులను అరెస్టు చేసి 80 గ్రాములు, మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులు ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర గంజాయి సరఫరాదారులుగా గుర్తించారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని