ఆంథ్రోపిక్.. అనతి కాలంలోనే టెక్ దిగ్గజాలను అధిగమించి!

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: టెక్ రంగంలో ‘ఆంథ్రోపిక్’ ఏఐ (Anthropic AI) ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త ఏఐ మోడళ్లతో కంపెనీలను ఆకర్షిస్తోంది. దీంతో ఆ సంస్థ మార్కెట్ విలువ అనతికాలంలోనే రికార్డు స్థాయికి చేరింది. ఐదేళ్ల క్రితం స్టార్టప్గా ప్రారంభమైన ఆ సంస్థ.. మార్కెట్ విలువలో అనేక టెక్ దిగ్గజాలను మించిపోతోంది. తాజాగా ఆంథ్రోపిక్ విలువ 380 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా.
ఓపెన్ఏఐ (OpenAI) నుంచి బయటకు వచ్చిన కొందరు పరిశోధకులు 2021లో ఆంథ్రోపిక్ ఏఐని స్థాపించారు. క్లాడ్ (Claude) బ్రాండ్ కింద కొత్త ఏఐ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సొంతగా కోడ్ రాయడం, సాఫ్ట్వేర్లో లోపాలను పరిష్కరించడం, డేటా అనాలసిస్తోపాటు కఠినమైన టాస్క్లను కూడా పూర్తిచేసే సామర్థ్యమున్నట్లు చెబుతోన్న సంస్థ.. ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు సవాల్ విసురుతోంది.
అయినప్పటికీ ఈ ఏఐ టూల్స్ వల్ల వేగంగా పని జరగడంతోపాటు ఖర్చులు తక్కువయ్యే అవకాశం ఉండడంతో అనేక కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సిరీస్ జీ నుంచి 30 బి.డాలర్లు పెట్టుబడులు సేకరించడంతో సంస్థ విలువ 380 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆంథ్రోపిక్ ఓ ప్రకటనలో పేర్కొంది. మూడేళ్ల క్రితం ఒక డాలర్తో మొదలైన ఆదాయం ప్రస్తుతం 14 బిలియన్ డాలర్లకు పెరిగిందని తెలిపింది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వజ్రపుటుంగరం కొనేద్దాం అసలే పెళ్లిళ్ల సీజను. ఆభరణాలు కొనకుండా ఉండలేని పరిస్థితి. అయితే బంగారం ఉంగరం బదులుగా వజ్రపుటుంగరం వైపు దృష్టి పెట్టేందుకు వజ్రాల ధరలు వీలు కల్పిస్తున్నాయి.
- భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనా? ఇరాన్లోని పలు లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడులు పశ్చిమాసియాలో భద్రతాపరమైన ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి.
- హార్డ్వేర్లోనూ బలమైన శక్తిగా భారత్ గుజరాత్లోని సనంద్లో మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీ కండక్టర్ ప్లాంట్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సాఫ్ట్వేర్లో బలమైన శక్తిగా ఎదిగిన తర్వాత, హార్డ్వేర్ రంగంలో కూడా దేశం తన గుర్తింపును దృఢంగా నిర్మిస్తోందని ఆయన తెలిపారు.
- ఆంథ్రోపిక్కు ట్రంప్ షాక్ కృతిమ మేధ(ఏఐ) టూల్స్తో ప్రపంచాన్నే ఆకర్షించిన అమెరికా కంపెనీ ఆంథ్రోపిక్కు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. ఆంథ్రోపిక్కు చెందిన ఏఐ సాంకేతికతను వినియోగించడాన్ని ఆపాలని అన్ని అమెరికా ప్రభుత్వ విభాగాలను ఆయన ఆదేశించారు.
- ప్రయాణాల్లో మార్పులకు సిద్ధపడాల్సిందే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గగనతల ఆంక్షలు, మార్గ మళ్లింపుల వల్ల విమాన కార్యకలాపాలకు అంతరాయాలు చోటుచేసుకోనున్నాయి.
- స్కైరూట్ నుంచి ధావన్-3 క్రయోజెనిక్ ఇంజిన్ అంతరిక్ష రంగంలోని స్కైరూట్ ఏరోస్పేస్ అత్యంత ఆధునిక ‘ధావన్-3’ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. దాదాపు 145 సెకన్లపాటు నిర్వహించిన సామర్థ్య పరీక్ష..
- ఈ ఏడాది వేతనాల్లో 9.1% వృద్ధి ప్రస్తుత సంవత్సరం(2026)లో వేతనాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. గత సంవత్సరంలో నమోదైన 8.9% వేతన పెంపు కంటే ఇది ఎక్కువే. వార్షిక వేతన పెంపు అంశంపై అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఏఓఎన్ ఈ సర్వేను నిర్వహించింది.
- జనవరిలో విమాన ప్రయాణికులు 1.52 కోట్లు 2026 జనవరిలో దేశీయ విమాన ప్రయాణికులు 2025 జనవరితో పోలిస్తే 4.36 శాతం పెరిగి 1.529 కోట్లకు చేరారని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది.
- భారత ఈవీ రంగంలోకి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు గత ఐదేళ్లలో భారత విద్యుత్ వాహన (ఈవీ) రంగం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్ (ఐఈఈఎఫ్ఏ) నివేదిక తెలిపింది.
- సంక్షిప్తవార్తలు 2035 నాటికి నికర శూన్య ఉద్గారాలను లక్ష్యంగా చేసుకున్నందున, పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను విస్తరించడంలో సాయపడే పవన విద్యుత్ ప్రాజెక్టును మహారాష్ట్రలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని గెయిల్ ఇండియా రూ.1,736.25 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.
- తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (28/02/2026) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి..
- వివో బాటలో రెడ్మీ, పోకో.. స్మార్ట్ఫోన్ ధరల పెంపు! స్మార్ట్ఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్న్యూస్. చైనాకు చెందిన రెడ్మీ, పోకో కూడా స్మార్ట్ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
- భౌగోళిక ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే సుమారు రూ.7 వేలు పెరిగి రూ.1,73,500కు చేరింది.
- సిమ్ లేకుంటే వాట్సప్ బంద్.. 1 నుంచి ఈ రైల్వే యాప్ క్లోజ్! ఇంటర్నెట్ డెస్క్: ప్రతినెలా క్యాలెండర్ మారడంతో పాటు ఆర్థికపరంగా కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయియ. వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. అలా మార్చి ఒకటి నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. సిమ్ బైండింగ్, యూపీఐకి సంబంధించిన రూల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
- మాట వినలేదని ఆంథ్రోపిక్ను వెళ్లగొట్టిన ట్రంప్.. ఓపెన్ఏఐతో అగ్రిమెంట్ OpenAI-Anthropic: ఓపెన్ ఏఐతో పెంటగాన్ ఒప్పందం కుదుర్చుకుంది.
- పెట్టుబడులు పెట్టండి.. బడ్జెట్ ప్రయోజనాలు పొందండి ప్రభుత్వం మూలధన వ్యయాలు పెంచుతున్న తరుణంలో, అంతర్జాతీయంగా పోటీ పడేందుకు ప్రైవేటు రంగమూ వినూత్న ఉత్పత్తుల కోసం పెట్టుబడులు అధికం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు.
- ‘జీడీపీ’ గణాంకాలు మారాయ్ మనదేశం అమల్లోకి తెచ్చిన కొత్త జీడీపీ సిరీస్ కారణంగా వృద్ధిరేటు అంచనాలు, వృద్ధి గణాంకాల్లో మార్పులొచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను అంతక్రితం అంచనా అయిన 7.4% నుంచి 7.6 శాతానికి సవరించారు.
- పబ్లిక్ ఇష్యూకు భారత్ బయోటెక్! హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్, తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
- ఫండ్ విలువలపై ఇన్ఫోసిస్ షేరు సెగ దేశీయ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ షేరు, దశాబ్దకాలంలోనే అత్యంత పేలవ ప్రదర్శనను ఈ నెలలో కనబర్చింది. ఫిబ్రవరిలో ఈ షేరు విలువ 20.75% క్షీణించింది.
- రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పోటెత్తాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా స్టాక్మార్కెట్లను ఏఐ, ద్రవ్యోల్బణ భయాలు నష్టపరచిన నేపథ్యంలో, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా మారడం ఇందుకు నేపథ్యం.