నాలుగో రోజూ రాణించిన సూచీలు.. IDBI షేర్లు 18% పైకి

- A
- A+
- A++

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగోరోజూ రాణించాయి. మెటల్, పీఎస్యూ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ సూచీలకు దన్నుగా నిలిచాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ రాత్రికి నిర్ణ్రం ప్రకటించనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 347.14 పాయింట్ల లాభంతో 77,155.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 96.55 పాయింట్ల లాభపడి 24,085.70 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, బీఈఎల్, ఎటర్నల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలు చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 94.52గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- టాటా మోటార్స్ పాసింజర్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఓ దశలో 10 శాతం మేర క్షీణించాయి. చివరికి 8.10 నష్టంతో రూ.361.70 వద్ద ముగిశాయి. టాటా గ్రూపునకు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ భవిష్యత్ వృద్ధి అంచనాలు, మేనేజ్మెంట్ కామెంటరీ టాటా మోటార్స్ షేర్లపై ప్రభావం చూపాయి.
- ఐడీబీఐ బ్యాంక్ షేర్లు నేడు దూసుకెళ్లాయి. ఓ దశలో 18శాతం వరకు లాభపడ్డాయి. వ్యూహాత్మక వాటాల విక్రయానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని, వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందన్న వార్తల నేపథ్యంలో షేర్లు రాణించాయి. చివరికి 16 శాతం లాభంతో రూ.89.60 వద్ద ముగిసింది.
గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఈ వారం ఐపీఓలు: 7 కంపెనీలు రూ.6400 కోట్లు Upcoming IPOs: దలాల్ స్ర్టీట్లో పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగుతోంది.
- హర్మూజ్ నేర్పిన పాఠం.. భారత్ ప్లాన్ బి! LPG Production: పశ్చిమాసియాలో ఏర్పడిన అలజడి మన వంట గదిపై ప్రభావం చూపింది. హర్మూజ్ మూసివేతతో వంట గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- ఏఐ ‘నాడి పట్టేస్తోంది’ దేశీయ వైద్య సేవల్లో కృత్రిమ మేధ (ఏఐ) పాత్ర పెరుగుతోంది. ఏఐ సాయంతో ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎక్కువ మంది రోగులను చూడగలుగుతున్నారని ఫిలిప్స్ నివేదిక తెలిపింది.
- పండగల వేళ ‘క్విక్’ కొలువులు.. దేశంలో రిటెయిల్ రంగాన్ని క్విక్ కామర్స్ (నిమిషాల్లో డెలివరీ) వేగంగా మార్చేస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఇప్పుడు ఇది కొత్త అలవాటుగానూ మారింది.
- అమెరికా సుంకాలతో సవాలే అమెరికా ఇటీవల విధించిన 10% అదనపు సుంకం కారణంగా భారత రత్నాభరణాల పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కోనుంది. సహజ వజ్రాల ఎగుమతులకు ఇది అడ్డంకిగా మారనుంది.
- మనదేశంలోనూ ఐఫోన్ 18 ప్రో సిరీస్ తయారీ అమెరికా టెక్ దిగ్గజ సంస్థ యాపిల్, ఈ ఏడాది విడుదల చేయనున్న ఐఫోన్ 18 సిరీస్లో ప్రీమియం మోడళ్లు ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఉత్పత్తిని మనదేశంలో ప్రారంభించింది.
- స్టాక్మార్కెట్లోకి విదేశీ మదుపర్ల ప్రవేశం డిజిటల్గా: సెబీ భారత సెక్యూరిటీ మార్కెట్లలోకి వ్యక్తిగత విదేశీ మదుపర్లు సులభంగా ప్రవేశించేలా చేయాలని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ భావిస్తోంది. ఇందుకోసం ఆన్బోర్డింగ్ ప్రక్రియను డిజిటల్ పద్ధతిలో పూర్తి చేయడానికి అనుమతించేందుకు ప్రతిపాదనలు చేసింది.
- చిన్న పన్ను చెల్లింపుదార్లకు విదేశీ ఆస్తుల వెల్లడి పథకం అమల్లోకి చిన్న పన్ను చెల్లింపుదార్లు 60 శాతం పన్ను చెల్లించి, తమ వెల్లడిచేయని కొన్ని విదేశీ ఆస్తులు, ఆదాయ వివరాలను ప్రకటించడానికి అనుమతించే ఒక కొత్త స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ఆదాయపు పన్ను విభాగం నోటిఫై చేసింది.
- టాటా సన్స్ ఏజీఎం ఈ వారం లేనట్లే మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన నియంత్రణ ఆంక్షల కారణంగా టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీలో కీలక వాటాదారు అయిన ‘సర్ రతన్ టాటా ట్రస్ట్’ తన ప్రతినిధిని నామినేట్ చేయలేకపోవడంతో, ఈ నెల 18న జరగాల్సిన టాటా సన్స్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నిర్వహించే అవకాశం లేదని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి.
- మార్చి కల్లా డాలర్ @ రూ.94 అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి బలపడుతుందని కోటక్ సెక్యూరిటీస్ కమొడిటి-కరెన్సీ రీసెర్చ్ విభాగాధిపతి అనైంద్య బెనర్జీ అంచనా వేస్తున్నారు.
- రూ.45,000 కోట్ల మూలధనం కోసం తమ రూ.45,000 కోట్ల మూలధన ప్రణాళిక అమలు కోసం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు జరుపుతోందని సీఈఓ అభిజిత్ కిశోర్ వెల్లడించారు.
- స్కార్పియో లైఫ్స్టైలర్ రూ.19.79 లక్షల్లోపే.. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో 2023 ఆగస్టులో ఒక కాన్సెప్ట్గా తొలిసారి ప్రదర్శించిన మహీంద్రా స్కార్పియో లైఫ్స్టైలర్ అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే విడుదల కానుంది.
- సంక్షిప్త వార్తలు (4) ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) రేపు(17న, సోమవారం) ప్రారంభమై 19న ముగియనుంది.
- ఆగస్టు 15 సందర్భంగా ₹5వేల నగదు ప్రోత్సాహం.. నిజమెంత? PIBFactCheck: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ.5 వేల నగదును ప్రోత్సాహకంగా అందిస్తున్నారని, ఇందుకోసం బ్యాంకు వివరాలు తెలపాలంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.
- తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (15/08/2026) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..
- ‘జూమ్’లోనే 900 మందిని తొలగించి.. చివరకు ‘సీఈవో’ సీటు కోల్పోయి! అమెరికాలో కొంతకాలం క్రితం జూమ్కాల్లో ఉండగానే 900 మంది ఉద్యోగులను తొలగించిన భారత సంతతి సీఈవో విశాల్ గార్గ్ తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే.
- 300 కోట్ల డౌన్లోడ్లను దాటిన అలీబాబా ఏఐ మోడల్స్.. మెటా, గూగుల్ వెనక్కి Alibaba Qwen AI: అలీబాబా గ్రూప్నకు చెందిన ఓపెన్ ఏఐ మోడల్స్ 300 కోట్లకు పైగా డౌన్లోడ్స్కు చేరాయి.
- వెల్లడించని విదేశీ ఆస్తుల కోసం 16 నుంచి వన్టైమ్ విండో! Income Tax: విదేశీ పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయ పన్ను (ఐటీ) శాఖ కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది.
- ఇంధన ఎగుమతులపై విండ్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గింపు.. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.
- టాటా సన్స్ ఛైర్మన్ రేసులో కుటుంబ సభ్యులూ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ఛైర్మన్ పదవి రేసులో.. టాటాల కుటుంబ సభ్యులతో పాటు గ్రూప్ కంపెనీల ఉన్నతాధికారుల పేర్లూ వినవస్తున్నాయి.