ఓటమే గెలుపునకు నాంది

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

బీర్కూర్ : ఓటమే రేపటి గెలుపునకు నాందిగా భావించాలని ఎంఈఓ వెంకన్న, సర్పంచి అరిగే ధర్మతేజ అన్నారు. బీర్కూర్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తుందని, కష్టపడి చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ పద్మ, ఉపాధ్యాయులు రాధాకృష్ణ , శివరాం, క్యాకయ్య, జయశ్రీ , రవంతి, గంగమణి తదితరులు పాల్గొన్నారు.
► Read latest Nizamabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :