రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత వినియోగంపై చర్చ

Eenadu icon
By Business News Desk Published : 23 Feb 2026 00:06 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

దిల్లీ: రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత వినియోగంపై భారత సైన్యంలోని ఉన్నతాధికార్లు, విధాన రూపకర్తలు, సాంకేతికత భాగస్వాములు, సంస్థల ప్రతినిధులు చర్చించనున్నారు. వచ్చే వారం దిల్లీలో జరగనున్న డిఫ్‌శాట్‌ నాలుగో ఎడిషన్‌ సదస్సు ఇందుకు వేదిక కానుంది. జాతీయ భద్రతలో అంతరిక్ష రంగ పాత్రపై ఫిబ్రవరి 24-26 వరకు మానేక్‌షా సెంటర్‌ వద్ద ఈ సదస్సు జరగనుంది. ‘అంతర్జాతీయంగా 50కి పైగా దేశాలు మిలిటరీ లేదా డ్యుయల్‌ యూజ్‌ శాటిలైట్‌లను ఉపయోగిస్తున్నాయి. శత్రు దాడులను నిరోధించడం, ఎదుర్కొనే సన్నద్ధత విషయంలో అంతరిక్ష సాంకేతికత కూడా కీలకంగా మారింద’ని శాట్‌కామ్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌  (ఎస్‌ఐఏ) ఇండియా ప్రెసిడెంట్‌ సుబ్బారావు పావులూరి తెలిపారు. 

డిఫ్‌శాట్‌-2026 సదస్సులో సుమారు 20 దేశాల నుంచి 500 మంది పాల్గొననున్నారు. 20 మందికి పైగా వక్తలు, సుమారు 60 సంస్థల ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. కాగా.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల సమర్పించిన బడ్జెట్లో రక్షణ రంగానికి గణనీయంగా రూ.7.85 లక్షల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సదస్సు జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశ రక్షణ విషయంలో ముందస్తు సన్నద్ధత కోసం భారత్‌ భారీగా వెచ్చిస్తోందనడానికి ఈ కేటాయింపులే సంకేతమని ఎస్‌ఐఏ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌ ప్రకాశ్‌ తెలిపారు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అనిల్‌ అంబానీ రూ.3,716 కోట్ల నివాసం జప్తు మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి చెందిన ముంబయి నివాసం ‘అబోడ్‌’ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. దీని విలువ రూ.3716 కోట్లు.
  • ఏఐపై మాకు ఆందోళన లేదు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతపై తమకు ఆందోళన లేదని ఐటీ సేవల దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈఓ కృతివాసన్‌ తెలిపారు. తమ ఉద్యోగులు ఏఐ టూల్స్‌ వాడటం వల్ల, తాము ఆదాయాలు కొంత కోల్పోయినా పర్లేదని అన్నారు.
  • మన ‘సోలార్‌’పై అమెరికా 126% సుంకం మనదేశం నుంచి ఎగుమతి అవుతున్న కొన్ని సౌర విద్యుదుత్పత్తి వస్తువులపై అమెరికా 125.87%  ప్రాథమిక కౌంటర్‌వెయిలింగ్‌ సుంకాన్ని (సీవీడీ) ప్రకటించింది. భారత్‌ ఆయా వస్తువులపై సహేతుకం కాని రీతిలో సబ్సిడీలు ఇవ్వడమే ఇందుకు కారణమంది.
  • 5 ఏళ్లలో 10.1 కోట్ల చ.అడుగులు మనదేశంలోని 7 ప్రధాన నగరాల్లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు కోసం విదేశీ కంపెనీలు దాదాపు 10.1 కోట్ల చ.అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఇందులో అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సంస్థలే అధికంగా ఉన్నాయని స్థిరాస్తి సేవల సంస్థ కొలియర్స్‌ వెల్లడించింది.
  • సెమాగ్లుటైడ్‌ రేసులోకి డాక్టర్‌ రెడ్డీస్‌ మనదేశంలోనూ మధుమేహం, ఊబకాయ చికిత్సల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ విభాగంలో, ఇప్పటివరకు ఖరీదు ఎక్కువగా ఉన్న మందులు సామాన్యులకూ అందుబాటులోకి రానున్నాయి. బ్రాండెడ్‌ ఔషధాలపై పేటెంట్, వచ్చే నెల 21తో ముగియనుంది.
  • ఒడుదొడుకుల్లో స్వల్ప లాభాలు ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో, దేశీయ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మన దేశ సోలార్‌ వస్తువులపై అమెరికా 126% దిగుమతి సుంకాలను విధించడం, మదుపర్ల లాభాల స్వీకరణకు కారణమైంది.
  • అరుదైన భూఖనిజాల వెలికితీతకు7 క్షేత్రాల గుర్తింపు: ఎస్‌ఈసీఎల్‌ అరుదైన భూఖనిజాల అన్వేషణ నిమిత్తం 7 గనుల డంప్‌లను గుర్తించినట్లు కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ అయిన సౌత్‌ ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఎల్‌) తెలిపింది.
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ మోసం కేసులో నలుగురి అరెస్ట్‌ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో రూ.590 కోట్ల మోసం వ్యవహారానికి సంబంధించి నలుగురిని హరియాణా రాష్ట్ర విజిలెన్స్, యాంటీ కరప్షన్‌ బ్యూరో అరెస్ట్‌ చేసింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో గతంలో మేనేజర్‌గా పనిచేసిన రిభవ్‌ రిషి,
  • రూ.2.7 లక్షల కోట్ల స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు గతేడాది మనదేశం నుంచి 30 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.7 లక్షల కోట్ల) విలువైన  స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం పేర్కొన్నారు.
  • సంక్షిప్త వార్తలు(5) ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం స్పెక్ట్రమ్‌ను తదుపరి వేలానికి ఉంచాల్సిందిగా, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
  • యాపిల్, మైక్రోసాఫ్ట్‌ షేర్లు మనమూ కొనేయొచ్చు దేశీయ మదుపర్లు, అమెరికా స్టాక్‌ మార్కెట్లో షేర్లను నేరుగా కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ), తన ఎన్‌ఎస్‌ఈ ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌ (ఐఎక్స్‌)లో ఒక ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది.