జులై 15 నుంచి బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్యం అమల్లోకి - ప్రధాని మోదీ

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జులై 15 నుంచి అమల్లోకి రానుందని ప్రధాని మోదీ ( PM Modi) వెల్లడించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ఈ ఒప్పందం ఎంతో ఊపునిస్తుందన్నారు. ముఖ్యంగా భారతీయ కార్మికులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుందన్నారు. జీ7 సదస్సులో భాగంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో భేటీ అయినట్లు పేర్కొన్న మోదీ.. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు మెరుగుపడుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయనతో కలిసి ఉన్న ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేసుకున్నారు.
మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్లు కూడా పాల్గొన్నారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- యూఎస్లో భారత స్వాతంత్ర్య వేడుకలు.. గిన్నిస్ రికార్డు నమోదు అమెరికాలోని న్యూయార్క్ ట్రై-స్టేట్ ప్రాంతంలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గిన్నిస్ ప్రపంచ రికార్డు నమోదైంది. న్యూజెర్సీలోని పార్సిప్పనీ వెటరన్స్ మెమోరియల్ పార్క్లో 1300కు పైగా అమెరికా జెండాలను భారత త్రివర్ణ పతాకాల మధ్య అమర్చి ‘‘250’’ ఆకారాన్ని ఏర్పాటు చేశారు.
- లింకన్ పోయి... వాషింగ్టన్ వచ్చె... ఇరాన్పై డొనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న సుదీర్ఘ యుద్ధం అమెరికాకు సంక్లిష్ట పరిస్థితిని కలిగిస్తోంది.
- మిషిగన్లో కాల్పులు.. ఆరుగురి మృతి అమెరికాలోని మిషిగన్లో శుక్రవారం చోటుచేసుకున్న కాల్పుల్లో ఐదుగురు మరణించారు. డెట్రాయిట్కు 270 కిలోమీటర్ల దూరంలోని మిస్సాకీ కౌంటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- ఇండోనేసియాలో భారీ భూకంపం ఇండోనేసియా తీరానికి సమీపంలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. 47 మంది మృతి చెందారు.
- ఇజ్రాయెల్ దాడులు.. లెబనాన్లో 11 మంది మృతి దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పిల్లలు సహా ఏడుగురు ఒకే ఇంట్లో మృతి చెందారు.
- 4శాతం హిందువులను భరిస్తున్నాం! తమ దేశంలో హిందువులు 4శాతంగా ఉన్నారని, వారందరినీ తమ దేశం భరిస్తోందంటూ పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ వ్యాఖ్యానించారు.
- యుద్ధ నౌకలతో హర్మూజ్ను స్వాధీనం చేసుకోలేరు: ట్రంప్నకు ఇరాన్ కౌంటర్ హర్మూజ్ జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని.. దానిని ఎవరూ ఆక్రమించుకోలేరని ఇరాన్ పేర్కొంది.
- భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం: మార్కో రూబియో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
- యూఏఈ నుంచి ఇరాన్కు రహస్యంగా... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తన దేశ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను భారీ మొత్తంలో విడుదల చేసినట్లు సమాచారం.
- భారత్, పాక్ ప్రజల మధ్య... పరస్పర అపనమ్మకం ఎక్కువే భారతీయులు, పాకిస్థానీలలో అత్యధికులు ఒకరినొకరు అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇది రెండు పొరుగు దేశాల మధ్య లోతుగా వేళ్లూనుకున్న అపనమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని అమెరికన్ సంస్థ ప్యూ రిసెర్చ్ సర్వే వెల్లడించింది.
- ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్ బ్రిటన్పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్గా ఆ దేశాన్ని సంబోధించారు. అంతేగాకుండా ‘‘ప్రపంచంలో అణ్వస్త్రాలున్న తొలి ఇస్లామిక్ రిపబ్లిక్గా’’గా అభివర్ణించారు.
- ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ ఇండోనేసియాలో (Indonesia) శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) సంభవించింది.
- నేపాల్కు ‘అగ్నిపథ్’ సెగలు... గూర్ఖా సైనికుల ఆందోళన దేనికి..? Nepal Gorkha soldiers: జెన్-జీ ఆందోళనలతో ఏకంగా అధికార పీఠమే కదిలిన నేపాల్కు ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది. పొఖారాలో గత కొద్ది రోజులుగా మాజీ గూర్ఖా సైనికులతో పాటు పెద్ద ఎత్తున యువత నిరసనలు చేస్తున్నారు.
- భార్యకు ప్రేమతో.. 200 ఎకరాలను పూలతోటగా మార్చి..! Hollyhock Garden: తన భార్య జ్ఞాపకాలను కళ్లముందు నిలిపాడో భర్త. ఆమె ఇష్టపడిందని దాదాపు 200 ఎకరాల్లో ఏకంగా ఓ పూలతోటనే నిర్మించాడు.