పైసా పెట్టారు.. పదవి పట్టారు

- A
- A+
- A++

ఈనాడు, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి: సర్పంచి... ఒకప్పుడు గ్రామంలో పలుకుబడి ఉండి ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వారికి అందే గొప్ప పదవి. కాలక్రమేణా ఈ ప్రథమ పౌరుడి కుర్చీ కాసులతో వచ్చిన వారికి అందుతోంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లోనూ చాలాచోట్ల స్థిరాస్తి, ఇసుక వ్యాపారులు ఓటర్లను ప్రలోభపెట్టి ఈ పదవి అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటివెన్నెన్నో..!
- ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు వేల పైచిలుకు ఓటర్లున్న గ్రామంలో గత రెండు పర్యాయాలు పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థికి ప్రజల్లో సానుభూతి ఉంది. ఈ సారి గెలుపు ఖాయమని ఊరంతా భావించారు. ముగ్గురు పోటీ చేస్తున్న ఆ గ్రామంలో అసలు గెలుస్తాడని నమ్మకం లేని వ్యక్తి అనూహ్యంగా విజయం సాధించారు. స్థిరాస్తి వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించిన అతను పోలింగ్ ముందురోజు రాత్రి ఓటుకింత ధరను నిర్ణయించి ఫలితాన్ని తనకనుకూలంగా మార్చేసుకున్నారని గ్రామంలో ప్రచారం జరుగుతోంది.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా పరీవాహక ప్రాంతాలకు ఆనుకుని ఉన్న కొన్నిగ్రామాల్లో ఇసుక వ్యాపారులే సర్పంచులుగా గెలిచారు. గతంలో పనిచేసిన సర్పంచులు ఇక్కడి వ్యాపారాన్ని తమ ఆదాయ వనరుగా మార్చుకొని కోటీశ్వరులయ్యారు. ఈ సారి అదే కోవలో కొందరు ఇసుక వ్యాపారులు తమ అక్రమ దందాకు ఈ పదవి అండగా నిలబడుతుందని రంగంలోకి దిగారు. దండిగా డబ్బులు ఖర్చు చేసి పీఠాన్ని దక్కించుకున్నారు.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ గోదావరి, మానేరు పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో ఇసుక వ్యాపారంలో రాణించి డబ్బులు కూడగట్టుకున్నవారే సర్పంచులుగా పోటీ చేశారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడమే కాకుండా ఏకగ్రీవాలైన కొన్ని ఊళ్లల్లో వేలం ద్వారా సర్పంచి సీటును కొనుగోలు చేశారని స్థానికులు చెబుతున్నారు.
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ కొన్ని గ్రామాల్లో గెలిచేందుకు ఒక్కో వ్యాపారి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేశారు. ఆర్మూర్ డివిజన్లోని కొన్ని పెద్ద పంచాయతీల్లో ఓటుకు రూ.3 వేల వరకు వెచ్చించారు. నందిపేట, బాల్కొండ మండలాల్లో వ్యాపారులే కొన్ని పల్లెల్లో గెలిచారు.
తిరస్కరించినోళ్లూ ఉన్నారు!
కేవలం డబ్బుంటే సరిపోదు. గ్రామ ప్రజలకు సేవ చేస్తారనే భరోసా ఉండాలనే విధంగానూ కొన్ని పంచాయతీల్లో ఓటర్లు తీర్పునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2,400 ఓటర్లున్న ఓ గ్రామంలో ఆర్థికంగా బలవంతుడు కానప్పటికీ ఓ యువకునికి పట్టం కట్టారు. ఇక్కడ ప్రత్యర్థులు విరివిగా ఖర్చుచేసినప్పటికీ ఫలితం దక్కలేదు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్టాండింగ్లోనే.. సిట్.. ముందుకు కదలని బెట్టింగ్ యాప్ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- సినీనటుడు మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు, మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్లర్ మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్సీ ఆఫీసర్స్ మెస్లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు.
- హంగ్లో అదృష్ట హస్తం ఛైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.