భారతీరాజా పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం విజయ్‌

Eenadu icon
By Entertainment Team Updated : 10 Jun 2026 12:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా నేడు తుది శ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. తమిళనాడు సీఎం విజయ్‌ ( Vijay) అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. భారతీరాజా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సంతాపం తెలిపారు.

  • ‘ఆమె’ అందానికి ముగ్ధుడై.... భారతీరాజా సినీ ప్రస్థానమిది..

డీఎంకే అధినేత స్టాలిన్‌, సినీ నటి రాధిక కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమిళ సినిమా పంథాను మార్చి, కొత్త ధోరణిని సృష్టించిన గొప్ప కళాకారుడు భారతీరాజా మరణం తమిళ చిత్రసీమకు తీరని లోటన్నారు. స్టూడియోలకే పరిమితమైన కెమెరాలను గ్రామాల్లోకి తీసుకెళ్లి, గ్రామీణ ప్రజల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించి తమిళ సినిమాను వాస్తవికతకు అద్దం పట్టేలా చేశారన్నారు. ఆయన చిత్రాలు భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని, ఆయన ఎన్నోతరాలకు స్ఫూర్తి అని గుర్తుచేసుకున్నారు.

చిత్రరంగానికి తీరని లోటు:  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

భారతీరాజా మరణంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. భారతీరాజా 4 దశాబ్దాల పాటు చలనచిత్రరంగంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. దర్శకుడిగా, నటుడిగా భారతీరాజా విశేషఖ్యాతి గడించారని గుర్తుచేసుకున్నారు. వైవిధ్యమైన, సందేశాత్మక చిత్రాలను వివిధ భాషల్లో తెరకెక్కించారని అన్నారు. భారతీయ చలనచిత్రరంగానికి విశిష్ట సేవలందించారని తెలిపారు. ఆయన మరణం చిత్రరంగానికి తీరని లోటని విచారం వ్యక్తంచేశారు.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 11:42 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తా: రాఘవ లారెన్స్‌ Raghava Lawrence: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్‌ కీలక ప్రకటన చేశారు.
  • నాని చిత్రంలో రుక్మిణి? ‘సప్త సాగరాలు దాటి’, ‘కాంతార 2’ లాంటి విజయవంతమైన చిత్రాలతో దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రుక్మిణీ వసంత్‌. ప్రస్తుతం ఆమె చేతుల్లో యశ్‌ ‘టాక్సిక్‌’, ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ లాంటి భారీ చిత్రాలున్న సంగతి తెలిసిందే.
  • చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అప్పుడే! ‘‘నేను ఎప్పుడూ నా సామర్థ్యానికి మించిన స్థాయిలోనే పనిచేశా. కానీ ఒకానొక సమయంలో అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింద’’ని అంటోంది బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌. కథానాయికగానే కాకుండా దర్శకురాలిగా కూడా సత్తా చాటుతోంది. ఇటీవల ‘భారత్‌ భాగ్య విధాత’లో నటించింది.
  • అస్సాం అమ్మాయిని కదా అందుకే సవాల్‌ ‘‘బలమైన భావోద్వేగాలతో నిండిన చక్కటి కుటుంబ కథా చిత్రం ‘కొత్త మలుపు’’ అంది కథానాయిక భైరవి. ఈ టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ సినిమా తన సినీ ప్రయాణానికి ఓ కొత్త మలుపులా నిలుస్తుందని నమ్మకంతో చెబుతోంది.
  • అలా అంటే కుర్చీలోనే కూర్చునేవాణ్ని ! ‘‘ఈతరం ప్రేక్షకులకు సింగీతం శ్రీనివాసరావు అందిస్తున్న కానుక ‘సింగ్‌ గీతం’’ అన్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇలాంటి చిత్రం ఇంత వరకు రాలేదని.. మరో 10ఏళ్ల తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చేశామని తెలిపారు.
  • బంగారం.. రాకకు సిద్ధం ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది నటి సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని నందినీ రెడ్డి తెరకెక్కించారు. ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై రాజ్‌ నిడిమోరు, సమంత, హిమాంక్‌ దువ్వూరు నిర్మించారు.
  • మనల్ని ప్రేమలో పడేలా చేసే జంట హృదయాల్లోకి చొచ్చుకెళ్లే ఓ మంచి ప్రేమకథతో  ‘దీవాన’  తెరకెక్కిందన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. ఆయనతోపాటు కథానాయకుడు విష్వక్‌సేన్, నిర్మాత ధీరజ్‌  మొగిలినేని ముఖ్య అతిథులుగా గురువారం హైదరాబాద్‌లో ‘దీవాన’ ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుక జరిగింది.
  • కడలినే శాసించేవాడు.. విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘మకుటం’. ఆర్బీ చౌదరి నిర్మాత. దుషార విజయన్, అంజలి కథానాయికలు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • టెన్షన్‌ ఔట్‌.. నవ్వులకు ‘వెల్‌కమ్‌’ అడవిలో ఒక నకిలీ సినిమాను తన తోటి నటులతో కలిసి చిత్రీకరిస్తున్నారు అక్షయ్‌ కుమార్‌. మొదట్లో వారంతా తన సహ నటులే అని భావించినప్పటికీ.. తర్వాత వారంతా బందిపోట్లని తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ సినిమా చూడాల్సిందే.
  • ‘జైలర్‌ 2’లో అతిథిగా హృతిక్‌ రోషన్‌? టైగర్‌ కా హుకూం.. అంటూ ‘జైలర్‌’ చిత్రంతో తనదైన స్టైల్‌లో అలరించారు రజనీకాంత్‌. దీనికి సీక్వెల్‌గా ‘జైలర్‌ 2’ రూపొందుతుంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించింది చిత్రబృందం.
  • సంక్షిప్త వార్తలు (3) పవన్‌ మహావీర్‌ కథానాయకుడిగా... శివాల ప్రభాకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి’. వర్షిక, సుహానా కథానాయికలు. సుమన్, రావు రమేశ్, రాజీవ్‌ కనకాల, సత్యకృష్ణ, సుజాత కీలక పాత్రధారులు.
  • పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ‘ఓజీ2’ అప్‌డేట్‌..! పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా సుజీత్‌దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘ఓజీ’ (They Call Him OG).
  • అప్పుడు హీరోయిన్‌.. ఇప్పుడు హీరోయిన్‌ తల్లి.. నవ్వులు పంచిన అక్షయ్‌ వెండితెరపై బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) యాక్షన్‌తో ఎంత మెప్పిస్తారో, కామెడీతోనూ అంతే నవ్వులు పంచుతారు.
  • తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన భీష్మాచార్యుడు: సింగ్‌ గీతంపై చిరు పోస్ట్‌ తెలుగు సినిమా పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు భీష్మాచార్యుడని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
  • సింగర్‌ జిమ్‌ లక్ష్యంగా బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కాల్పులు దిల్లీలోని పశ్చిమ్‌ విహార్‌లో 24హెచ్‌ఎస్‌ ఫిట్‌నెస్‌ వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
  • ‘ధురంధర్’లో ఆ అంశాలు నచ్చాయి: పవన్‌ కల్యాణ్ ప్రశంసలు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో సూపర్‌ హిట్‌ అందుకున్న చిత్రం ‘ధురంధర్‌’.
  • దిగ్గజ దర్శకుడు భారతీరాజాకు ప్రధాని మోదీ నివాళి దర్శకుడు భారతీరాజా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
  • డబ్బులు తీసుకొని ప్రచారం చేయట్లేదు.. ఆరోపణలపై నటి స్పందన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌పై దర్శకుడు సంజీవ్‌ మేగోటి ఇటీవల చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
  • భారతీరాజా మీరే నా సర్వస్వం.. ఈ బాధ ఎలా తట్టుకోవాలి: రాధిక భావోద్వేగం దిగ్గజ దర్శకుడు భారతీరాజా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయనతో నటి రాధికకు (Radika) విడదీయరాని అనుబంధం ఉంది. భారతీరాజాను తన గురువుగా భావించే రాధిక సందర్భం వచ్చినప్పుడల్లా ఆయనపై ఉన్న అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉంటారు.
  • దివికేగిన దర్శక దిగ్గజం వెండితెరపై పల్లెటూరి అందాలను, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఎంతో సహజంగా, హృద్యంగా ఆవిష్కరించి ఓ కొత్త ఒరవడి సృష్టించిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా (84) ఇకలేరు.