

Andhra News: రాష్ట్ర సొంత రాబడి రూ.67,235 కోట్లు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
రాష్ట్ర సొంత రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు 10 వరకు రూ.67,235 కోట్లుగా నమోదైంది. లక్ష్యం రూ.1,34,208 కోట్లలో ఎనిమిది నెలల కాలానికి దాదాపు సగం సాధించినట్లయింది. ప్రస్తుతం డిసెంబరు నెల చివరికి వచ్చింది. ఈ నెల పూర్తయితే మూడు త్రైమాసికాలు ముగిసినట్లే. జనవరి నుంచి మార్చి వరకు చివరి త్రైమాసికంలో సొంత రాబడులు పెరిగేలా చూడాలని ఆర్థిక శాఖ అధికారులు జిల్లా యంత్రాంగాలకు నిర్దేశిస్తున్నారు. ఏ జిల్లాలో ఏ విభాగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది.. గతంలో ఎంత ఉంది.. ఎక్కడ నుంచి అధిక ఆదాయం రాబట్టే ఆస్కారం ఉంది.. అనే అంశాలను ఆర్థిక శాఖ అధికారులు కలెక్టర్లకు అందుబాటులో ఉంచారు. ఆర్థిక సంవత్సరంలో ప్రతి మూడు నెలలను ఒక సమీక్షగా తీసుకుంటారు. మొత్తం నాలుగు త్రైమాసికాలుగా విశ్లేషిస్తారు. తొలి రెండు త్రైమాసికాల్లో రాష్ట్ర రాబడి కిందటి ఏడాది కన్నా అధికంగానే ఉందని పేర్కొంటున్నారు. నవంబరులో జీఎస్టీ 2.0 ప్రభావం కొంతమేర పడి ఆ వసూళ్లలో 2% మేర తగ్గుదల కనిపించింది. డిసెంబరు ప్రారంభం వరకు ఉన్న లెక్కల ప్రకారం.. గనులు, భూగర్భ వనరులు మినహా మిగిలిన అన్ని శాఖల నుంచి రాబడి ఆశించినట్లుగా ఉందని విశ్లేషించారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆశించిన దానికన్నా ఎక్కువ ఉంది. నవంబరు నెలాఖరు వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం లక్ష్యంతో పోలిస్తే 110% మేర రాబడులు సాధ్యమయ్యాయి.
రిజిస్ట్రేషన్ల రాబడి భేష్
రిజిస్ట్రేషన్ల రాబడి లక్ష్యం కన్నా అధికంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబరు నెలాఖరు వరకు రూ.6,508.16 కోట్లు లక్ష్యం కాగా రూ.7,194.33 కోట్లు సాధించింది. కిందటి ఏడాది ఇదే సమయానికి అది రూ.5,465.79 కోట్లు మాత్రమే. మొత్తంగా 31.62% ఆదాయం కిందటి ఏడాది కన్నా అధికంగా లభించింది.
- రవాణా రంగంలో నవంబరు నెలాఖరు వరకు రూ.3,197.61 కోట్ల రాబడి దక్కింది. కిందటి ఏడాది ఇదే సమయానికి రూ.3,060.49 కోట్లే. అదనంగా 4.48% మేర సాధించారు.
- అటవీ శాఖ నుంచి అధిక ఆదాయం ఆశించినా వచ్చింది స్వల్పమే.. రూ.400 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం కాగా, కేవలం రూ.38.628 కోట్లు మాత్రమే దక్కింది. ఎర్రచందనం వేలం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం ఆశించినా.. అందుకు వీలు చిక్కలేదు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడి లక్ష్యం: 1,34,208 కోట్లు
ప్రస్తుతం సాధించింది: 67,235 కోట్లు
ఇంకా సాధించాల్సింది: 66,973 కోట్లు
2024-25 డిసెంబరు 10 వరకు వచ్చింది: 64,688 కోట్లు
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 06:29 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
- విలేజ్ టు విరాట్ మీరు క్రికెట్ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ‘విలేజ్ టు విరాట్’ ట్యాగ్తో ‘రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
- ‘ఆరెంజ్ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇందుకోసం జూన్ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
- పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
- వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
- వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
- నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
- శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
- తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
- 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి, ఐఆర్ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎన్.ప్రసాద్ డిమాండ్ చేశారు.
- అమరావతిలో క్యాట్ శాశ్వత బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సర్క్యూట్(క్యాట్) శాశ్వత బెంచ్ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
- బిల్గేట్స్ పర్యటన.. సీఎం విజన్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్గేట్స్ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
- 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
- అమర్నాథ్ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్లో కలిసేందుకు ఇష్టపడలేదు.
- ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్’లో బిల్గేట్స్ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్గేట్స్ పేర్కొన్నారు.
- మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
- అసెంబ్లీలో పని చేయని మైక్ సిస్టమ్ అసెంబ్లీలో మంగళవారం మైక్ సిస్టమ్ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
- ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
- వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.