‘సేమ్‌ పించ్‌!’.. నెతన్యాహు- మోదీ మధ్య సరదా సన్నివేశం

Eenadu icon
By National News Team Published : 26 Feb 2026 00:03 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi) ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. బెన్‌-గురియన్‌ విమానాశ్రయంలో దిగిన మోదీకి.. ఆ దేశ ప్రధాని నెతన్యాహు దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మోదీ కోటు పాకెట్‌ స్క్వేర్‌ రంగు, తన సతీమణి సారా ధరించిన డ్రెస్సు రంగు.. రెండూ మ్యాచ్‌ అవుతున్నట్లు నెతన్యాహు గుర్తించారు. ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అనంతరం నెతన్యాహుతో మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపినట్లు మోదీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. సాంకేతికత, జలవనరుల నిర్వహణ, వ్యవసాయం తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ పరిణామాల గురించి కూడా మాట్లాడినట్లు చెప్పారు. అంతకుముందు ప్రవాస భారతీయుల సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. 


► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ‘టైమ్‌ బ్యాంక్‌’.. ఇక్కడ సమయమే పొదుపు! కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఓ వినూత్న బ్యాంకు ఏర్పాటైంది.
  • సైగలతో సమాచారం.. పదిలో ఉత్తీర్ణత పొందాలని తాపత్రయం కేవలం 1.5 అడుగుల ఎత్తులో ఉన్న ఓ దివ్యాంగ బాలిక పదో తరగతి పరీక్షలు రాస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది.
  • ఎన్‌సీఈఆర్‌టీ వివాదం.. ప్రధాని మోదీ అసంతృప్తి! జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’పై ఒక అధ్యాయం ప్రచురించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
  • కోల్‌కతా మెట్రోలో ‘బ్యాటరీ’ సిస్టమ్‌.. దేశంలోనే తొలిసారి మెట్రో రవాణా వ్యవస్థ విషయంలో కోల్‌కతా మెట్రో దేశంలోనే తొలిసారి ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌’ (BESS)ను తీసుకొచ్చింది.
  • ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదు: NCERT పాఠ్యాంశం వివాదం వేళ కేంద్రం స్పందన NCERT Row: ఎన్‌సీఈఆర్‌టీ వివాదంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. 
  • వాయుసేన విన్యాసాలు.. ‘ప్రచండ్‌’లో ప్రయాణించనున్న రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జైసల్మేర్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను సందర్శించనున్నారు.
  • బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
  • పాక్‌ ఊహల్లో బతుకుతున్నట్లుంది : భారత్‌ చురకలు India Hits back at Pakistan: జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిని చూడలేదంటే పాక్‌ ఊహల్లో విహరిస్తూ ఉండొచ్చంటూ భారత్ ఎద్దేవా చేసింది. 
  • స్కూల్‌లో ఆడుతూ కుప్పకూలి.. 9 ఏళ్ల బాలికకు కార్డియాక్‌ అరెస్ట్‌ Girl Dies of Cardiac Arrest: రాజస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌లో ఆడుకుంటూ కుప్పకూలి ఓ 9 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
  • న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది: NCERT వివాదాస్పద బుక్‌ను నిషేధించిన సుప్రీం Chief Justice Slams NCERT: ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశం వివాదంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. 
  • రూ.102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసు.. ఛార్జ్‌షీట్‌లో నటి రన్యారావు పేరు Actor Ranya Rao: కన్నడ నటి రన్యారావు మరింతగా చిక్కుల్లో పడింది.
  • ఇన్‌స్టాలో మోదీ క్రేజ్‌.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటింది.
  • పదో తరగతి పత్రాలతోనూ ఓటరు గుర్తింపు నిర్ధరణ అర్హులైన ఓటర్లుగా నిరూపించుకోవడానికి ప్రజలు పదో తరగతి ప్రవేశ (అడ్మిట్‌) కార్డు, ఉత్తీర్ణత ధ్రువీకరణనూ అనుబంధ పత్రంగా ఎన్నికల అధికారులకు సమర్పించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • కాశీలో గంగమ్మ అలలపై ..మెక్సికో జంటకు పడవ పెళ్లి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షితులు అవుతున్న ఎన్నో విదేశీ జంటలు వారణాసి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను వేదికగా చేసుకొని ఒక్కటవుతున్నాయి.
  • దేశాల పరస్పర సహకారానికి మిలన్‌ దోహదం హిందూ మహాసముద్రంలో దేశాల నడుమ మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు నిర్వహించిన ‘మిలన్‌-2026’ విన్యాసాలు విజయవంతంగా ముగిశాయని ఫ్లీట్‌ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ అలోక్‌ ఆనంద అన్నారు.
  • సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఏడీఎన్‌ రావు కన్నుమూత సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఏడీఎన్‌ రావు అనారోగ్యంతో బుధవారం మరణించారు. మూడు దశాబ్దాలపాటు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తి కొనసాగించిన ఆయన గ్రీన్‌ లాయర్‌గా ప్రసిద్ధి పొందారు.
  • దేశంలో మొట్టమొదటి దివ్యాంగుల నటనాలయం అస్సాంకు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ రాజీవ్‌ కుమార్‌ సౌద్‌ దివ్యాంగులకు నటనలో మెళకువలు నేర్పించడమే కాకుండా, ఇతర రంగాల్లోనూ వారు స్వావలంబన సాధించి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రోత్సహిస్తున్నారు.
  • దిల్లీలో దక్షిణాసియా టూరిజం ఎగ్జిబిషన్‌.. ప్రత్యేక ఆకర్షణగా రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్‌ దక్షిణాసియా ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఎక్స్ఛేంజ్‌ (ఎస్‌ఏటీటీఈ- 2026) 33వ ఎగ్జిబిషన్‌ దిల్లీలోని యశోభూమిలో బుధవారం ప్రారంభమైంది.
  • డీజీసీఏదీ తప్పే: రోహిత్‌ పవార్‌ మహారాష్ట్రలోని బారామతి వద్ద గత నెల 28న జరిగిన విమాన దుర్ఘటనలో మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ సహా అయిదుగురి దుర్మరణానికి ‘పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌’ (డీజీసీఏ) తప్పిదం కూడా కారణమని ఎన్సీపీ (ఎస్పీ) శాసనసభ్యుడు రోహిత్‌ పవార్‌ ఆరోపించారు.
  • బ్రిటన్‌ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి బ్రిటన్‌ వెళ్లాలనుకునే వారికి బుధవారం నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. పర్యాటకులు ఎలక్ట్రానిక్‌ వీసా (ఇ-వీసా)లను కలిగి ఉండటాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది.