UPI: అరె... పేమెంట్‌ పూర్తయ్యిందే!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 20 Dec 2025 19:22 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఫోన్‌పే ఉందా? గూగుల్‌పే.. లేదా పేటీఎం చేయొచ్చా? టీ డబ్బులైనా.. టీవీ బిల్లైనా.. విలువ ఎంతైనా చెల్లింపుల సమయంలో అడిగే ప్రశ్నలివి. నగదు బదిలీలే కాక ఈ యూపీఐ యాప్‌ల్లో అనేక ఫీచర్లున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..

  • చిన్న మొత్తంలో చేసే చెల్లింపులకు ‘యూపీఐ లైట్‌’ అనే ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది.
  • దీంట్లో రూ.5, రూ.10లకు పిన్‌ ఎంటర్‌ చేయకుండానే డబ్బు చెల్లించే వెసులుబాటు ఉంది. 
  • దీనికోసం యూపీఐ లైట్‌ అనే ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. 
  • అనంతరం అందులోకి మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు బదిలీచేయాలి.
  • చెల్లింపుల సమయంలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే యూపీఐ ఐడీలతో పాటు యూపీఐ లైట్‌ కూడా చూపిస్తుంది. 
  • అప్పుడు దీన్నీ ఎంపిక చేసుకుంటే పిన్‌ ఎంటర్‌ చేయకుండానే పేమెంట్‌ పూర్తవుతుంది.

  • చెల్లింపులు చేసేటప్పుడు ఫోన్‌ లాక్‌ తీసి, యాప్‌ను అన్‌లాక్‌ చేసి.. స్కానర్‌ ఓపెన్‌ చేయాల్సిన అవసరం లేదు.
  • ఫోన్‌ను షేక్‌ చేస్తే చాలు.. వెంటనే స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది.
  • దీనికోసం ఫోన్‌పేలోకి వెళ్లి ‘షేక్‌ టు స్కాన్‌’ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.
  • చెల్లింపులు త్వరగా పూర్తయ్యేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

  • బిల్లు కట్టేటప్పుడు మన ప్రమేయం లేకుండానే గడువు తీరేలోగా చెల్లింపులు చేసేందుకు ఆటోపేను వాడుకోవచ్చు.
  • దీనిద్వారా వివిధ ఓటీటీ చందాలు, బీమా, విద్యుత్తు బిల్లులు వంటివి సకాలంలో చెల్లించవచ్చు.
  • దీనికోసం ఆటోపే ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకొని సంబంధిత బిల్లర్‌ లేదా సేవను ఎంచుకోవాలి.
  • అనంతరం చెల్లింపులు జరిగే ఖాతాను దీనికి అనుసంధానం చేయాలి. దీనికోసం యూపీఐ పిన్‌ను ఎంటర్‌ చేస్తే సరిపోతుంది.
  • మీరు యాడ్‌ చేసిన బిల్లు జారీ కాగానే సంబంధిత ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్‌ అవుతుంది.
  • అవసరం లేని సందర్భాల్లో ఈ ఫీచర్‌ను డిజేబుల్‌ కూడా  చేసుకోవచ్చు.

  • ఈ యాప్‌ల్లో ఉండే మరో ఉపయోగకరమైన ఫీచర్‌.. స్ల్పిట్‌ ఎక్స్‌పెన్సెస్‌. 
  • దీని ద్వారా బృందంలో చేసే ఖర్చులను విభజించుకుని.. మన వాటాగా వచ్చే మొత్తాన్ని బిల్లు చెల్లించిన వ్యక్తికి పంపొచ్చు. 
  • ఉదా.. మీరు స్నేహితులతో కలసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు బిల్లు రూ.2,000 వచ్చిందనుకోండి. ఈ మొత్తాన్ని తొలుత ఒక్కరే చెల్లించి తర్వాత.. స్ల్పిట్‌ ఎక్స్‌పెన్సెస్‌ అన్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 
  • దీనికోసం ఆ బృందంలో ఉన్న వారందరితో ఫోన్‌పేలోనే గ్రూప్‌ క్రియేట్‌ చేసుకోవాలి. 
  • ఈ బిల్లును ఎంతమంది మధ్య విభజించాలో యాప్‌లోనే అడుగుతుంది. 
  • ఇది పూర్తయిన తర్వాత చెల్లించాల్సిన డబ్బు ఆ గ్రూప్‌లోని ఒక్కొక్కరికి సందేశం వెళుతుంది.
  • వారు తిరిగి బదిలీ చేసిన మొత్తం పేమెంట్‌ చేసిన వ్యక్తి యూపీఐ ఖాతాకు క్రెడిట్‌ అవుతుంది.

  • షాపింగ్‌ చేయడానికి వెళ్లి ఇంట్లో పర్సు మర్చిపోయినా, డెబిట్, క్రెడిట్‌ కార్డులు వెంట తీసుకెళ్లకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. 
  • యూపీఐ యాప్‌ నుంచి కార్డును ఎంపిక చేసుకుని చెల్లింపులు చేసేయొచ్చు.
  • దీనికోసం గూగుల్‌ పే లోని ‘ట్యాప్‌ అండ్‌ పే’ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోని కార్డులను దీనికి అనుసంధానం చేసుకోవాలి.
  • ఇందుకు ‘యాడ్‌ కార్డ్‌’ అన్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • దీన్ని ఉపయోగించుకోవాలంటే... ఫోన్‌లో నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌(ఎన్‌ఎఫ్‌సీ)ను ఎనేబుల్‌ చేసుకోవాలి.
  • అవసరమైనప్పుడు యాప్‌ ఓపెన్‌ చేసి.. చెల్లింపులు చేయాల్సిన కార్డుపై క్లిక్‌ చేయాలి. 
  • అనంతరం ఫోన్‌ను పీఓఎస్‌ యంత్రం దగ్గరకు తీసుకొస్తే చెల్లింపు పూర్తవుతుంది.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 19:21 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
  • విలేజ్‌ టు విరాట్‌ మీరు క్రికెట్‌ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ‘విలేజ్‌ టు విరాట్‌’ ట్యాగ్‌తో ‘రూరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
  • ‘ఆరెంజ్‌ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్‌ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్‌ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఇందుకోసం జూన్‌ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
  • పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
  • వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్‌ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
  • వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
  • నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
  • శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
  • తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్‌ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
  • 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.
  • అమరావతిలో క్యాట్‌ శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ సర్క్యూట్‌(క్యాట్‌) శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
  • బిల్‌గేట్స్‌ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
  • 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
  • అమర్‌నాథ్‌ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
  • ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్‌’లో బిల్‌గేట్స్‌ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.
  • మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
  • అసెంబ్లీలో పని చేయని మైక్‌ సిస్టమ్‌ అసెంబ్లీలో మంగళవారం మైక్‌ సిస్టమ్‌ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
  • ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్‌ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్‌ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
  • వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.