ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఐఎస్వో గుర్తింపు

- A
- A+
- A++

ఈనాడు డిజిటల్, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా నాలుగు విభాగాల్లో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్ఓ) గుర్తింపు ఇచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఐఎస్వో ధ్రువపత్రాల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ ప్రాంత భారతీయ ప్రమాణాల సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సందీప్ కుమార్ కనోజియా ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్కు ఐఎస్వో ధ్రువపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగానికి (ఐఎస్వో 21001:2018), ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్కు (ఐఎస్వో 14001:2015), ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్కు (ఐఎస్వో 50001:2018), ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగంలో (ఐఎస్వో 22000:2018) ఓయూ గుర్తింపు దక్కించుకుందని తెలిపారు. దేశంలోనే నాలుగు విభాగాల్లో బీఐఎస్ (ఐఎస్ఓ) సాధించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా ఉస్మానియా నిలిచిందని తెలిపారు. బీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సందీప్ కుమార్ కనోజియా మాట్లాడుతూ నాలుగు ఐఎస్వో ధ్రువపత్రాలను ఒకే సందర్భంలో సాధించడం విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.నరేష్రెడ్డి, ఓయూ అంతర్గత నాణ్యతా ప్రమాణాల విభాగం డైరెక్టర్ బి.శిరీష, ఓఎస్డీ ఆచార్య ఎస్.జితేందర్కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె వివాహాం.. హాజరైన ప్రముఖులు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
- పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఏం చేశారు: బండి సంజయ్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
- నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా 18న విడుదల నవంబరులో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం పది గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది.
- సయ్యంటోంది.. సైనిక కీటకం మినీ జెట్ ఫైటర్ లాంటి ఆకారం.. సైనికుడి దుస్తుల్లాంటి రెక్కలతో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టుగా ఉన్న ఈ కీటకం ఒలియాండర్ హాక్ మాత్.
- ఆ పల్లెలో పాలు కొనరు.. పంచుకొంటారు! గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఇంటా పాలప్యాకెట్ కొనుగోలు తప్పనిసరి అయిన రోజుల్లో అక్కడ పాలప్యాకెట్ కొనడం మచ్చుకైనా కనిపించదు.
- నీటి హక్కులపై రాజీ లేదు కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటాలో.. రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు.
- ‘నిషేధం’... అయోమయం! రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు ఆస్తులు, భూములు చేరడం వాటి యజమానులను అయోమయానికి గురిచేస్తోంది.
- ఆరు నెలలకో పోటీ పరీక్ష నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటల్లో పడొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. ఆరు నెలలకో పోటీ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
- ఏఎస్డీడీ ఓట్లపై రాజకీయ పార్టీల దృష్టి! సేకరించడానికి వీలులేని(అన్ కలెక్టబుల్) జాబితాలో ఉంచిన ఓటర్లపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.
- గోల్కొండ కోటలో మువ్వన్నెల రెపరెపలు ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం గోల్కొండ కోటలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల సందర్భంగా కోటను అందంగా తీర్చిదిద్దారు.
- చురుగ్గా కొత్త కోర్టుల నిర్మాణం ప్రజలకు నాణ్యమైన, సత్వర న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ వెల్లడించారు.
- ఊరూరా తారు రోడ్లు దేశంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) విధానంలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
- దేశంలో కీలక గ్రోత్ ఇంజిన్గా తెలంగాణ: గవర్నర్ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
- రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ వ్యవసాయాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
- రూ.525 కోట్ల పనులు... ముగ్గురే ఇంజినీర్లు కొత్త మార్కెట్లు, భవనాలు, గోదాములు, షెడ్లు, ప్లాట్ఫారాల నిర్మాణాలు ఇలా... 33 జిల్లాల్లో రూ.525.86 కోట్ల పనులు కొనసాగుతున్నాయి.
- ఈ-ఆటో.. రైట్ రైట్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్య నియంత్రణ, హరిత రవాణా లక్ష్యంగా పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్గా మార్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.
- స్మార్ట్ రేషన్కార్డులతో పారదర్శకత మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమే రాష్ట్రవ్యాప్తంగా 3.4 కోట్ల మందికి స్మార్ట్ రేషన్కార్డులు పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
- చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి రాజకీయ లబ్ధి కోసం దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని, కేంద్రంలోని భాజపా నియంతృత్వ వైఖరిని ప్రతి పౌరుడు ప్రశ్నించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పిలుపునిచ్చారు.
- కేంద్ర పథకాల్లో సీఎం ఫొటో పెట్టాలి జీఎస్టీతోపాటు ఇతర విధానాల్లో కేంద్రప్రభుత్వానికి రాష్ట్రం నుంచి పెద్దమొత్తంలో పన్నులు చెల్లిస్తున్నందున రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టాలని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు.
- మేమిచ్చిన రైతుబంధు నిధులే ఎక్కువ కేసీఆర్ ప్రభుత్వంలో రెండేళ్లలో ఇచ్చిన రైతుబంధు నిధుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ.15 వేల కోట్లు తక్కువ ఇచ్చిందని భారాస శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.