
గుట్టుగా కొని.. సరిహద్దు దాటించి

- A
- A+
- A++
రాష్ట్రం, ప్రదేశాలు, పరిస్థితులను బట్టి కొన్ని వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. వంటగ్యాస్ ఇదే కోవలోకి వస్తుంది. నిత్యావసరమైన గ్యాస్ ధరలు మన ప్రాంతంతో పోలిస్తే మహారాష్ట్రలో తక్కువగా ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు గుట్టుగా గ్యాస్ సిలిండర్లను సరిహద్దు దాటిస్తున్నారు.
అక్కడి వారి సహకారంతో..
జిల్లాకు చెందిన కొందరు దళార్లు పొరుగు రాష్ట్రంలోని నాందేడ్, ధర్మాబాద్ ప్రాంతాల గ్యాస్ డీలర్ల సహకారంతో ఈ తంతు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మన ప్రాంతంలోని ఖాళీ సిలిండర్లను అక్కడకు తీసుకెళ్లి వారివద్ద సిలిండర్లు తీసుకుంటున్నారు. మన ప్రాంతంతో పోలిస్తే అక్కడ గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.51 వరకు తక్కువ కాగా, వాణిజ్య సిలిండర్ ధర రూ.170 వరకు తక్కువగా లభ్యమవుతోంది. అక్కడ పెద్దమొత్తంలో సిలిండర్లను కొనుగోలు చేస్తూ స్థానికంగా ఎక్కువ ధరతో విక్రయిస్తున్నారు.
- తానూరు, కుభీరు, కుంటాల, సారంగాపూర్ మండలాల పరిధిలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలున్నాయి. వీటిలో ప్రధాన రహదారులే కాకుండా అంతర్గతంగా ఉండే అనువైన ప్రాంతాల నుంచి సిలిండర్లను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
- ఎక్కువ వ్యాపారం జరిగే హోటళ్లను సైతం తమ విక్రయకేంద్రాలుగా మార్చుకుంటున్నారు.
వాహనాల్లోనూ..
గ్యాస్ సిలిండర్లతో నడిచే వాహనాల వినియోగమూ ఎక్కువగానే ఉంది. ఎల్పీజీ ఫిల్లింగ్ కేంద్రాలతో పోలిస్తే నేరుగా సిలిండర్ నుంచి గ్యాస్ నింపుకోవడం ఖర్చు తక్కువవుతుంది. అద్దెకార్లు తిప్పేవారు ఎక్కువగా ఇలా రాయితీపై వచ్చే సిలిండర్లను తమ అవసరాలకు వాడుతున్నారు.
ప్రధానంగా 14.2 కిలోలు, 19 కిలోల సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. సగటున రోజుకు 80 వరకు గృహావసర సిలిండర్లు, 40 వరకు వాణిజ్య సిలిండర్లు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన రోజుకు రూ. 10,800, నెలకు రూ. 3.24 లక్షలు చొప్పున వారికి గిట్టుబాటవుతోంది. ఇందులో రవాణా, ఇతరత్రా ఖర్చులు పోయినా రూ. 2 లక్షలకు పైగానే వెనకేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
సరిహద్దు ప్రాంతాల్లో గతంలో ఉన్న తనిఖీ కేంద్రాల ఎత్తివేత కూడా వీరికి కలిసొచ్చినట్లయ్యింది. అడిగేవారు, ఆపేవారు లేకపోవడంతో చాలా సులభంగా సరిహద్దు దాటిస్తున్నారు. పరిశీలించి చూస్తే తప్ప వేబిల్లు, పన్ను చెల్లింపుల వ్యవహారం గుర్తించడం కష్టం.
► Read latest Adilabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కష్టాలు [ 19-02-2026] కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇసుక లభించక ఇబ్బంది పడుతున్నారు. గతంలో వాగులనుంచి ఇసుక తీస్తే అటవీశాఖ అధికారులు వాహనాలను సీజ్ చేసేవారు.
- భారాస నుంచి కాపాడేందుకే మద్దతిచ్చా [ 19-02-2026] కాగజ్నగర్ మున్సిపాలిటీ భారాస కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా కాపాడేందుకే తాను ఛైర్పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్కు మద్దతిచ్చానని.. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పేర్కొన్నారు.
- విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు [ 19-02-2026] విమానాశ్రయం మాస్టర్ ప్లాన్కు అనుమతి వచ్చిందని, త్వరలో భూసేకరణ ప్రారంభమవుతుందని, ఇది జిల్లా ప్రజలకు శుభవార్త అని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు.
- దిగుబడి గగనం.. ప్రాణాలే పణం! [ 19-02-2026] ప్రకృతి అన్నదాతలను అతలాకుతలం చేస్తోంది.. అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి.. గత వానాకాలంలో అధిక వర్షాల కారణంగా పత్తిలో పూత, కాత రాలిపోయి దిగుబడులు తగ్గడంతో రైతులు నష్టపోయారు.. గిట్టుబాటు ధరలు కూడా లేకపోవడంతో అప్పులు భారంగా మారుతున్నాయి.
- అదే అలజడి.. తగ్గని వేడి [ 19-02-2026] క్యాతనపల్లి బల్దియా పాలకవర్గం ఎన్నికలో ఆది నుంచి అడ్డంకులు, ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లాలో మిగతా పురపాలికల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరగగా క్యాతనపల్లిలో మాత్రం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
- ఊరుకో కన్నా.. అమ్మ పాఠాలు వింటోంది [ 19-02-2026] నూతనంగా ఎన్నికైన సర్పంచులకు పాలనలో మెలకువలపై అవగాహన పెంచేందుకు స్థానిక ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కొంతమంది తమ చంటి పిల్లలతో శిక్షణకు హాజరయ్యారు.
- మహాలక్ష్మీ.. సొమ్ము భద్రం [ 19-02-2026] బస్సులో సీటు దొరక్కపోతే గమ్యస్థానం వచ్చేవరకు నిలబడే వెళ్లాలి. ఆ ఇబ్బందికన్నా ఎలాగోలా కష్టపడి ఖాళీసీటు దొరికించుకోవాలనే ఆత్రం ప్రయాణికులది. అందుకే.. రద్దీలో ఉన్నా, తోపుళ్లు జరుగుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా బస్సెక్కి సీటులో కూర్చోవడమే లక్ష్యమన్నట్లుగా ఆరాటపడుతుంటారు.
- మార్చి 9న పెళ్లి.. అంతలోనే విషాదం [ 19-02-2026] పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దామనుకున్న తల్లిదండ్రుల గుండె పగిలింది.. ప్రమాదం రూపంలో యువకుడిని బలి తీసుకోవడంతో అందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు..
- దైవ దర్శనానికి వెళ్తూ... తిరిగిరాని లోకాలకు [ 19-02-2026] భార్యాభర్తలు కలిసి వేలాల మల్లన్న సన్నిధికి బయలుదేరారు. కొద్ది నిమిషాల్లో గమ్యం చేరే సమయానికి లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కానరాని లోకాలకు తీసుకెళ్లిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని ఖాసింపల్లి పైవంతెన వద్ద చోటు చేసుకుంది.