Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/12/2025)

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మేషం
ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బద్ధకించకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మేలు చేకూరుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. ఆర్థిక వ్యవహారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ సందర్శనం శుభప్రదం.
వృషభం
లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో కాలం కలిసి వస్తుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్య ఆరాధన శుభప్రదం.
మిథునం
వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. సూర్య,కుజ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి.
కర్కాటకం
ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. ఉద్యోగ,వ్యాపారాల్లో చక్కటి శుభఫలితాలు కనిపిస్తున్నాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. దుర్గాదేవి నామస్మరణ శుభప్రదం.
సింహం
కాలం మిశ్రమంగా ఉంది. శ్రమతో కూడిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. కుటుంబ వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. దుర్గాస్తోత్రం చదవాలి.
కన్య
మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి, కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి, దానికి తగ్గట్టుగా కృషి చేయండి. సూర్యధ్యానం శుభప్రదం.
తుల
వృత్తి, ఉద్యోగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. సకారాత్మక ఆలోచనలతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రారంభించిన పనిలో విజయం వరిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి నుంచి సాయం అందుతుంది. శివారాధన శుభప్రదం.
వృశ్చికం
కాలం శుభప్రదంగా ఉంది. ఏ పని చేసిన త్వరగా పూర్తవుతుంది. సమాజంలో పేరుప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్నది దక్కుతుంది. ఒక సంఘటన మీ మానసిక శక్తిని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాలు మేలు చేస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. మీరు చేసే పనిలో దైవబలం సదా రక్షిస్తోంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కీలక సందర్భాల్లో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
మకరం
గ్రహబలం తక్కువగా ఉంది. ఏ పని తలపెట్టినా అందులో నిబద్ధత పట్టుదల అవసరం. పనుల ఆలస్యం జరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఏకాగ్రతతో పనులు పూర్తి చేయండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణ మంచిది.
కుంభం
శుభాలు చేకూరుతాయి. మనోధైర్యం సర్వ ప్రధానం. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం మేలు చేస్తుంది. పట్టుదలతో పనిచేసి సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సూచనలు మేలు చేస్తాయి. నవగ్రహ ఆరాధన శ్రేయస్సును ఇస్తుంది.
మీనం
ఆత్మవిశ్వాసం సదా రక్షిస్తోంది. ఉద్యోగంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఈశ్వరధ్యానం శుభప్రదం.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కమల్హాసన్ ‘ఎంఎన్ఎం’ పార్టీకి టార్చిలైట్ గుర్తు కమల్హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి ఎన్నికల సంఘం టార్చిలైట్ గుర్తును కేటాయించింది.
- ‘ఎంతసేపు చదివామన్నది కాదు’: జేఈఈ మెయిన్ టాపర్ కబీర్ చిల్లర్ జేఈఈ మెయిన్లో 300కు 300 స్కోర్ తెచ్చుకొన్న హరియాణాకు చెందిన 17 ఏళ్ల కబీర్ స్థానిక మీడియాతో మాట్లాడారు. జేఈఈలో మంచి మార్కులు సాధించడానికి ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే విషయంపై తోటి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
- డియర్ ఫ్రెండ్.. ముంబయిలో కలుద్దాం: మెక్రాన్కు ప్రధాని మోదీ స్వాగతం Emmanuel Macron India Visit: భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ను ప్రధాని మోదీ స్వాగతించారు.
- ప్రియురాలి ప్రాణం తీసి.. ఆపై తాంత్రిక పూజలు చేసి..! ఇటీవల ఇందౌర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎంబీఏ విద్యార్థిని కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- మేక పాలతో సబ్బులు మేకపాలతో సబ్బులు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందుతున్నారు.
- ఈ శివలింగం పెరుగుతోంది.. జరుగుతోంది! బిహార్లోని నిరంజన నదిలో ఉన్న శివలింగం ఏటా అత్యంత స్వల్పంగా పెరుగుతోందని.. కదులుతోందని స్థానికులు చెబుతున్నారు.
- నేను రాహుల్వాదిని కాదు.. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
- కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ కట్టుకథే ఓ ట్రక్కులో హవాలా సొమ్ము తరలిస్తుండగా రూ.400 కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్ చేసిన ఫిర్యాదు బోగస్ అని తేలింది.
- ఏఐ ప్రయాణంలో ముందున్నాం కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026, సమిట్లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
- తొలి దఫా బోర్డు పరీక్షలకు ‘పది’ విద్యార్థుల హాజరు తప్పనిసరి పదో తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటి దఫా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్పష్టం చేసింది.
- పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.
- ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘పరిశ్రమ’ నిర్వచనం వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
- 25-26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో రెండ్రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు.
- దేశంలోనే అత్యంత పొడవైన తొండ మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో దేశంలోనే అత్యంత పొడవైన తొండ(ఇగ్వానా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- ముచ్చటగా మూడోసారి.. ఐఏఎస్తోనే మనువు మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ తన పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
- సంక్షిప్తవార్తలు (3) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ మంగళవారం భారత్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో ఆయనతో సమావేశం అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు.. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మీకు ఉన్న అన్ని రకాల వ్యాధులను నిజాయతీగా వెల్లడించండి.
- ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి త్రిష ఇంటి నుంచి నటుడు విజయ్ బయటకు రావాలంటూ భాజపా తమిళనాడు అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభా పక్షనేత నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను నటి త్రిష ఖండించారు.
- వేలాడే తీగల మార్గమే దిక్కు! ఉత్తరాఖండ్లోని ఘరూధి, మాన్కోట్ గ్రామాలకు ఇంకా తీగల మార్గమే దిక్కుగా ఉంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు ఈ తీగల ద్వారా గోరి నదిని దాటాల్సిందే.
- ఒకే ఊళ్లో కాలేయ సంబంధిత వ్యాధులతో ఏడుగురి మృతి హరియాణాలోని పల్వల్ జిల్లాలోని ఛాయాంసా గ్రామంలో కాలేయ సంబంధిత వ్యాధులతో గత పదిహేను రోజుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు హెపటైటిస్ బి సోకి చనిపోయారని స్థానిక వైద్య యంత్రాంగం సోమవారం పేర్కొంది.