ఏ‘మందు’రు.. ఈ దారుణాన్ని?.. కాలం చెల్లిన ఔషధాలకు కొత్త తేదీలు

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Published : 22 Feb 2026 06:56 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

కాలం చెల్లిన ఔషధాలకు.. నకిలీ స్టాంపులతో కొత్తగా మళ్లీ తేదీలను మార్చేసి మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. విజయవాడ, విశాఖ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు రెండు రోజులుగా నిర్వహించిన దాడుల్లో ఈదారుణం వెలుగుచూసింది. సత్యనారాయణపురంలో ‘డైకాన్‌ హెల్త్‌ కేర్‌’ ఔషధాల హోల్‌సేల్‌ సరఫరా సంస్థలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కళ్లుబైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి.

తొమ్మిది రకాల మందులకు...

మధుమేహం, గ్యాస్‌ సమస్యలకు వాడే తొమ్మిది రకాల మందులకు గడువు తేదీలు, వివరాలన్నీ నకిలీ రబ్బరు స్టాంపుల సాయంతో మార్చేస్తున్నారు. ఈ మందులకు ఇంకా గడువు 1, 2 నెలలు ఉండగానే.. మరో ఆరు నెలలు అదనంగా పెంచేస్తూ.. నకిలీ ముద్రలు వేస్తున్నారు. డైకాన్‌ సంస్థ నుంచి రూ.4 లక్షల విలువైన మందులు.. 22 నకిలీ స్టాంపులు, మందులపై పాత వివరాలను చెరిపేందుకు వినియోగించే షినాలిక్‌ డీ13ఎక్స్‌ ఎన్‌సీ టిన్నర్, మార్చేసిన బ్యాచ్‌ నంబర్లు, తయారీ తేదీలు, గడువు తేదీల మద్రలతో కూడిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆర్‌ఎంపీలు లైసెన్స్‌లు లేకుండా..

జిల్లాలో పలువురు ఆర్‌ఎంపీలు కూడా లైసెన్స్‌ లేకుండా పెయిన్‌ కిల్లర్‌ మందు బిళ్లలు, ఇంజక్షన్లు, యాంటీ బయాటిక్స్‌ విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. వీరిపైనా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

  • జగ్గయ్యపేట మండలం బలుపుపాడులో ఆర్‌ఎంపీ వల్లంకొండ గోపి వద్ద రూ.లక్ష విలువైన మందులను పట్టుకుని సీజ్‌ చేశారు.
  • జగ్గయ్యపేటలో తజ్‌ క్లినిక్‌ పేరుతో వైద్య సేవలు అందిస్తున్న ఆర్‌ఎంపీ షేక్‌ తాజుద్దీన్‌ నుంచి రూ.2 లక్షల విలువైన మందులు స్వాధీనం చేసుకున్నారు.
  • పెనుగంచిప్రోలు మండలం తోటచర్లలో ఆర్‌ఎంపీ బిత్రా బాలకృష్ణ వద్ద రూ.లక్షల విలువైన మందులను సీజ్‌ చేశారు.
  • దాడుల్లో జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సహాయ సంచాలకులు పి.శ్రీరామమూర్తి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు డి.సునీత, ఎ.కృష్ణ, కె.వి.భూపేష్, బి.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
► Read latest Amaravati krishna Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఎనిమిది మందికి గాయాలు [ 26-02-2026] ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామంలో రెండు వర్గాల మధ్య బుధవారం అర్ధరాత్రి ఘర్షణ జరిగింది.
  • 27న ఆయేషా శరీర అవశేషాల ఖననం [ 26-02-2026] ఆయేషామీరా శరీర అవశేషాలను ఖననం చేసేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సీబీఐ అధికారులు గుంటూరు ఎస్పీ, తెనాలి తహసీల్దారును కోరారు.
  • ప్రమాదాలకు నిలుపుటద్దం! [ 26-02-2026] జాతీయ రహదారులపై అడ్డదిడ్డంగా ఆపేస్తున్న వాహనాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మంచు, చీకటి కమ్మేసిన వేళ వాహనాలున్న విషయం గుర్తించలేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
  • పట్టుదలతో చదువు.. పదింతల సులువు [ 26-02-2026] పది పరీక్షల గడువు సమీపిస్తోంది. ఆయా సబ్జెక్టుల వారీగా ఉన్న సందేహాలు నివృత్తి చేసేందుకు ఈనాడు, ఈటీవీ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో నిర్వహించిన ఫోన్‌ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
  • పేదల గూడు.. కష్టాలు చూడు.. [ 26-02-2026] పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందిస్తున్నా.. నిర్మాణ ప్రగతి అంతంతమాత్రమే.
  • మచ్చు పేరుతో మస్తు దోపిడీ [ 26-02-2026] మిర్చియార్డులో మచ్చు పేరిట దోపిడీకి అడ్డుకట్ట పడడం లేదు. యంత్రాంగం కళ్లెదుటే రైతన్నలు మోసపోతున్నా.. కళ్లప్పగించి చూడడమే తప్ప కట్టడికి ప్రయత్నించడం లేదు.
  • వైద్యాన్ని వృత్తిగా కాదు.. సేవగా చూడండి [ 26-02-2026] వైద్య వృత్తికి నైతికత, కరుణ, అనుభూతి మూడు ప్రాథమిక స్తంభాలు. నైతికతతో పనిచేయడం, కరుణతో చికిత్స చేయడం ద్వారా రోగులు అనుభూతి చెంది మందుల కంటే వైద్యుడి మాటలు, ప్రవర్తనను ఎక్కువగా గుర్తించుకుంటారని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు.
  • 13 ఖాతాలు.. రూ.8.50 కోట్ల లావాదేవీలు [ 26-02-2026] చట్టవ్యతిరేక లావాదేవీల బదిలీకి నిందితులు ఎక్కువగా కరెంట్‌ ఖాతాలనే ఎంచుకున్నారు. వీటితో ఎక్కువ మొత్తాల్లో లావాదేవీలను చేసేందుకు వీలుండడమే కారణం. తొమ్మిది నెలల్లో విజయవాడలో తెరిచిన ఖాతాల ద్వారానే రూ.8.50 కోట్ల నగదు బదిలీలు జరిగాయి.
  • ఇప్పుడు తల్లడిల్లి.. ఏం లాభం? [ 26-02-2026] అతను కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి. ఆన్‌లైన్‌లో పెట్టుబడి ప్రకటన చూసి.. నమ్మారు. ఇబ్బడిముబ్బడిగా లాభాలు వస్తాయనే ఆశతో పెట్టుబడులు పెట్టారు.
  • బందరులో పట్టపగలు భారీ చోరీ [ 26-02-2026] బందరు నగరంలో పట్టపగలు ఓ ఇంట్లో భారీ చోరీ జరగడం స్థానికంగా కలకలం రేకెత్తించింది. తాళం వేసి ఉన్న ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లో పెద్దఎత్తున బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి.
  • రూ.18 లక్షల విలువైన 122 చరవాణుల అప్పగింత [ 26-02-2026] ‘ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లి అపార్ట్‌మెంట్‌కు వచ్చాను. బూట్లు విడుద్దామని చరవాణి పక్కన పెట్టి తర్వాత మరిచిపోయి వెళ్లిపోయాను. 10 నిమిషాల తర్వాత చూస్తే అది కనిపించలేదు.
  • భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య [ 26-02-2026] వృద్ధాప్యంలో తండ్రికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఒక్కసారిగా వారు నివాసం ఉండే బహుళ అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్లాయపాలెంలోని టిడ్కో కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.