కార్ల పార్కింగ్కు సరికొత్త అవతార్

- A
- A+
- A++
ఈనాడు, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం సిద్ధమైంది. రోబోటిక్ ప్లాట్ఫాంలతో కూడిన జర్మన్ సాంకేతికతతో ఆటోమేటిక్గా 250 కార్లు నిలిపేలా నాంపల్లిలో 15 అంతస్తుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ భవనంలో శుక్రవారం నుంచి ‘అవతార్-3’ సినిమాతో రెండు తెరలున్న మల్టీఫ్లెక్స్ ప్రారంభం కావడంతో పార్కింగ్ కూడా లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే సీఎం దీన్ని అధికారికంగా ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. నాంపల్లి కూడలిలో మెట్రోకు చెందిన అర ఎకరం స్థలంలో మెస్సర్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ పీపీపీ విధానంలో రూ.102 కోట్ల పెట్టుబడితో నోవమ్ పేరుతో ఈ పార్కింగ్ సముదాయాన్ని నిర్మించింది. 50 ఏళ్ల లీజు ఒప్పందమిది. 15 అంతస్తుల్లో.. మూడు బేస్మెంట్స్, ఏడు పైఅంతస్తులు కలిపి పది అంతస్తులను పార్కింగ్కు కేటాయించారు. మిగిలిన ఐదు అంతస్తుల్లో వాణిజ్య సముదాయం ఉంటుంది. ఇందులోనే 180 సీట్లతో ఒకటి, 130 సీట్లతో మరొకటి రెండు మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ప్రస్తుతం పార్కింగ్ టికెట్ ఇచ్చేచోట తప్ప ఇంకెక్కడా మానవ ప్రమేయం లేదు. పూర్తిగా రోబోటిక్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.
తిరిగి వెళ్లేటప్పుడు..
- వాహనదారులు తిరిగి వెళ్లేటప్పుడు పార్కింగ్ టికెట్ను టెర్మినల్ గేటు వద్ద కార్డ్ రీడర్కు చూపగానే ట్రాన్స్పోర్టర్ షటిల్ ఆటోమేటిక్గా కారును తీసుకొచ్చి అందజేస్తుంది. కారును రివర్స్ తిప్పాల్సిన అవసరం కూడా ఉండదు. పార్కింగ్ కోసం ఒక నిమిషం కంటే తక్కువ, తిరిగి పొందడానికి రెండు నిమిషాలు మాత్రమే పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
- 200 వరకు ద్విచక్ర వాహనాలను కూడా నిలపవచ్చని అని మెట్రో అధికారులు చెప్పినా.. వీటి పార్కింగ్కు తగిన స్థలం కేటాయించలేదు. ద్విచక్ర వాహనాలను పరిమితంగానే పార్కింగ్ చేసే అవకాశం ఉంది. వీటికి గంటకు రూ.10 ఛార్జ్ చేస్తున్నారు.

బేస్మెంట్-1లో వాహనాలు నిలిపేందుకు నాలుగు టెర్మినల్స్ ఏర్పాటు చేశారు. భవనం ప్రారంభంలోనే బయటి నుంచి బేస్మెంట్-1లోకి వెళ్లే దారి ఉంటుంది. అక్కడి గేట్లు సెన్సర్తో పనిచేస్తాయి. వాహనం రాగానే ఆటోమేటిక్గా తెరచుకుంటాయి. ఇక్కడే పార్కింగ్ టికెట్ తీసుకోవచ్చు. కారుకు గంటకు రూ.30 ఛార్జ్ చేస్తున్నారు.

టెర్మినల్ గేటు తెరుచుకోగానే ఎంట్రీ బేలోని రౌండ్ టేబుల్పై కారును పార్క్ చేసి హ్యాండ్లాక్ వేసి డ్రైవర్ బయటికి వచ్చేయాలి. తర్వాత బయటివైపు గేటు మూసుకుని, లోపలి వైపు గేటు తెర్చుకుంటుంది.

అప్పుడు రోబోటిక్ ట్రాన్స్పోర్టర్ షటిల్ కారు వద్దకు వచ్చి చక్రాలను లాక్ చేస్తుంది. వాహనాన్ని లిఫ్ట్ ద్వారా నిర్ణీత అంతస్తుకు తీసుకెళ్లి ఖాళీగా ఉన్న స్థలంలో పార్క్ చేస్తుంది.

ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నది వాహన లిఫ్ట్. అటూ ఇటూ కనిపిస్తున్నవి పార్కింగ్ చేసే ప్లాట్ఫారాలు
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్టాండింగ్లోనే.. సిట్.. ముందుకు కదలని బెట్టింగ్ యాప్ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- సినీనటుడు మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు, మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్లర్ మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్సీ ఆఫీసర్స్ మెస్లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు.
- హంగ్లో అదృష్ట హస్తం ఛైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.