Train Accident: ఏనుగులను ఢీకొన్న రైలు.. పట్టాలు తప్పిన 5 బోగీలు

Eenadu icon
By National News Team Updated : 20 Dec 2025 19:59 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Train Hits Elephants in Assam | గువాహటి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో శనివారం రైలు ప్రమాదం జరిగింది. సైరాంగ్‌ నుంచి న్యూదిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (Rajdhani Express) హొజాయ్‌ జిల్లాలో ఏనుగుల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో కొన్ని ఏనుగులు మృతిచెందగా.. ప్రమాదం ధాటికి రైలు బోగీలు పట్టాలు తప్పాయి.

రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పినట్లు నార్త్‌ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం (Train Accident in Assam) జరగలేదని తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో ఏడు ఏనుగులు మృతి చెందగా.. మరో ఏనుగు గాయపడింది. రైల్వే, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

  • స్పైస్‌జెట్‌ ప్రయాణికుడిపై.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పైలట్‌ దాడి..!

ప్రమాదం కారణంగా ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతం ఎలిఫెంట్‌ కారిడార్‌ కాదని రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలపై ఏనుగుల మందను చూడగానే లోకో పైలట్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని, అయినప్పటికీ ప్రమాదం జరిగిందని వివరించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు.


► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:55 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/02/2026)  ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
  • ఏప్రిల్‌లో బెంగాల్‌, తమిళనాడు ఎన్నికలు..! బెంగాల్‌, తమిళనాడు సహా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్‌ కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. 
  • వాష్‌రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాలు.. కన్నడ నటి వీడియో రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్‌ Kannada actress:  ఒక కన్నడ నటికి చేదు అనుభవం ఎదురైంది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ వీడియోతో తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ ఆమె ఆరోపించారు.